Home Blog

‘కుబేర’ ట్రైలర్ మైండ్ బ్లోయింగ్ గా వుంది

0

‘కుబేర’ ట్రైలర్ మైండ్ బ్లోయింగ్ గా వుంది

న్యూస్‌తెలుగు/ హైద‌రాబాద్ సినిమా:
సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న, హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా మూవీ శేఖర్ కమ్ముల ‘కుబేర’. అద్భుతమైన తారాగణంతో కుబేర ఇండియన్ సినిమాలో గేమ్-ఛేంజర్‌గా నిలవబోతోంది. ఇప్పటికే విడుదలైన కుబేర ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. పోయిరా మామ, ‘ట్రాన్స్ ఆఫ్ కుబేర’, పీపీ డమ్ డమ్ సాంగ్స్ చార్ట్ బస్టర్ రెస్పాన్స్ తో మ్యూజిక్ చార్ట్స్ లో టాప్ ట్రెండింగ్ లో వున్నాయి. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్ హై ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మిస్తున్నారు. కుబేర తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి చీఫ్ గెస్ట్ గా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. ప్రీరిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి ‘కుబేర’ ట్రైలర్ ని లాంచ్ చేశారు.

గ్రాండ్ గా జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ లో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. శేఖర్ కమ్ముల చాలా సాఫ్ట్ గా హంబుల్ గా ఉంటారు. ఆయనను చూసిన వెంటనే మనకి అలానే అనిపిస్తుంది. కానీ ఆయన చాలా దృఢ నిశ్చయం కలిగిన మనిషి. తను నమ్మిన సిద్ధాంతానికి ఏది అడ్డు వచ్చినా ఒక్క ఇంచ్ కూడా పక్కకు జరగరు. ఆ క్వాలిటీని నేను చాలా ఎడ్మైర్ చేస్తాను. శేఖర్ ఆయన నమ్మిన సిద్ధాంతాల మీద సినిమాలు తీస్తారు. నేను నమ్మిన సిద్ధాంతాలకి నేను చేసే సినిమాలు కి సంబంధం ఉండదు. మేము కంప్లీట్ అపోజిట్ పోల్స్. ఆయన అంటే నాకు అపారమైన గౌరవం. ఆయన ఇండస్ట్రీకి వచ్చి 25 సంవత్సరాల అయిందంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు. ఆయన నాకు జూనియర్ అనుకున్నాను కానీ నాకంటే వన్ ఇయర్ సీనియర్ తను. ఈ 25 సంవత్సరాల్లో అలాగే ఉన్నాడు. తను నమ్మిన సిద్ధాంతాలతోనే సినిమాలు తీశాడు. ఆయన అలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. నాగార్జున గారు, శేఖర్ కమ్ముల, టైటిల్ కుబేర.. ఈ అనౌన్స్మెంట్ వచ్చిన వెంటనే ఫెంటాస్టిక్ గా అనిపించింది. ధనుష్ కూడా ఇందులో ఉన్నారని తెలిసిన తర్వాత అద్భుతమైన కాంబినేషన్ అనిపించింది. ట్రాన్స్ అఫ్ కుబేర రిలీజ్ అయిన తర్వాత మైండ్ బ్లోయింగ్ అనిపించింది. ఒక రిచ్ ప్రపంచంలో నాగర్జున గారు, పూర్ ప్రపంచంలో ధనుష్ గారు.. సినిమా కథ గురించి ఏమి చెప్పకుండా ఈ రెండు క్యారెక్టర్స్ ని చూపించడం చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. శేఖర్ కమ్ముల గారు తన సినిమాని ట్రైలర్ లోనే చెప్పేస్తారు. కానీ కుబేర విషయానికి వస్తే నాకు ఒక సస్పెన్స్ సినిమా లాగా అనిపిస్తుంది. నాగార్జున గారిని ధనుష్ గారిని ఎలా కలిపిపాడు? వాళ్ళ మధ్య డ్రామా ఏంటి?  అనేది చాలా క్యూరియాసిటిగా అనిపిస్తుంది. దీని కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నాను. ట్రైలర్ ఆసక్తిని మరింత పెంచింది. మైండ్ బ్లోయింగ్ విజువల్స్. ప్రొడక్షన్ డిజైన్ అద్భుతంగా ఉంది. ప్రతిది టాప్ క్లాస్ లో వున్నాయి. దేవిశ్రీ ఇచ్చిన నాది నాది సాంగ్, కుబేర థీమ్ ఇవన్నీ ఫెంటాస్టిక్ గా ఉన్నాయి. జూన్ 20. డోంట్ మిస్ కుబేర’అన్నారు.

