వృద్ధురాలికి లోకం మాధవి చేయూత
విజయనగరం (న్యూస్ తెలుగు) : రెక్కాడితే తప్ప డొక్కాడని ఓ వృద్ధురాలికి జనసేన నాయకురాలు లోకం మాధవి చేయూతనందించి ప్రశంసలు అందుకున్నారు. నెల్లిమర్ల టౌన్ లోని 11 వ వార్డులో చల్లమ్మ అనే వృద్ధురాలు తన రెక్కల కష్టంతో జీవనోపాధి కొనసాగిస్తూ చిన్న పూరి గుడిసెలో తాను ఒక్కటై జీవితం గడుపుతూ ఉండగా ఆ ప్రాంతవాసులు తన కష్టాలను చూసి నెల్లిమర్ల నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జి లోకం మాధవికి తెలియజేయగా, విషయం తెలుసుకున్న మాధవి ఆ వృద్ధురాలికి 12,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసి, తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆ మహిళకి ఆత్మస్థైర్యాన్ని నింపారు. జనసేన-తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం రాగానే తనకి పక్కా ఇల్లు మంజూరు అయ్యేలా తాను చొరవ తీసుకుంటానని లోకం మాధవి గారు ఆ వృద్ధురాలికి హామీయిచ్చారు. చల్లమ్మ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లు గడుస్తున్నా తమని పట్టించుకునే నాధుడే లేడని, ఏ ఒక్క ప్రభుత్వం తమ వైపు చూడలేదని, మాధవి గారు నా గురించి తెలుసుకొని ఆర్థిక సాయం అందించి తనకు అండగా నిలిచినందుకు, ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు. (Story: వృద్ధురాలికి లోకం మాధవి చేయూత)
See Also:
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్హుడ్లో నితిన్ వేరే లెవల్!