Home Blog

సాలూరులో సర్పంచుల సన్మానం

0

సాలూరులో సర్పంచుల సన్మానం

ప్రభుత్వ వైఫల్యాలపై నాయకుల ఘాటు విమర్శలు

న్యూస్ తెలుగు /సాలూరు  : గ్రామాల్లో అధికారులు ప్రభుత్వం సహకరించకపోయినా నిధులు ఇవ్వకపోయినా సర్పంచులందరూ ప్రజల పక్షాన నిలబడి వైయస్సార్ పార్టీలో ఉండి గ్రామాల్లో అభివృద్ధి చేశారని అందుకు ప్రతి ఒక్కరిని అభినందించి ఈ సన్మానం బాధ్యత వైయస్సార్ పార్టీ నాయకులు పై ఉందని ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) తెలిపారు. బుధవారం మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర స్వగృహంలో సాలూరు నియోజకవర్గం సర్పంచుల సన్మాన కార్యక్రమంలో పాల్గొని సర్పంచులందరినీ సన్మానించారు.. ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వైయస్సార్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు పీడిక రాజన్న దొర అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజాసేవలో పదవీ విరమణ లేదని ప్రజలకు అన్ని సహాయ సహకారాలు చేయడమే నిజమైన ప్రజా సేవ అని అన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్న రాష్ట్రంలో అప్పులు చేయడం తప్ప అభివృద్ధి ఏమీ జరగలేదని అన్నారు. స్థానిక మంత్రి సంధ్యారాణి గిరిజనుల, ప్రజలను పట్టించుకోకుండా దొరికింది దోచుకోవడమే ఆమె పని అని తెలియజేశారు. గత ప్రభుత్వంలో ప్రారంభించిన సచివాలయాలు, హాస్పిటల్స్, రోడ్లు ప్రారంభించడం తప్ప ఈ ప్రభుత్వంలో ఒక్క రోడ్డు గానీ ఒక హాస్పెటల్ గానీ నిధులు మంజూరు చేయలేదని అన్నారు. మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రి రాజన్న దొర హయయాంలో పరిపాలన ఎలా ఉందో ఇప్పటి మంత్రి సంధ్యారాణి పరిపాలన ఎలా ఉందో ప్రజలకు తేట తెల్లం అయిందని అన్నారు. రాజన్న దొర హాయాయంలో సాలూరు నియోజకవర్గం అభివృద్ధి చెందింది తప్ప ఆమె వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్న అభివృద్ధి చేయలేదని అన్నారు. జిల్లా పరిషత్ సమావేశాల్లో ప్రజల తరఫున సమావేశులకు రాకుండా పార్వతీపురంలో చాటుమాటున సమావేశలు పెట్టుకుని ప్రజా ప్రతినిధులుగా మమ్మల్ని పిలకుండా సమావేశాలు పెట్టుకోవడం జరుగుతుందని అన్నారు మమ్మల్ని పిలిస్తే నిడదీస్తామని భయంతో ఇలా చాటుమాటున సమావేశాలు పెట్టుకోవడం జరుగుతుందన్నారు.రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని అన్నారు. మొక్కజొన్న 2400 మద్దతు ధర ఉంటే ప్రైవేటు వ్యాపారస్తులు 1600 నుంచి 1700 రూపాయలకే కొనుగోలు చేయడం వలన రైతు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. వెంటనే ఈ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. రానున్న స్థానిక మున్సిపల్ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికల్లో మన కార్యకర్తలందరూ సైనికుల పనిచేసే సాలూరులో వైయస్సార్ పార్టీ జెండాను ఎగరవేయలని అన్నారు.
మాడుగుల మాజీ శాసనసభ్యులు మాజీ ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నిరంతరం ప్రజల కోసం పనిచేసే అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు ఇవ్వడం ఈ పార్టీలో ఉన్నందుకు గర్వకారణంగా ఉందని అన్నారు. అధికారులు ప్రభుత్వం సహకరించకపోయినా సర్పంచులు ప్రజల కోసం పోరాడి గ్రామాల్లో అభివృద్ధి చేయడం మీరందరినీ అభినందించవలసిన బాధ్యత మాపై ఉందని అన్నారు. గ్రామాల్లో పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, ఇల్లు పట్టాలు, సామాజిక పెన్షన్లు గ్రామ సచివాలయాల ద్వారా అభివృద్ధి చేసామ అని తెలియజేశారు. ఈ అభివృద్ధి జరగడానికి గల కారణం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తెలియజేశారు.
రాజన్న దొర మాట్లాడుతూ ఈ ప్రభుత్వం అబద్ధపు పునాదులతో ప్రజలన్నీ మోసం చేసి అధికారంలోకి వచ్చిందని అధికారం లోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్క మహిళకు సంవత్సరానికి 18000 ఇస్తామని చెప్పి ఆ మాట నెరవేర్చలేదని అన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 3000 ఇస్తామని చెప్పి ఆ వాగ్దానము తుంగలో తొక్కిరనన్నారు. 50 సంవత్సరాలు నిన్న ఎస్సీ ఎస్టీ బీసీ వారికి సామాజిక పెన్షన్ ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఆ హామీ నెరవేర్చలేదని అన్నారు. నేను అధికారంలో ఉండేటప్పుడు ఒక ఉద్యోగస్తులు కూడా తొలగించలేదని స్థానిక మంత్రి సంధ్యారాణి వచ్చిన తర్వాత సాలూరు నియోజకవర్గంలో వందలాదిమంది నిరుద్యోగులను తొలగించి రాక్షసనందాన్ని పొందుతున్నారని అన్నారు. ఈ ఐదు సంవత్సరాలు ప్రజలకి సేవచేసిన ప్రతి ఒక్క సర్పంచ్ కి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాననీ ఆయన తెలిపారు. అరకు పార్లమెంట్ సభ్యురాలు గుమ్మ తనుజారాణి మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు రాజకీయాలోనికి ప్రజలు సేవ చేయడం మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల జడ్పిటిసిలు, ఎంపీటీసీలు, సర్పంచులు మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ , మాజీ కౌన్సిలర్లు, వైయస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు మాజీ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. (Story:సాలూరులో సర్పంచుల సన్మానం)