కింగ్ నాగార్జున మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ వేడుకకు వచ్చిన అభిమానులందరికీ థాంక్యూ. ధనుష్ టప్ కలసి వర్క్ చేయడం ఒక హానర్ గా భావిస్తున్నాను. తను ఒక క్యారెక్టర్ లో పెర్ఫార్మ్ చేసే విధానం అవుట్ స్టాండింగ్. తనకి మరిన్ని విజయాలు రావాలి.తనతో వర్క్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. కుబేర గురించి మాట్లాడాలంటే నాకు శేఖర్ కమ్ముల గారు గుర్తుకొస్తారు. ఇది కేవలం శేఖర్ కమ్ముల ఫిలిం. మేమందరం ఇందులో పాత్రలు మాత్రమే. ఆయన కంఫర్ట్ జానే నుంచి బయటికి వచ్చి తీసిన సినిమా. మమ్మల్ని కూడా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు తీసుకొచ్చాడు. మాయాబజార్ చూసినప్పుడు అది కె.వి రెడ్డి ఫిల్మ్ అంటాం. లాగే కుబేర కూడా శేఖర్ కమ్ముల ఫిలిం. శేఖర్ కమ్ముల కోసమే ఈ సినిమా చేయడం జరిగింది. ఈ సినిమా హిట్ అవుతుందని శేఖర్ కాన్ఫిడెంట్ గా చెప్తుంటే చాలా ధైర్యంగా అనిపిస్తుంది. శేఖర్ పై పూర్తి నమ్మకం. ఉంది దేవిశ్రీ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. పాటలు వింటుంటే పూనకం వస్తుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ అదరగొట్టేశాడు. నిర్మాతలు సునీల్ గారు రామ్ మోహన్ గారికి థాంక్ యూ. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఎన్ని సంవత్సరాలైనా అభిమానుల ప్రేమ చెక్కుచెదరకుండా ఉంది. ఎలాంటి పాత్రలు చేసిన మీరు ఒప్పుకుంటున్నారు. చూస్తున్నారు. అభినందిస్తున్నారు. మీరు ఉన్నంతవరకు ఏఎన్ఆర్ లీవ్స్ ఆన్. ఐ లవ్ యూ టు ఆల్’అన్నారు.

హీరో ధనుష్ మాట్లాడుతూ.. ఓం నమశ్శివాయ.అందరికీ నమస్కారం. ఏవీ చూస్తున్నప్పుడు మా నాన్నగారి గుర్తుకొచ్చారు. మమ్మల్ని ప్రయోజకులను చేయడానికి ఎంతగానో కష్టపడ్డారు. ఈరోజు ఇక్కడ ఇక్కడ వుండటానికి కారణం ఆయన కష్టం. ఈ సందర్భంగా నాన్నకి కృతజ్ఞతలు. శేఖర్ గారు ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. హెల్త్ ని కూడా లెక్క చేయకుండా కష్టపడ్డారు. ఆయన విషయంలో నేను చాలా కంగారు పడ్డాను. ఇది నాకు 52వ తమిళ్ సినిమా, రెండవ తెలుగు సినిమా. శేఖర్ గారు సార్ సినిమాకి ముందే ఈ కథ నాకు చెప్పారు. నా రెండో సినిమా ఆయనతో చేయడం చాలా ఆనందం. కుబేరలో అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చినందుకు శేఖర్ గారికి ధన్యవాదాలు. నాగార్జున గారితో వర్క్ చేయడం ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. ఆయన్నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆయన సినిమాలు చూస్తూ పెర్గిగాను. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం మ్యాజికల్ ఎక్స్పీరియన్స్. రష్మిక హార్డ్ వర్క్ చేసింది. తన చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చింది. సునీల్ గారికి రామ్మోహన్ గారికి థాంక్ యూ. వారు లేకపోతే ఈ సినిమా లేదు. నా కోసం పనిచేసిన టెక్నీషియన్స్ యాక్టర్స్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. కుబేర చాలా స్పెషల్ ఫిలిం. జూన్ 20 వస్తుంది. తప్పకుండా మీరందరూ ఎంజాయ్ చేస్తారని నమ్మకం ఉంది’అన్నారు.

