మంత్రుల పేషీల్లోని అధికారులకు షాక్..!
షాకింగ్ న్యూస్ : మంత్రివర్గ విస్తరణ సచివాలయ అధికారులకు తలనొప్పిగా మారింది. తాజాగా మంత్రుల పేషీల్లోని అధికారులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వారిని మాతృశాఖలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. మంత్రుల పేషీల్లో పనిచేస్తున్న ఓఎస్డీలు, పీఎస్, అదనపు వ్యక్తిగత కార్యదర్శులందరినీ పేరెంట్ డిపార్ట్మెంట్లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలిచ్చారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో ఉద్యోగులందరినీ ఆర్డర్ టు సర్వ్ పేరిట తాత్కాలిక కేటాయింపులు చేసింది. ఈ నెల 11న రాష్ట్రంలో కొత్త మంత్రివర్గం కొలువుదీరనున్న విషయం తెల్సిందే. ఇకనుంచి వారు యథావిధిగా పూర్వ కార్యకలాపాలు నిర్వహిస్తారు. అయితే, ఆ అధికారులు గానీ, ఉద్యోగులు గానీ మళ్లీ మంత్రుల వద్దే పని చేయాలని అనుకుంటే చేసుకోవచ్చు. అటువంటి ఆదేశాలు వచ్చినా, కచ్చితంగా వారు మాతృశాఖతో పాటు సదరు మంత్రుల నుంచి కూడా ముందస్తు అనుమతి తీసుకోవాల్సిందిగా సూచనలు జారీ చేసినట్టు సమాచారం. మరోవైపు జిల్లాలకు ఆర్డర్ టూ సర్వ్ పేరిట తాత్కాలిక కేటాయింపులు జరిగాయి. ఉద్యోగుల పదోన్నతులు, శాశ్వత ప్రాతిపదికన నియామకాలు ఇతర సర్వీసు అంశాలపై పర్యవేక్షణ కోసం ప్రభుత్వం ఉమ్మడి జిల్లాల కలెక్టర్లనే నోడల్ అధికారులుగా నియమించింది. కొన్ని జిల్లాలకు ఇంకా అధికారులు వెళ్లాల్సి వుంటుంది. (Story: మంత్రుల పేషీల్లోని అధికారులకు షాక్..!)
See Also: పింఛను డబ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!
చనిపోయాడని పూడిస్తే…బతికొచ్చాడు!
రామ్గోపాల్వర్మకు ధియేటర్ల షాక్!
స్టూడెంట్స్తో గ్రూప్సెక్స్ : కటకటాల్లో టీచర్
మేకపాటి గౌతమ్రెడ్డి స్థానంలో మంత్రి ఎవరో తెలుసా?
మాకొద్దీ మంత్రిగిరీ! Special Story)
రామ్చరణ్తో బిగ్ డీల్ నిజమేనా?
క్యాబినెట్ విస్తరణ ముహూర్తం కుదిరింది!
ఇకపై ఇంటర్వ్యూలు లేకుండానే ఉద్యోగాలు!
వావ్! లేపాక్షికి యునెస్కో గుర్తింపు!
రాజమౌళి కొత్త సినిమా అప్డేట్ : బడ్జెట్ రూ.800 కోట్లు