రాయనపాడు చెరువుని ఆక్రమిస్తే స‌హించంః దోనేపూడి శంకర్

0

రాయనపాడు చెరువుని ఆక్రమిస్తే స‌హించంః దోనేపూడి శంకర్

న్యూస్‌తెలుగు/విజ‌య‌వాడ: రాయన పాడు చెరువును అక్రమణకు గురికాకుండా పరిరక్షించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మరియు ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా సిపిఐ సమితి ఆధ్వర్యంలో విజయవాడ రూరల్ మండలం రాయన పాడు చెరువు అన్యాక్రాంతమవుతున్న నేపథ్యంలో ఆ చెరువును సందర్శించి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తరతరాలుగా ఆయకట్టు రైతులకు మరియు చెరువు ఆధారంగా ఏర్పడిన స్థానిక దళిత మత్స్య సొసైటీ సభ్యులకు జీవనాధారంగా ఉన్న ఈ చెరువును ఆక్రమణ గురికాకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఈ చెరువు 300ఎకరాలు విస్తరణలో ఉందని కొంత మంది పెత్తందార్లు ఈ చెరువును వివిధ కారణాలతో ఆక్రమణ చేస్తున్నరన్నారు.ఈ చెరువు ఆధారంగా సుమారు 100 మంది దళిత మత్స్యకారులు సోసైటి ఏర్పాటు చేసుకుని జీవనం పొందుతున్నారన్నారు. ఈ చెరువు అక్రమణ గురైతే ఒకవైపు రైతులు మరోవైపు దళిత మత్స్యకారులు జీవనాధారం కోల్పోయి వీధిన పడే అవకాశం ఉందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని రాయనపాడు చెరువును పరిరక్షించడానికి అన్ని రకాల చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య ,దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బుట్టి రాయప్ప,డి హెచ్ పి ఎస్ విజయవాడ నగర అధ్యక్షులు సంగుల పేరయ్య,కౌలురైతుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పెయ్యల వెంకటేశ్వరరావు, సిపిఐ రాయనపాడు గ్రామ కార్యదర్శి బత్తుల సత్యనారాయణ, రాయనపాడు దళిత మత్స్య సోసైటి కార్యదర్శి బోళ్ళ రవి,సోసైటి సభ్యులు మల్లాది వెంకటేశ్వరరావు,మందా ఏసుపాదం, తదితరులు పాల్గొన్నారు. (Story: రాయనపాడు చెరువుని ఆక్రమిస్తే స‌హించంః దోనేపూడి శంకర్)