డైరెక్టర్ శేఖర్ కమ్ముల మాట్లాడుతూ..  అందరికీ నమస్కారం. నా 25 ఇయర్స్.. మీరు రావాలని పిలవగానే వచ్చిన రాజమౌళి గారికి థాంక్యూ. ఏదైనా చేయగలం అనే నమ్మకాన్ని ఇచ్చిన డైరెక్టర్ రాజమౌళి గారు. మీడియాకి ధన్యవాదాలు. ప్రతి సినిమా కూతురు లాంటిది కొడుకు లాంటిదని చెప్తుంటాను. కుబేర మాత్రం తల్లి ప్రేమ లాంటిది. బిచ్చగాడు అయినా కోటీశ్వరుడైన తల్లి ప్రేమ ఒక్కటే. అలాంటి ఐడియాలజీతో కథ రావడం అదృష్టంగా భావిస్తున్న. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమా సరస్వతి దేవి తలెత్తుకుని చూస్తుంది. ఇది చాలా కొత్త సినిమా. ఇంతకుముందు మీరు ఎప్పుడు చూడని సినిమా. అంత ఫ్రెష్ గా ఉంటుంది. ఏ రాష్ట్రంలో ఆడియన్స్ అయినా ఇది మా సినిమా అనుకునేలా వచ్చింది. ట్రూ పాన్ ఇండియన్ మూవీ.  ఇందులో నవ్వు ఎమోషన్ ఏడుపు థ్రిల్ ఆశ్చర్యం బాధ అన్ని కలగలిపి ఉంటాయి.  కుబేర ఫెంటాస్టిక్ ఫిలిం. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి ప్రొడక్షన్ టీం అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నాగార్జున గారితో షూట్ చేస్తున్నప్పుడు నెర్వస్ ఫీల్ అయ్యాను. శివ షూటింగ్ టైం లోనాగార్జున గారిని చూశాను. ఆయన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశారు. నేను ఈ స్క్రిప్ట్ చెప్పిన వెంటనే రెడీ అన్నారు. అందుకు నాగార్జున గారికి ధన్యవాదాలు. నాకోసం ఏదైనా చేస్తానని చెప్పి ఈ సినిమాని చేశారు. రశ్మిక తను చాలా బ్యూటిఫుల్ పర్సన్. లోపల బయట ఒకేలా ఉండే అమ్మాయి. అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. జిమ్ షర్బ్ ఈ సినిమాలో చాలా అద్భుతంగా పెర్ఫాం చేశాడు. ధనుష్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తను ప్రైడ్ ఆఫ్ ఇండియా. బిచ్చగాడిలా కనిపించాలంటే నిజంగా అలానే కనిపించి చూపించాడు. కెరీర్ లో ఫస్ట్ టైం ఒక డైరెక్టర్ తనని బడమని చెప్పారని,  నిజంగానే సన్నబడి చూపించాడు. తనకి ఎన్ని నేషనల్ అవార్డ్స్ వచ్చిన తక్కువే. తోట తరిణి గారు నాకు ఫాదర్ లాంటి వ్యక్తి. ఈ సినిమాకి అద్భుతమైనటువంటి వర్క్ ఇచ్చారు. దేవిశ్రీ సినిమాకి ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చారు. ఎప్పుడు ఎనర్జిటిక్ గా ఉంటారు. అది మ్యూజిక్ లో కనిపిస్తుంది. సునీల్ గారు రామ్మోహన్ గారు ఇంత బిగ్ స్కేల్ సినిమాని ఎక్కడ జంకకుండా నిర్మించారు. ఈ సినిమా పట్ల చాలా హ్యాపీగా ఉన్నారు. కుబేర డబ్బులు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాల్లో పని చేసిన అందరికీ పేరు పేరునా థాంక్యూ. కుబేర ఖచ్చితంగా మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేస్తుంది’అన్నారు.

హీరోయిన్ రష్మిక మందన మాట్లాడుతూ..అందరికి నమస్కారం. కుబేర నాకు గొప్ప ఆపర్చునిటీ. నాకు శేఖర్ గారితో వర్క్ చేయాలని వుండే.  ఆ అవకాశం ఈ సినిమాతో దొరికింది. ఇది గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను.  ఇందులో నేను చేసిన క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని నమ్ముతున్నాను. సినిమా కోసం అందరం చాలా హార్డ్ వర్క్ చేసాము. టీమందరికీ థాంక్యూ. నాగార్జున గారితో రెండోసారి కలిసి పని చేసే అవకాశం దొరికింది.  ఆయన వెరీ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్. ధనుష్ గారితో వర్క్ చేయడం ఇది ఫస్ట్ టైం. మా కెమిస్ట్రీ చూసి మరి కొంత మంది దర్శకులు రచయితలు కొత్త సినిమాలు ఆఫర్ చేస్తారని నమ్ముతున్నాను.  ఆయనతో మరోసారి కలిసి పని చేయాలని ఎదురుచూ స్తున్నాను.  నిర్మాతలు చాలా బడ్జెట్ పెట్టి అద్భుతంగా ఈ సినిమాని తీశారు.  ఈ సిమమా గొప్ప విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను’అన్నారు.

దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం.  సినిమా జర్నీలో నన్ను ఎంతోగా సపోర్ట్ చేసిన అందరికీ థాంక్యూ. కుబేర చాలా స్పెషల్ ఫిలిం. దీని గురించి ఎంత మాట్లాడిన తక్కువే అనిపిస్తుంది. శేఖర్ గారితో ఎప్పటినుంచో వర్క్ చేయాలి. ఫైనల్ గా కుబేరతో అది కుదరడం చాలా ఆనందంగా ఉంది. అద్భుతమైన స్క్రిప్ట్ రాశారు. ఇలాంటి కథని ఇంతకుముందు మనం ఎప్పుడు చూసి వుండము. చాలా అద్భుతంగా తీశారు. ఈ సినిమాలో ప్రతి మూమెంట్ ని ఎంజాయ్ చేస్తారు.  నేషనల్ క్రష్  రష్మిక గారు చాలా అద్భుతంగా పెర్ఫాం చేశారు. సినిమా అంతా ఉంటారు. చాలా డిఫరెంట్ క్యారెక్టర్ చేశారు. ధనుష్ గారు అద్భుతంగా చేశారు. ఇది వన్ అఫ్ ది బెస్ట్ పెర్ఫార్మన్స్. ఆయన్ని స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు నాకు సర్ప్రైజ్ అనిపించింది. బ్యాగ్రౌండ్ స్కోర్ చేసినప్పుడు ఒక క్యారెక్టర్ గానే కనిపించారు.  నాగార్జున గారితో నాది విడదీయలేని బంధం. ఇందులో ఆ క్యారెక్టర్ నాగర్జున గారు చేయకంటే ఇంక ఎవరితో చేసేవారో ఊహకు అందటం లేదు. అంత రాయల్ గా కనిపించారు. ఈ సినిమా స్టార్ కాస్ట్ అమేజింగ్. ఈ సినిమాల్లో పార్ట్ కావడం చాలా గౌరవంగా భావిస్తున్నాను. జూన్ 20న తప్పకుండా ఈ సినిమాని థియేటర్స్ లో చూడండి.  నిర్మాతలు సునీల్ గారు జాన్వి గారి సపోర్ట్ కి థాంక్యూ. సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను’అన్నారు

