సీఐడీ మాజీ డీజీపై సస్పెన్షన్ వేటు
న్యూస్తెలుగు/అమరావతి: ఊహించినట్లే జరిగింది. ఆంధ్రప్రదేశ్ సీఐడీ మాజీ డీజీ పీవీ సునీల్ కుమార్ (PV Sunil Kumar)పై సస్పెన్షన్ వేటు పడింది. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ (Vijaya Anand) ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. సీఐడీ డీజీగా ఉన్న సమయంలో సునీల్ కుమార్ 2019 నుంచి 2024 వరకు ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లడం.. అదే విధంగా విదేశాలకు వెళ్లే సమయంలో కొన్ని పర్యటనలకు అనుమతి తీసుకున్నప్పటికీ ట్రావెల్ ఫ్లానింగ్కు విరుద్ధంగా విదేశాల్లో ఉండడంతో ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై ప్రభుత్వం విచారణ జరిపించింది. ప్రాథమిక సాక్ష్యాధారాలు నిర్ణారణకావడంతో సునీల్ కుమార్ను సస్పెండ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆయనను సస్పెండ్ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. సునీల్ కుమార్ గత వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసినట్లు సమాచారం. (Story: సీఐడీ మాజీ డీజీపై సస్పెన్షన్ వేటు)
Follow the Stories:
Friday Fear: మరో వైసీపీ నేత అరెస్టుకు రంగం సిద్ధం!
రూ.520తో 10 లక్షలు, రూ. 755తో 15 లక్షలు
కొత్త రేషన్ కార్డులొస్తున్నాయి!
సిటీ కిల్లర్ వచ్చేస్తోంది! ముంబయికి ముప్పు?
సడెన్ డెత్: ఈ ఐఫోన్ మోడళ్లను నిలిపేసిన ఆపిల్!
నిరుద్యోగులకు మోదీ బంపర్ ఆఫర్!
మారిన జగన్ వ్యూహరచన: జగన్ 2.0 అంటే ఇదేనేమో!
మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?
జగన్ సెల్ఫీ కోసం ఏడ్చిన చిన్నారి! (Lovely Photos)
వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
వణికిస్తున్న కొత్త వైరస్!
శుక్రవారం గండం! వైఎస్ఆర్సీపీలో అలజడి
దుర్గగుడి లడ్డూ ప్రసాదంలో వెంట్రుకలు!
జైల్లో నా భర్తను.. టార్చర్ చేస్తున్నారు..!