Just Look:

ఆ చేప కన్పిస్తే..సునామీనే!

అనుదీప్ హ‌త్య‌పై స‌మ‌గ్ర విచార‌ణ జ‌ర‌పాలి: చందు జ‌నార్ద‌న్‌

0

అనుదీప్ హ‌త్య‌పై స‌మ‌గ్ర విచార‌ణ జ‌ర‌పాలి: చందు జ‌నార్ద‌న్‌

న్యూస్‌తెలుగు/ఏలూరు: అంబటి అనుదీప్ హత్యపై విచారణ అధికారిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పెదవేగి సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్‌ను శుక్రవారం ఏలూరులో వారి కార్యాలయంలో రాష్ట్ర కాపు జేఏసి అధ్యక్షులు చందు జనార్దన్ కలిశారు. విచారణ త్వరిత గతిన పూర్తి చేయాలని దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని చందు జనార్ధన్ డిమాండ్ చేశారు. అనంతరం చందు జనార్దన్ మాట్లాడుతూ, అంబటి అనుదీప్‌ను చంపుతామంటూ ఇంటికి వచ్చి బెదిరించిన వారిని ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడం, సంఘటన జరిగిన నాటినుండి నేటి వరకు అనేక అనుమానాలు ఉన్నదృష్ట్యా అవి నివృత్తి జరిగే పరిస్థితి లేదని అన్నారు. వీటన్నిటి దృష్ట్యా ఆదివారం సాయంత్రం చాట్రాయ్‌లో దివంగత అంబటి అనుదీప్ నివాసంలో సమావేశం అయి కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నట్లు చందు జనార్దన్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో చాట్రాయ్ జనసేన నాయకులు తుమ్మల జగన్, అనుదీప్ తండ్రి అంబటి గోపి, జే ఏ సి నాయకులు ఏ వి శ్రీనువాస్, జగదీష్, కడవకొల్లు సాగర్, శ్రీనివాస్, చాట్రాయ్ యువ నాయకత్వం పాల్గొన్నారు. (Story: అనుదీప్ హ‌త్య‌పై స‌మ‌గ్ర విచార‌ణ జ‌ర‌పాలి: చందు జ‌నార్ద‌న్‌)

Note: 