నిర్మాత పుష్కర రామ్మోహన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. శేఖర్ కమ్ముల గారు ఒక డిఫరెంట్ స్టైల్లో సినిమాలు తీసే అద్భుతమైన ఫిలిం మేకర్. ఈ సినిమాని అంతే డిఫరెంట్ గా  వేరే జానర్ లో తీశారు. థ్రిల్లర్ క్రైమ్ సస్పెన్షన్ అన్ని ఎలిమెంట్స్ ని ఈ సినిమాలో ఆడియన్స్ చూడబోతున్నారు. శేఖర్ కమ్ముల గారి సినిమాల్లో ఇది చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది. ధనుష్ గారు ఫెంటాస్టిక్ గా పెర్ఫాం చేశారు. ఆయన ఆల్ రౌండర్. నాగార్జున గారు మాకు ఎంతో స్పెషల్. మాకు ఫ్యామిలీ ఫ్రెండ్. ఆయన మా సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాల్లో ఆయన పెర్ఫార్మన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. 300 కోట్ల హీరోయిన్ రష్మిక మా సినిమాలో వున్నారు(నవ్వుతూ) దేవిశ్రీ ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చారు. డైరెక్షన్,  ప్రొడక్షన్ టీం కి అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు’అన్నారు

లిరిక్ రైటర్ నందకిషోర్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ అవకాశం ఇచ్చిన శేఖర్ కమ్ముల గారికి ధన్యవాదాలు. శేఖర్ గారి సినిమాకి పాటలు రాయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ జర్నీలో చాలా విషయాలు నేర్చుకున్నాను. దేవిశ్రీప్రసాద్ గారి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సినిమా తప్పకుండా అందరూ చూడండి’అన్నారు.

లిరిక్ రైటర్ భాస్కర్ భట్ల మాట్లాడుతూ.. లవ్ స్టోరీ తర్వాత శేఖర్ కమ్ముల గారితో ఇది రెండో అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని భావిస్తున్నాను. శేఖర్ గారు, దేవి శ్రీ ప్రసాద్ గారి స్టైల్ ని క్లబ్ చేయడానికి చాలా టైం పట్టింది. అయితే రిజల్ట్ అద్భుతంగా వచ్చింది. నాగార్జున గారికి ధనుష్ గారికి రష్మిక గారికి అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’అన్నారు.

ప్రొడక్షన్ డిజైనర్ తోట తరణి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. శేఖర్ కమ్ముల గారితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా వండర్ఫుల్ టీంతో కలిసి చేసిన సినిమా ఇది. చాలా అద్భుతంగా వచ్చింది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది’అన్నారు. మూవీ యూనిట్ అంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. (Story:’కుబేర’ ట్రైలర్ మైండ్ బ్లోయింగ్ గా వుంది)

జూన్ 28న ‘హనుమాన్ జంక్షన్’  

0

జూన్ 28న ‘హనుమాన్ జంక్షన్’  

న్యూస్‌తెలుగు/ హైద‌రాబాద్ సినిమా :2001లో విడుదలైన హనుమాన్ జంక్షన్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించింది. యాక్షన్‌ అద్భుతమైన హ్యుమర్ మేళవించిన ఈ సినిమాలో అర్జున్, జగపతి బాబు, వేణు ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆయన తరువాత తమిళ ‘జయం’, ‘తనీ ఒరువన్’, ‘గాడ్‌ఫాదర్’ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు.
లయ, స్నేహ, విజయలక్ష్మి కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో బ్రహ్మానందం, కోవై సరళ, అలీ, ఎల్.బి. శ్రీరామ్, ఎం.ఎస్. నారాయణ, వేణు మాధవ్ వంటి ప్రముఖులు హాస్య పాత్రలతో ప్రేక్షకులను అలరించారు.
ఎడిటర్ మోహన్ స్థాపించిన ఎం.ఎల్. మూవీ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎం.వి. లక్ష్మి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎంగేజింగ్ స్క్రీన్‌ప్లే, ఆకట్టుకునే సంభాషణలు, కామెడీ, యాక్షన్ సన్నివేశాలు సినిమాకు కల్ట్ స్టేటస్‌ను తీసుకువచ్చాయి.
ఇప్పుడీ ఎవర్ గ్రీన్ ఎంటర్‌టైనర్ మళ్లీ ప్రేక్షకులను థియేటర్లో అలరించబోతోంది. హనుమాన్ జంక్షన్ ను జూన్ 28న మళ్లీ థియేటర్లలో విడుదల చేయనున్నట్టు చిత్రబృందం అనౌన్స్ చేసింది.
ఈ తరహా సినిమాలు ఎప్పుడు వచ్చినా హిట్ అవుతాయి. పూర్తి స్థాయి కామెడీ ఎంటర్‌టైనర్స్ కొరవడుతున్న సమయంలో, హనుమాన్ జంక్షన్ మళ్లీ తన మ్యాజిక్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయబోతోంది.
ఈ చిత్రానికి సి. రామ్‌ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించగా, సురేశ్ పీటర్స్ మ్యూజిక్ అందించారు. (Story:జూన్ 28న ‘హనుమాన్ జంక్షన్’  )

