UA-35385725-1 UA-35385725-1

ప్రజా వినతుల పరిష్కార వేదికకు స్పంద‌న‌

ప్రజా వినతుల పరిష్కార వేదికకు స్పంద‌న‌

న్యూస్‌తెలుగు/విజయనగరం: సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వినతుల పరిష్కార వేదిక నకు 14 వినతలు వచ్చాయి. పలువురు తమ సమస్యలను వెల్లడిస్తూ వినతి పత్రాలను నగరపాలక సంస్థ కమిషనర్ ఎంఎం నాయుడునకు అందజేశారు. ఆయా వినతుల పరిష్కారానికై సంబంధిత విభాగ అధికారులకు కమిషనర్ ఆదేశించారు.టౌన్ ప్లానింగ్ విభాగానికి 7 ,ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి 4, శానిటేషన్ కు సంబంధించి 2, హౌసింగ్ సంబందించి 1 వినతులు అందాయి. సిబ్బంది వినతులను స్వీకరించిన కమిషనర్ ఎంఎం నాయుడు సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు తెలిపారు.ప్రజల నుండి వచ్చిన వినతులను సాధ్యమైనంత త్వరగా పరిష్కారం అయ్యే దిశగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ అమ్మాజీ రావు, ప్రజారోగ్య అధికారి డాక్టర్ కొండపల్లి సాంబమూర్తి, ఈఈ కె.శ్రీనివాసరావు, రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు, వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. (Story: ప్రజా వినతుల పరిష్కార వేదికకు స్పంద‌న‌)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1