సామాన్యులకు వరం: పోస్ట‌ల్‌లో అదిరిపోయే బీమా ప‌థ‌కాలు

వెలుగులో జరిగిన కోటికి పైగా అవినీతిపై ఉన్నత అధికారులు మౌనం.సీపీఎం

0

వెలుగులో జరిగిన కోటికి పైగా అవినీతిపై ఉన్నత అధికారులు మౌనం.సీపీఎం

న్యూస్ తెలుగు/చింతూరు : చింతూరు వెలుగు ప్రాజెక్ట్ లో రు. కోటి కి పైగా అవినీతి జరిగినా అధికారులు మౌనం వహిస్తున్నారని ఆరోపించారు. శుక్రవారం సి పి యం పార్టీ ఆఫీస్ లో జరిగిన సమావేశం లో పార్టీ మండల కార్యదర్శి పల్లపు వెంకట్ మాట్లాడుతూ చింతూరు మండలంలో వెలుగులో కోటికి పైగా అవినీతి జరిగినా అనేక దఫాలుగా గ్రూప్ సభ్యులు ఉన్నతాధికారులకి ఫిర్యాదు చేసిన అధికారులు మౌనం వహిస్తున్నారు. గతంలో ఉన్న వెలుగు అధికారులు ఆధ్వర్యంలో అవినీతి జరిగింది. కోటికి పైగా అవినీతి జరిగింది గ్రూప్ సభ్యులు అమాయకులు బలైపోతున్నారు. కొత్తగా అప్పు తీసుకుందామంటే మీ పేరు మీద లోన్ తీసుకున్నారు.కాబట్టి మీకు కొత్తగా అప్పు రాదని అధికారులు చెబుతున్న దానివలన గ్రూప్ సభ్యులు హార్దిక ఇబ్బందుల్లో తున్నారు. అవినీతి జరిగిందని కంప్లైంట్ పెట్టగా సర్ఫ్ నుండి వచ్చిన కమిటీ కూడా కోటికి పైగా వెలుగులో అవినీతి జరిగిందని రిపోర్టు ఇచ్చినా కూడా. జిల్లా కలెక్టర్ ఐ టి డి ఏ పి ఓ. మౌనం వహిస్తున్నారు. సమస్య పరిష్కారం చేయకపోతే గ్రూప్ సభ్యులందరికీ కూడా ఐక్యం చేసి పోరాటం చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి వర్గ సభ్యులు మోట్టం రాజయ్య. పోడియం లక్ష్మణ్. మాజీ జెడ్పిటిసి ముర్రం రంగమ్మ. పార్టీ మండల కమిటీ సభ్యులు కారం సుబ్బారావు. చింత రాంబాబు. కారం నగేష్. సవలం కన్నయ్య. సోడి దుర్గారావు. తదితరులు పాల్గొన్నారు.(Story :వెలుగులో జరిగిన కోటికి పైగా అవినీతిపై ఉన్నత అధికారులు మౌనం.సీపీఎం )

చింతూరు యస్ ఐ గా సంతోష్ కుమార్

0

చింతూరు యస్ ఐ గా సంతోష్ కుమార్

న్యూస్ తెలుగు/చింతూరు : చింతూరు ఎస్సైగా ఎం సంతోష్ కుమార్ శుక్రవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈయన గతంలో విఆర్ పురం ఎస్సైగా పనిచేసి బదిలీపై చింతూరు కి వచ్చారు . ఇప్పటివరకు చింతూరు ఎస్సైగా పనిచేసిన రమేష్ రంపచోడవరం బదిలీపై వెళ్లారు.(story : చింతూరు యస్ ఐ గా సంతోష్ కుమార్ )

ఎస్సై ఆధ్వర్యంలో గ్రామాల సందర్శన

0

ఎస్సై ఆధ్వర్యంలో గ్రామాల సందర్శన

న్యూస్ తెలుగు/చింతూరు : చింతూరు ఎస్సై సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో విలేజ్ విజిట్ కార్య క్రమం నిర్వహించారు. పోలీస్ ఉన్నతాధికారులైన డిజిపి హరీష్ గుప్తా , పోలవరం జిల్లా ఎస్పీ అమిత్ బర్డర్ , ఎస్పి బొడ్డు హేమంత్ , సిఐ గోపాలకృష్ణ నేతృత్వంలో చింతూరు ఎస్ఐ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో నిమ్మలగూడెం,కుయుగూరు . చత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల సరిహద్దు పోలీస్ స్టేషన్ అవడంతో, గంజాయి అక్రమ రవాణా, కొత్త వ్యక్తుల గురించి సమాచారం ఇవ్వాలని, సైబర్ నేరలపట్ల అప్రమత్తం గా ఉండాలని,అలాగే గ్రామంలోని సమస్యలను తమ దృష్టికి తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ,ఎస్ఐ సంతోష్ కుమార్ , తో పాటు,ఎ ఎస్ఐ దొర, , పోలీసు సిబ్బంది, పాల్గొన్నారు.(Story : ఎస్సై ఆధ్వర్యంలో గ్రామాల సందర్శన  )

వైద్య వ్యర్థాలు మున్సిపల్ వాహనాలకు ఇస్తే చట్టరీత్యా నేరం….