డిఎ జుగా కార్యక్రమానికి అనూహ్య స్పందన

0

డిఎ జుగా కార్యక్రమానికి అనూహ్య స్పందన

జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్

న్యూస్ తెలుగు /సాలూరు : ధర్తీ ఆబా జన్ జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ (డిఎ జెజియుఎ) కార్యక్రమం జిల్లాలో బాగా జరుగుతుందని, గిరిజన ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం సాలూరు మునిసిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నెల 15 నుంచి 30 వరకు డిఎ జుగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతిని కలెక్టర్ ఈ సందర్బంగా గుర్తుచేశారు. అందులో భాగంగా గిరిజనుల అవసరాలను గుర్తించి ధ్రువపత్రాలను జారీ చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలుచేసే ఈ కార్యక్రమంలో గిరిజన ప్రాంతాల్లో సేవలు, మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయమని అన్నారు. గ్రామ/ క్లస్టర్ స్థాయి శిబిరాల ద్వారా వివిధ సౌకర్యాలను క్షేత్ర స్థాయిలో అందించేలా జిల్లా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఆదివారం నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఆయుష్మాన్ భారత్ కార్డ్, కుల ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రం,కిసాన్ క్రెడిట్ కార్డ్, పియం కిసాన్ కార్డులు, జన్ ధన్ ఖాతా, పిఎం జెజెబివై, పిఎం ఎస్ బివై బీమా కవరేజ్, వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ సామాజిక భద్రత పింఛన్లు, ఉపాధి హామీ, పియం విశ్వకర్మ, ముద్ర తదితర జీవనోపాధి పథకాలు, పిఎం యంవివై, ఇమ్యునైజేషన్ తదితర స్త్రీ శిశు సంక్షేమ ప్రయోజనాలను ప్రజలు వినియోగించు కుంటున్నట్లు కలెక్టర్ వివరించారు. పివిటిజి గృహాలు, గిరిజన గ్రామాలను గుర్తించడం, గ్రామ/ క్లస్టర్ స్థాయి శిబిరాలను నిర్వహించడం, ఆరోగ్యం, ఆహారం, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి, సామాజిక న్యాయం, వ్యవసాయం, రెవెన్యూ ఇతర విభాగాల సమన్వయంతో కార్యకలాపాలు చేపట్టాలని అన్నారు. ఆధార్, ఇ – కెవైసి డాక్యుమెంటేషన్ సంబంధిత సేవల కోసం సంబంధిత విభాగాలు పనిచేస్తాయని స్పష్టం చేశారు. ఆధార్ లో నమోదు కాని వారిని అంగన్వాడీ సిబ్బంది నమోదు చేయించాలని, గ్రామ స్థాయిలో ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ సమావేశంలో  జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. (Story:డిఎ జుగా కార్యక్రమానికి అనూహ్య స్పందన)

నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలి

0

నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలి

జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్

న్యూస్ తెలుగు/సాలూరు : ప్రతీ వారం పిజిఆర్ఎస్ కు వచ్చే దరఖాస్తులకు నాణ్యమైన పరిష్కారం అందించాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అన్నారు.
సోమవారం సాలూరు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో డ్వామా ప్రాజెక్టు అధికారి కె.రామ చంద్రరావుతో కలిసి కలెక్టర్ వినతులు స్వీకరించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ వేగం, నాణ్యత, నిష్పక్షపాతంగా పిజిఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల సమస్యలను సావధానంగా విని పరిష్కరించే దిశలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
పిజిఆర్ఎస్ ద్వారా అందిన ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి దరఖాస్తుదారునికి చట్టప్రకారం పరిష్కారం చూపించాలన్నారు. ప్రతి సమస్యను మానవతా కోణంలో ఆలోచించి గడువులోగా ప్రజలు సంతృప్తి చెందే స్థాయిలో పరిష్కారం చూపాలన్నారు. స్వీకరించిన ప్రతి ఫిర్యాదుకు రసీదు ఇవ్వడంతో పాటు సమస్య పరిష్కారానికి చివరి వరకు వేచి చూడకుండా గడువులోపే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. దరఖాస్తులు పెండింగ్ లేకుండా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

