సిపిఎం ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి తిరిగి ఎన్నిక
కన్నూర్ : సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి మళ్లీ ఎన్నికయ్యారు. కేరళలో సీపీఐ(ఎం) 23వ అఖిల భారత మహాసభలు విజయవంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా సందర్భంగా పార్టీ ప్రధాన కార్యదర్శిగా మరోసారి సీతారాం ఏచూరిని కేంద్ర కమిటీ ఎన్నుకుంది. మహాసభ ద్వారా ఎన్నికైన 85 మంది సభ్యులతో కూడిన కేంద్ర కమిటీ 17 మంది సభ్యులతో పార్టీ అత్యున్నత నాయకత్వమైన పొలిట్ బ్యూరోను కూడా ఎన్నుకుంది. పొలిట్బ్యూరోలో పెద్దగా మార్పులు చోటు చేసుకోలేదు. స్వల్ప మార్పులతో ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. తెలుగు రాష్ట్రాల నుంచి బి.వి.రాఘవులుకు మాత్రమే చోటు దక్కింది. ఆయన గత కమిటీలోనూ పొలిట్ బ్యూరోలో వున్నారు.
పొలిట్ బ్యూరో సభ్యులు వీరే!
1. సీతారాం ఏచూరి, 2. ప్రకాశ్ కరత్, 3. మాణిక్ సర్కార్, 4. పినరయ్ విజయన్, 5. బి.వి రాఘవులు, 6. బృందాకరత్, 7. కొడియారి బాలకృష్ణన్, 8. ఎం.ఎ బేబి, 9. సూర్యకాంత మిశ్రా, 10. మహమ్మద్ సలీమ్, 11. సుబాషిణి ఆలీ, 12. జి. రామకృష్ణన్, 13. తపన్సేన్, 14. నిలోత్పల్ బసు 15. విజయ్ రాఘవన్ 16. అశోక్ ధావలే 17. రామచంద్రన్ డోమ్. వీరితో పాటు సెంట్రల్ కమిషన్ చైర్మన్గా ఎకె పద్మనాభన్ను ఎన్నుకున్నారు. (Story: సిపిఎం ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి తిరిగి ఎన్నిక)
See Also :
ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రులు వీరే! (Full Details)
మీడియాపై మంత్రి పేర్ని నాని ఉద్వేగపూరిత వ్యాఖ్యలు
మంత్రుల పేషీల్లోని అధికారులకు షాక్..!
పింఛను డబ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!
చనిపోయాడని పూడిస్తే…బతికొచ్చాడు!
రామ్గోపాల్వర్మకు ధియేటర్ల షాక్!
స్టూడెంట్స్తో గ్రూప్సెక్స్ : కటకటాల్లో టీచర్
రామ్చరణ్తో బిగ్ డీల్ నిజమేనా?
ఇకపై ఇంటర్వ్యూలు లేకుండానే ఉద్యోగాలు!
వావ్! లేపాక్షికి యునెస్కో గుర్తింపు!