0

వైద్య వ్యర్థాలు మున్సిపల్ వాహనాలకు ఇస్తే చట్టరీత్యా నేరం….

న్యూస్ తెలుగు/వినుకొండ  : స్వచ్ఛ సర్వేక్షన్ 2025-26లో మెరుగైన ర్యాంకు సాధించడమే లక్ష్యంగా వినుకొండ మున్సిపల్ అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్ల ఆదేశాలతో.. కమిషనర్ కోడూరి శివరాం ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు, ఆర్ఎంపీలు, ల్యాబ్ టెక్నీషియన్లతో మున్సిపల్ కౌన్సిల్ హాల్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ మాట్లాడుతూ.. ఆసుపత్రుల నుండి వచ్చే ప్రమాదకర బయో మెడికల్ వ్యర్థాలను మున్సిపాలిటీ చెత్త వాహనాలకు ఇవ్వడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. వైద్య వ్యర్థాలను పసుపు, నీలం, ఎరుపు, తెలుపు రంగు డబ్బాల్లో వర్గీకరించి, ప్రభుత్వం గుర్తించిన ‘సేఫ్ ఎన్విరాన్’ (గుంటూరు) సంస్థకు మాత్రమే ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ వ్యర్థాలను సాధారణ చెత్తతో కలిపితే పారిశుద్ధ్య కార్మికులకు ఇన్ఫెక్షన్లు, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. అలాగే పట్టణాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు ఆసుపత్రి ప్రాంగణాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఆసుపత్రుల ప్రతినిధులు, ఆర్ఎంపీ సంఘం సభ్యులు ఇకపై నిబంధనల ప్రకారమే వ్యర్థాలను అందిస్తామని, ప్లాస్టిక్ నిషేధానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ ఆదినారాయణ, అయిల్సగ్ జిల్లా కో-ఆర్డినేటర్ శివపార్వతి, ఆర్ఎంపీ అసోసియేషన్ ప్రెసిడెంట్ జయరాజ్, కోశాధికారి హుస్సేన్, వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.(Story : వైద్య వ్యర్థాలు మున్సిపల్ వాహనాలకు ఇస్తే చట్టరీత్యా నేరం…. )

అమరావతికి చట్టబద్ధత: వినుకొండ జనసేన కార్యాలయంలో సంబరాలు….

0

అమరావతికి చట్టబద్ధత: వినుకొండ జనసేన కార్యాలయంలో సంబరాలు….

న్యూస్ తెలుగు/వినుకొండ  : ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందడం పట్ల జనసేన శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. పార్టీ కేంద్ర కార్యాలయ ఆదేశాలు, నియోజకవర్గ సమన్వయకర్త కొంజేటి నాగశ్రీను సూచనల మేరకు వెల్లటూరు రోడ్డులోని జనసేన పార్టీ కార్యాలయంలో దీపాలు వెలిగించి ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.(Story ; అమరావతికి చట్టబద్ధత: వినుకొండ జనసేన కార్యాలయంలో సంబరాలు…. )