మొత్తం 154 దరఖాస్తులు వచ్చాయి

🔷 సాలూరు మండలం, గాంధీనగర్ లో నివాసముంటున్న తుపాకుల గణేష్ తనకు కొత్త రేషన్ కార్డును మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు సమర్పించారు.
🔸సాలూరు పట్టణంలోని రాము కాలనీ 23వ వార్డ్ లో నివాసముంటున్న చిక్కాల జ్యోతి తన పేరు మీద లేని కరెంట్ మీటర్ రీడింగ్ వల్ల తన కుమార్తెకు తల్లికి వందనం పధకంలో పేరు లేదని, సమస్యను పరిష్కరించాలని దరఖాస్తు చేశారు.
🟡సాలూరు పురపాలక సంస్థ పరిధిలో వార్డునెం.14, బంగారమ్మ కాలనీ నుండి యం. మాధవి, రాధ, యం. సౌజన్య, బి.స్వర్ణ లత,వరలక్ష్మి తదితరులు తమ కాలనీలో సగానికి పైగా ప్రజలు దారిద్ర్యరేఖ దిగువున నివసిస్తున్నారని, కాలనీలో ఉన్న స్నాక్స్ ఫ్యాక్టరీ వల్ల పొగ,కాలుష్యం వల్ల అనారోగ్యం బారిన పడుతున్నామని దయచేసి ఫ్యాక్టరిని వేరే జన నివాసం లేని చోటుకు తరలించమని కోరుతూ దరఖాస్తు చేశారు.
🟢 సాలూరు పట్టణం నుండి చల్లా సర్వేశ్వరరావు 7 సంవత్సరాల క్రితం సాలూరు లో టిడ్కో ఇంటి కోసం మున్సిపల్ కమీషనర్ పేరు మీద రూ:50వేలు డిడి ఇచ్చామని, ఆ డబ్బులు తిరిగి ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు సమర్పించారు.
🔹సాలూరు పట్టణంలో 29 వ వార్డు నుండి మర్రి రవణమ్మ తనకు గత 5 సం: నుండి రేషన్ కార్డు ఆపేశారని, భర్త కరోనాతో 2020 లో మరణించారని, తనకు విడో పెన్షన్ రావడం లేదని, రేషన్ కార్డు, పెన్షన్ మంజూరు చేయాలని కోరారు.
🟡 సాంబారు ముండలం, కూర్మ రాజు పేట గ్రామస్తులు కె. తవిటి నాయుడు, సిహెచ్. సింహాచలం లక్ష్మీ సాగరం చెరువు నుండి చిన్న వలస రోడ్డుకి లింకు రోడ్డు మట్టి రోడ్డుకు గ్రావెల్, మెటల్ రోడ్డు వేస్తే, సుమారు 500 మంది రైతులకు సౌకర్యంగా ఉంటుందని దానిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు చేశారు.
🔴సాలూరు మండలం, మావుడి గ్రామం నుండి వెంకట తిరుపతి రావు కందులపాలెం నుండి మావుడి కి బిటి రోడ్డు వేయాలని కోరుతూ దరఖాస్తు చేశారు.
🔹సాలూరు పట్టణం 21 వార్డు గొల్లవీధి నుండి జి. గుణవతి తనకు కరెంట్ బిల్లు కారణంగా తల్లికి వందనం పధకం అందలేదని పరిష్కారించాలని కోరుతూ దరఖాస్తు చేసారు.
ఈ కార్యక్రమంలో
డ్వామా పి డి. కె.రామచంద్ర రావు, ఐసిడిఎస్ పిడి డా.టి. కనక దుర్గ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కె.రాబర్ట్ పాల్, డి.ఎం.హెచ్ఓ డా: ఎస్.భాస్కర రావు, జిల్లా పరిశ్రమల అధికారి కె.కరుణాకర్,సాలూరు మున్సిపల్ కమిషనర్ ఎస్.జయరాం, సాలూరు ఎంపిడిఓ. కె.పార్వతీ, సాలూరు ఇంచార్జ్ మండల రెవెన్యూ అధికారి వి.రంగా రావు, జిల్లా గ్రామీణ నీటి సరఫరా ఇంజినీరింగ్ అధికారి ఓ.ప్రభాకరరావు, జిల్లా పంచాయతీ అధికారి కె.కొండల రావు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి మన్మథ రావు, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి కె.సాయి కృష్ణ ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. (sTORY:నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలి)

గ్రీవెన్స్ వివరాలు 1100 నంబరుకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు

0

గ్రీవెన్స్ వివరాలు 1100 నంబరుకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు

న్యూస్ తెలుగు /సాలూరు : ప్రజా సమస్యల పరిష్కార వేదిక  (పిజి ఆర్ ఎస్) ద్వారా ప్రజల సమస్యలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. సాలూరు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పిజి ఆర్ ఎస్ వివరాలు 1100 నంబరుకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. అర్జీదారులు  eekosam.ap.gov.in (మీకోసం డాట్ ఏపీ డాట్ జివో వి డాట్ ఇన్) వెబ్సైట్ లోనూ అర్జీలు నమోదు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. అర్జీల నమోదు, నమోదైన అర్జీల స్థితి, దానికి సంబంధించి సమాచారం తెలుసుకొనుటకు 1100 (డబల్ వన్ డబల్ జీరో) కి నేరుగా కాల్ చేయవచ్చని తెలిపారు. (sTORY:గ్రీవెన్స్ వివరాలు 1100 నంబరుకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు)

ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి

0

ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

న్యూస్‌తెలుగు/వనపర్తి : ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు తూడి మెఘా రెడ్డి, అదనప కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, ఆర్డీవో సుబ్రహ్మణ్యంతో కలిసి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, ఫిర్యాదుదారులకు తగిన సమాచారం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ముఖ్యమంత్రి ప్రజావాణి, మంత్రి ద్వారా ఈ జిల్లాకు సంబంధించిన ప్రజావాణి ఫిర్యాదులు, జిల్లా ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈరోజు ప్రజావాణికి మొత్తం 90 ఫిర్యాదులు వచ్చాయి. స్థానిక శాసన సభ్యులు సైతం ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజల ఫిర్యాదులు సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని అధికారులను సూచించారు.కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు. (sTORY:ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి)

ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత సీట్లను  కేటాయించాలి

0

ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత సీట్లను  కేటాయించాలి

జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్

న్యూస్‌తెలుగు/విజయనగరం : ప్రైవేటు పాఠశాలల్లో 1వ తరగతి లో పేదలకు ఉచితంగా కేటాయించవలసిన సీట్ల ను ఆయా యాజమాన్యాలు తక్షణమే కేటాయించాలని జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ ఆదేశించారు. విద్యా హక్కు చట్టం ననుసరించి ప్రతి ప్రైవేటు పాఠశాల లో 25 శాతం సీట్లను ఉచితంగా పేదలకు కేటాయించవలసి ఉండగా స్థానిక ఫోర్ట్ సిటీ, సన్ స్కూల్, బీసెంట్, చాణిక్య పాఠశాలల్లో ఇంకనూ కేటాయించలేదని, తక్షణమే ఆయా యాజమాన్యాలు కేటాయించాలని, లేని యెడల వారి పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. సోమవారం వినతులు విభాగం లో తల్లిదండ్రుల నుండి ఫిర్యాదులు అందడం తో కలెక్టర్ పై విధంగా స్పందించారు. ఈ నాలుగు పాఠశాలల ద్వారా 240 సీట్లు కేటాయించవలసి ఉందని, వాటిని వెంటనే కేటాయించమని ఆదేశాలు జారీ చేయాలని డి.ఈ.ఓ మాణిక్యం నాయుడు కు కలెక్టర్ సూచించారు. (sTORY:ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత సీట్లను  కేటాయించాలి)

ప్రభుత్వ డిగ్రీ కాలేజీ స్థలాన్ని రక్షించాలని గ్రీవెన్స్ లో ఫిర్యాదు 

0

ప్రభుత్వ డిగ్రీ కాలేజీ స్థలాన్ని రక్షించాలని గ్రీవెన్స్ లో ఫిర్యాదు 

న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ గంగినేని కళ్యాణి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూమిని కొందరు రాజకీయ అండదండలతో స్వాహా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, వెంటనే చర్యలు తీసుకొని డిగ్రీ కాలేజీ స్థలాన్ని పరిరక్షించాలంటూ విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు సోమవారం పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. 38 ఎకరాల ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భూమిలో 5.10 ఎకరాల భూమికి రెవెన్యూ రికార్డులు మార్చి కాజేస్తున్నారని, ప్రభుత్వాన్ని నిషేధిత భూముల జాబితా 22(ఏ)లో సర్వే నెంబర్ 949 డిగ్రీ కాలేజీ భూమిక నమోదు కాగా, 949/1,949/2 సబ్ డివిజన్లో డీకే పట్టాగా నమోదు అయింది. ప్రస్తుతం రెవెన్యూ అధికారులు 1బి, అడంగల్ లో కొనుగోలుగా నమోదు చేశారు. 2021లో అప్పటి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అనుచరులు డిగ్రీ కాలేజీ భూమిని స్వాహా చేసేందుకు ప్రయత్నించారు. కాలేజీ ఉద్యోగులు, విద్యార్థులు, విద్యార్థి సంఘ నాయకులు ప్రతిఘటించి అడ్డుకోవడమే కాకుండా విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేశారు. అప్పటి కలెక్టర్ శివ శంకర్ లోతేటి స్పందించి కాలేజీలు సందర్శించి రెవిన్యూ రికార్డులు పరిశీలించారు. డిగ్రీ కాలేజీ 38 ఎకరాలు ఉందని తేల్చి చెప్పారు. కాలేజీ భూమిని కాపాడుకునేందుకు విద్యార్థి సంఘ నాయకుడు మహంకాళి సుబ్బారావు, సాగర్ లు హైకోర్టును ఆశ్రయించగా స్టే ఇవ్వటం జరిగింది. అయ్యర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ కమిషనర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ స్థలం 38 ఎకరాలని హైకోర్టుకు నివేదిక కూడా ఇచ్చారు. కాలేజీ స్థలాన్ని సంబంధిత అధికారులు విచారించి నిగ్గు తేల్చి నివేదించాల్సిందిగా హైకోర్టు ఆదేశించారు. అయితే అమాజీ ఎమ్మెల్యేతో కొమ్మక్కైన డివిజన్, మండల రెవెన్యూ అధికారులు కలిసి 22(ఏ) జాబితాలో ఉన్న డిగ్రీ కాలేజీ భూమికి ఏకంగా కొనుగోలుగా నమోదు చేసి అక్రమదారులకు క్రయవిక్రయాలు జరుపుకునే అవకాశాన్ని కల్పించారు. దీనిపై గ్రీవెన్స్ లో విద్యార్థులు, విద్యార్థి సంఘ నాయకులు ఫిర్యాదు చేయగా, వినతి పత్రాన్ని స్వీకరించిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ భూమి, 22(ఏ) జాబితాలో ఉన్న భూమికి రెవిన్యూ అధికారులు కొనుగోలుగా ఎలా నమోదు చేశారంటూ ఆశ్చర్యపోయారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భూమిని కాపాడాలని విద్యార్థుల విద్యార్థి సంఘ నాయకులు కలెక్టరేట్ వద్ద మోకాళ్లపై నిరసన కార్యక్రమం చేపట్టారు. అవినీతికి పాల్పడిన రెవెన్యూ అధికారులపై, అందుకు కొమ్ముగాస్తున్న ఉన్నతాధికారులు, ప్రైవేటు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. (sTORY:ప్రభుత్వ డిగ్రీ కాలేజీ స్థలాన్ని రక్షించాలని గ్రీవెన్స్ లో ఫిర్యాదు )

