UA-35385725-1 UA-35385725-1

వరద బాధితుల సహాయార్థం రూ. 50 వేలు విరాళం

వరద బాధితుల సహాయార్థం రూ. 50 వేలు విరాళం

 బత్తలపల్లి వాసి ఎం. వెంకట కృష్ణ మంత్రి సత్య కుమార్ అందజేత

ఎం. వెంకట కృష్ణ ను అభినందించిన ఆరోగ్యశాఖ మంత్రి

న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయిజిల్లా) : విజయవాడ ప్రాంతంలో వరదల కారణంగా నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లికి చెందిన విజ్ఞాన భారతి విద్యాలయ కరస్పాండెంట్ ఎం. వెంకట కృష్ణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 50 వేలు విరాళం అందించారు. దీనికి సంబంధించిన చెక్కును శుక్రవారం విజయవాడలోని సెక్రటేరియట్ లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్ పేషీలో మంత్రి కు అందజేశారు. వరదల కారణంగా ప్రజలు పడుతున్న కష్టాలను చూసినవెంకట కృష్ణ తమ ఆర్థిక సహాయం ద్వారా కష్టాల్లో ఉన్న ప్రజలకు నేరుగా సహాయం చేయాలని సంకల్పించారు. సాటి మానవులు ఆపదలో ఉండగా ఆదుకోవడం తన బాధ్యతగా భావించి తనవంతుగా సహాయం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్య కుమార్ యాదవ్ వరద బాధితులను ఆదుకోవడానికి సహాయం చేసిన వెంకట కృష్ణ కు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ చేస్తున్న ఈ సహాయం, వరద బాధితుల కోసం అవసరమైన తక్షణ సహాయం అందించడంలో కీలక పాత్ర పోషించనుంది అని మంత్రి తెలిపారు. (Story : వరద బాధితుల సహాయార్థం రూ. 50 వేలు విరాళం )

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1