UA-35385725-1 UA-35385725-1

మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

న్యూస్‌తెలుగు/కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : కాగజ్ నగర్ మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మూడవ రోజు సర్ సిల్క్ జగ్జీవరావు చౌరస్తాలో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికుల యూనియన్ సి.ఐ.టి.యు జిల్లా అధ్యక్షులు శంకర్ కార్యదర్శి సంజీవ్, మాట్లాడుతూ మున్సిపల్ లో పనిచేస్తున్న నాన్ మాస్టర్ రోల్ కార్మికులకు గత నాలుగు నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు మూడు నెలలుగా వేతనాలు పీ,ఎఫ్ రెండు కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయనీ అవేదన వ్యక్తం చేశారు.గత ఆరు నెలల కిందట ఇద్దరు కార్మికులు చనిపోతే ఇంత వరకూ నయా పైసా కూడా చెల్లించలేదు, సమస్యలపై పలుమార్లు జిల్లా కలెక్టరేట్ మున్సిపల్ కమిషనర్ కి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఇవ్వడం జరిగినా ఇంతవరకు పట్టించుకున్న పాపాన పోలేదు అన్నారు. పెండింగ్ వేతనాలు, పీ ఎఫ్ డబ్బులు వెంటనే చెల్లించి ఇతర సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరిక జారీ చేశారు.ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ముంజం ఆనంద్ కుమార్,
సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు వెలిశాల క్రిష్ణమాచారి, తదితరులు పాల్గొన్నారు. (Story : మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1