వినుకొండ మున్సిపాలిటీలో మరో 4 కొత్త వార్డులు…

0

వినుకొండ మున్సిపాలిటీలో మరో 4 కొత్త వార్డులు…

న్యూస్ తెలుగు/వినుకొండ  : వినుకొండ పురపాలక సంఘంలో అదనంగా మరో నాలుగు కొత్త వార్డులు ఏర్పాటు కానున్నాయి. జీవో 64 ప్రకారం ప్రస్తుతం ఉన్న 32 వార్డులకు అదనంగా మరో 4 చేరితే, మొత్తం వార్డుల సంఖ్య 36కు చేరుతుందని మున్సిపల్ కమిషనర్ కె. శివరామ్ ప్రసాద్ వెల్లడించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో వార్డుల పునర్విభజన ప్రక్రియను ప్రారంభించినట్లు ఆయన ఒక మీడియా సమావేశంలో తెలిపారు. ఏప్రిల్ 2న ప్రారంభమైన ఈ పునర్విభజన ప్రక్రియపై ప్రజలు తమ సలహాలు, సూచనలు లేదా అభ్యంతరాలను ఏప్రిల్ 9వ తేదీ వరకు తెలియజేయవచ్చన్నారు. అభ్యంతరాల స్వీకరణ అనంతరం నివేదికలను కలెక్టర్‌కు పంపి, ఏప్రిల్ 26వ తేదీలోపు వార్డుల పెంపు ప్రక్రియను పూర్తిగా ముగిస్తారు. 2011 జనాభా లెక్కలు, వార్డుల వారీగా ఓటర్లు, సామాజిక వర్గాల ఆధారంగా ఈ విభజన జరగనుంది.
ఆస్తిపన్ను వసూళ్లలో వినుకొండ మున్సిపాలిటీ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని కమిషనర్ ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. అలాగే, ప్రస్తుతం జరుగుతున్న కులగణన, జనగణన కార్యక్రమాలకు పట్టణ ప్రజలు సిబ్బందికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.(Story : వినుకొండ మున్సిపాలిటీలో మరో 4 కొత్త వార్డులు… )

ఒకే రాష్ట్రం ఒకే రాజధాని

0

ఒకే రాష్ట్రం ఒకే రాజధాని

అమరావతి అజేయం

బాణాసంచా వెలుగుల్లో విరజల్లిన సంబరాలు

చింతూరు మండల కూటమి నాయకులు హర్షం

న్యూస్ తెలుగు/చింతూరు : చింతూరు మండల కేంద్రంలో అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదం పొందడం అత్యంత శుభ పరిమాణం అని హర్షం వ్యక్తం చేస్తూ ఇది రాష్ట్ర ప్రజలంతా గర్వంగా సంబరాలు చేసుకోవాల్సిన సమయమని చింతూరు మండల కూటమి నాయకులు తెలియజేశారు.ఇకపై రాజధానిగా అమరావతి అజేయంగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అమరావతి బిల్లుకు మద్దతు తెలియజేసిన ప్రధానమంత్రి కి మరియు హోం మంత్రికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వర్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో టిడిపి కార్యాలయం నుండి అంబేద్కర్, ఇందిరా రాజీవ్ సెంటర్ల మీదుగా ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి, ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా ఆంధ్రుల రాజధాని అమరావతి అని నినాదాలు చేశారు. కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లెల వెంకటేశ్వరరావు, మాజీ మండల అధ్యక్షుడు ఎండి జహంగీర్, ఇ ల్లా చిన్నారెడ్డి, ఓ రామారావు చౌదరి, మార్కెట్ కమిటీ సభ్యుడు, పి సాలమన్ రాజు, క్లస్టర్ ఇంచార్జ్ ఓ నరసింహారావు, జనసేన నాయకులు పేయ్యాల నాగేశ్వరరావు, మహిళా మండల అధ్యక్షురాలు మంగవేణి, ఎస్టి సెల్ అధ్యక్షులు తుర్రం ముత్తయ్య, కట్ట శంకర్, ఎండి రియాజ్, జగదీష్, ఎస్ కే జానీ, జనసేన నాయకులు బిడే సతీష్, బిజెపి మండల అధ్యక్షులు బట్ట లక్ష్మణరావు, చిట్టిబాబు, ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ శాఖల అధికారులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.(story : ఒకే రాష్ట్రం ఒకే రాజధాని )

Photo Gallery

error: Content is protected !!