అర్హులైన ప్రతి పేదవాడికిరెండు సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలి

0

అర్హులైన ప్రతి పేదవాడికిరెండు సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలి

న్యూస్ తెలుగు / వినుకొండ : 17వ వార్డు కొండమెట్ల బజార్లోని అర్హులైన పేదలకు రెండు సెంట్లు ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని ఓబయ్య కాలనీ సచివాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వినుకొండ పట్టణ సమితి ఆధ్వర్యంలో పేద ప్రజలతో కలిసి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి చెన్నకేశవులు దేవరాజు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఐ వినుకొండ పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాము మాట్లాడుతూ. గత ప్రభుత్వం మన రాష్ట్రంలో 32 లక్షల ఇళ్ల స్థలాలను పేద ప్రజలకు ఇచ్చామని, ఇంటి నిర్మాణానికి 1,80,000 రుణాన్ని ఇప్పించామని లక్షలాది ఇళ్లను నిర్మించామని చెప్పడం జరిగింది. అయితే అప్పటి ప్రతిపక్ష నాయకులు నారా చంద్రబాబు నాయుడు అనేకసార్లు బహిరంగ సభలో, ఎన్నికల ప్రచారంలో పట్నంలో ఒక సెంటు, రూరల్ లో మూడు సెంట్లు, ఇంటి నిర్మాణానికి 1,80,000 మా పార్టీ అధికారంలోకి వస్తే పట్టణాల్లో రెండు సెంట్లు ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని అనేకసార్లు చెప్పి ప్రతిపక్షం పైన అనేక విమర్శలు చేశారు. ఎన్నికల్లో ప్రజలందరూ కూటమి పార్టీ వైపు మొగ్గుచూపి గతంలో ఎప్పుడు రానంత మెజార్టీతో, ఎప్పుడు రాణాన్ని సీట్లను కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఇవ్వడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చి ఏడాది ఆయన సందర్భంగా ప్రజలు తమ సొంత ఇంటి కలను నెరవేర్చాలని కూటమి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. పట్నంలో రెండు సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారని, అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు, వితంతు వికలాంగుల ఒంటరి మహిళ పెన్షన్లను ఇవ్వాలని గత ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాలు వాగుల్లో స్మశానాల పక్కన ఇచ్చారని వాటిని రద్దుచేసి నివాసయోగ్యమైన ఇంటి స్థలాలను ఇవ్వాలని ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని వెంటనే కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకొని పట్టణాల్లో రెండు సెంట్లు ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని రాము కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం ఓబయ్య కాలనీ సచివాలయం అడ్మిన్ ఏడుకొండలకు ప్రజలు అర్జీలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ 17వ వార్డు శాఖ కార్యదర్శి జె. చెన్నకేశవులు, బి. దేవరాజు, కుమారి మేరి, లక్ష్మి, అరుణ, విజయ రాణి, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. (Story:అర్హులైన ప్రతి పేదవాడికిరెండు సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలి)

ఆపరేషన్ కగార్ ను ఆపి శాంతి చర్చలు జరపాలి: రమేష్

0

ఆపరేషన్ కగార్ ను ఆపి శాంతి చర్చలు జరపాలి: రమేష్

న్యూస్‌తెలుగు/వ‌న‌ప‌ర్తి : కేంద్ర ప్రభుత్వం దండకారణ్యంలో ఆపరేషన్ కగార్ పేరుతో జరుపుతున్న మారణ హోమాన్ని ఆపి, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని సిపిఐ వనపర్తి పట్టణ కార్యదర్శి రమేష్ డిమాండ్ చేశారు. అడవుల్లో కాల్పులను విరమించి మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని రేపు హైదరాబాద్ ఇందిరా పార్క్ లో నిర్వహించనున్న మహా ధర్నా గోడపత్రికలను విడుదల చేశారు. మాట్లాడుతూ.. అడవుల్లోని ఖనిజ సంపదను, వనరులను కార్పొరేట్లకు కట్టబెట్టి అందుకు అడవుల్లో ఉన్న మావోయిస్టులను ఆదివాసీలు గిరిజనులను తరిమి వేసేందుకే కేంద్రం ఆపరేషన్ కగారును చేపట్టిందన్నారు. దీనికి వ్యతిరేకంగా రేపు ఇందిరా పార్క్ లో శాంతి చర్చల కమిటీ ఆధ్వర్యంలో మహాధర్నా జరుగుతోందని అన్ని వర్గాల ప్రజలు తరలిరావాలని కోరారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కళావతమ్మ, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పృథ్వి నాదం, నేతలు శిరీష, జ్యోతి,తదితరులు పాల్గొన్నారు. (Story:ఆపరేషన్ కగార్ ను ఆపి శాంతి చర్చలు జరపాలి: రమేష్)

Photo Gallery

error: Content is protected !!