Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌వివిధ రూపాల అలంకరణలో భక్తాదులకు దర్శనం

వివిధ రూపాల అలంకరణలో భక్తాదులకు దర్శనం

వివిధ రూపాల అలంకరణలో భక్తాదులకు దర్శనం

న్యూస్ తెలుగు/ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణములోని సాలే వీధిలో గల పెద్దమ్మ తల్లి ఆలయంలో నాల్గవ రోజు రోజు అమ్మవారు గాయత్రి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. కమిటీ దాతల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కమిటీ వారు తెలిపారు. మహా పోషకులుగా బుగ్గ ప్రతాప్, లావణ్య, బుగ్గ నారాయణస్వామి, సుమ వ్యవహరించారు.పట్టణంలోని సాలే వీధిలో గల అంబా భవాని దేవాలయంలో నాల్గవ రోజు అమ్మవారు మధుర మీనాక్షి దేవి అలంకరణములో భక్తాదులకు దర్శనమిచ్చారు. ఈ నిర్వహణ స్వకుల సాలే సమాజము, స్వకుల సాలే మహిళా మండలి, అంబా భవాని దేవి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు.పట్టణములోని యాదవి వీధిలో గల గాయత్రీ దేవాలయములో నాల్గవ రోజు అమ్మవారు అన్నపూర్ణేశ్వరి దేవి అలంకరణములో భక్తాదులకు దర్శనమిచ్చారు. ఈ వేడుకలు దాతలు, భక్తాదులు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చక సంక్షేమ సంఘం, గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం, వేద మాత గాయత్రీ దేవి ఆలయ కమిటీ వారు నిర్వహించారు.(Story:వివిధ రూపాల అలంకరణలో భక్తాదులకు దర్శనం.)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!