గిరిజన దర్బార్ లో సమర్పించిన దరఖాస్తులను
సత్వరమే పరిష్కరించాలి
ఐటిడిఏప్రాజెక్ట్ ఆఫీసర్
న్యూస్ తెలుగు /ములుగు జిల్లా బ్యూరో : గిరిజన దర్బార్ లో సమర్పించిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత సెక్టర్ అధికారులను,ఏటూరునాగారం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి చిత్ర మిశ్రా అధికారులను, ఆదేశించారు.సోమవారం ఐటిడిఏ సమావేశ మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బార్ లో గిరిజనుల నుండి వచ్చిన వినతులను స్వయంగా పిఓ స్వీకరించారు.ఈ గిరిజన దర్బార్ లో వివిధ సమస్యల పై, వివిధ మండలాల నుండి 12 గిరిజనుల దరఖాస్తులు వచ్చాయి.ఈ కార్యక్రమంలో ఐటిడిఏ డిడి వై. పోచం,ఐటిడిఏ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎం. రాజ్ కుమార్,ఏటూరునాగారం డియం జిసిసి ప్రతాప్ రెడ్డి, ఇతర సంబందిత అధికారులు గ్రీవెన్స్ సెల్ లో పాల్గొన్నారు. (Story : గిరిజన దర్బార్ లో సమర్పించిన దరఖాస్తులను)