లోక కళ్యాణార్థం చండీ హోమం
న్యూస్తెలుగు/ విజయనగరం ;
ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం చదురుగుడి వద్ద మూడవ మంగళవారం పురస్కరించుకుని దేవస్థానం ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం చండీ హోమం నిర్వహించారు. దేవస్థానం ఇఓ డివివి ప్రసాదరావు పర్యవేక్షణలో ఆలయవేదపండితులు తాతా రాజేష్ శర్మ సాయికిరణ్ శర్మ లుముందుగా గణపతి పూజ, పుణ్యాహవచనం, హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. ఆలయ అర్చకులు, పలువురు దంపతులు, దేవస్థానం సిబ్బంది ఈకార్యక్రమంలో పాల్గొన్నారు.ఆలయంలో అమ్మవారి కి ప్రత్యేక అలంకరణ లు చేసి పూజలు నిర్వహించారు.భక్తులు అధికసంఖ్యలో అమ్మవారి ని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. (Story : లోక కళ్యాణార్థం చండీ హోమం)