Home Blog

చీఫ్ విప్ జీవీకి “ ఏ గ్రేడ్”

0

చీఫ్ విప్ జీవీకి “ ఏ గ్రేడ్”

న్యూస్ తెలుగు/వినుకొండ  : వినుకొండ శాసన సభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులుకు “ఏ” గ్రేడ్ దక్కింది. రాష్ట్రంలోని శాసన సభ్యుల పనితీరు ఆధారంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేయించి, వచ్చిన నివేదికల ఆధారంగా గ్రేడ్లు ఇస్తూ మార్గనిర్దేశనం చేస్తున్నారు. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ముందు వరుసలో నిలిచి “ఏ” గ్రేడ్ సాధించటం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుండి ప్రశంశలు అందుకున్నారు. రానున్న రోజుల్లో ప్రజలకు మరింత చేరువగా ఉంటూ వినుకొండను అభివృద్ధి చేయాలని తపిస్తున్న జీవి ఆంజనేయులుకు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వినుకొండ పర్యటనకు రావటం, వెటర్నరీ కాలేజీ ఏర్పాటు చేస్తామని ప్రకటించటం మరింత ఊరటనిచ్చింది. ఇవేకాక ఇప్పటికే నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పూర్తి చేసేదిశగా చంద్రబాబు నాయుడు భరోసా నివ్వటంతోపాటు, వినుకొండ పట్టణంలో 21 ఎకరాల ఎన్.ఎస్.పి స్థలాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి, వినుకొండకే తలమానికంగా తీర్చిదిద్దేందుకు సుమారు రూ.50కోట్ల నుండి 100 కోట్ల వరకు నిధులు ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడు అంగీకారం తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గంలో 100 పేద కుటుంబాలను పీ4 ద్వారా దత్తత తీసుకున్న జీవీ ఆంజనేయులు దంపతులను సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. ప్రజాదర్బార్ ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న జీవి ఆంజనేయులు నియోజకవర్గ ప్రజలకు మరింత అందుబాటులో ఉంటూ, వారి సమస్యలు పరిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో జీవికి “ఏ” గ్రేడ్ దక్కటంపై కేడర్లో ఉత్సాహం రెట్టింప్పైంది.(Story : చీఫ్ విప్ జీవీకి “ ఏ గ్రేడ్” )

హర్ష స్కూల్‌లో స్వచ్ఛ సర్వేక్షణ్ అవగాహన సదస్సు

0

హర్ష స్కూల్‌లో స్వచ్ఛ సర్వేక్షణ్ అవగాహన సదస్సు

న్యూస్ తెలుగు/వినుకొండ :  స్థానిక తిమ్మాయపాలెం రోడ్‌లోని హర్ష స్కూల్‌లో విద్యార్థులకు స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26పై మున్సిపల్ కమిషనర్ కె. శివరాం ప్రసాద్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే జి.వి. ఆంజనేయులు, కలెక్టర్ కృతికా శుక్లా, మున్సిపల్ చైర్ పర్సన్ షేక్ దస్తగిరి ఆదేశాల మేరకు ఈ సదస్సు జరిగింది.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. తడి, పొడి, హానికర వ్యర్థాలను వేరు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను, వర్మీ కంపోస్ట్ తయారీ విధానాన్ని విద్యార్థులకు వివరించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకంతో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వస్తాయని, వీటికి బదులుగా క్లాత్, జ్యూట్ బ్యాగులు లేదా స్టీల్ బాక్సులు వాడాలని సూచించారు. రోడ్లు, కాలువలు, ఖాళీ ప్రదేశాల్లో చెత్త వేయకుండా ‘విజువల్ క్లీన్ వినుకొండ’ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్, స్కూల్ డైరెక్టర్ పోకూరి శ్రీనివాసరావు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.(Story : హర్ష స్కూల్‌లో స్వచ్ఛ సర్వేక్షణ్ అవగాహన సదస్సు )

ఎన్ఎస్పీ కాలనీ జెడ్పీ హైస్కూల్ విద్యార్థులకు క్రీడా దుస్తుల పంపిణీ

0

ఎన్ఎస్పీ కాలనీ జెడ్పీ హైస్కూల్ విద్యార్థులకు క్రీడా దుస్తుల పంపిణీ

న్యూస్ తెలుగు/వినుకొండ : స్థానిక ఎన్ఎస్పీ కాలనీలోని జెడ్పీ హైస్కూల్ క్రీడాకారులకు గురువారం క్రీడా దుస్తుల పంపిణీ కార్యక్రమం జరిగింది. వినుకొండ పట్టణానికి చెందిన వ్యాపారవేత్త యోండ్లూరి సత్యనారాయణ సుమారు రూ. 30 వేల విలువచేసే 60 జతల క్రీడా దుస్తులను విద్యార్థులకు బహుకరించారు. ఈ కార్యక్రమానికి వినుకొండ పట్టణ సీఐ ప్రభాకర్, రూరల్ సీఐ బ్రహ్మయ్య, పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ కోటేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరై క్రీడాకారులకు దుస్తులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా దాత సత్యనారాయణ మాట్లాడుతూ.. తన మిత్రుడు, పాఠశాల పీడీ రాధాకృష్ణమూర్తి దృష్టికి తీసుకురావడంతో ఈ దుస్తులు అందజేశానని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో పాల్గొని దేహదారుఢ్యాన్ని పెంచుకోవాలని, తద్వారా మానసికంగా దృఢంగా ఉండి చదువుల్లోనూ రాణిస్తారని అన్నారు. విద్యార్థులు రోజూ గంటసేపు మైదానంలో ఆడుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని, క్రీడా మైదానాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలని సీఐలు ప్రభాకర్, బ్రహ్మయ్య ఆకాంక్షించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సీహెచ్. వీరప్పయ్య మాట్లాడుతూ.. నూతనంగా అప్‌గ్రేడ్ అయిన తమ పాఠశాలలో మౌలిక వసతుల లేమిని దాతల దృష్టికి తీసుకెళ్లగానే వారు స్పందించి సహాయ సహకారాలు అందించడం అభినందనీయమన్నారు. క్రీడా దుస్తులు అందించిన సత్యనారాయణకు పాఠశాల తరఫున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీ ఆర్. రాధాకృష్ణమూర్తి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.(Story : ఎన్ఎస్పీ కాలనీ జెడ్పీ హైస్కూల్ విద్యార్థులకు క్రీడా దుస్తుల పంపిణీ )

వైయస్సార్ ను ఆరాధిస్తూ, జగన్మోహన్ రెడ్డికి అండగా నిలుస్తున్న ముస్లిం, క్రైస్తవ, గిరిజన కుటుంబాలు

0

వైయస్సార్ ను ఆరాధిస్తూ, జగన్మోహన్ రెడ్డికి అండగా నిలుస్తున్న ముస్లిం, క్రైస్తవ, గిరిజన కుటుంబాలు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఎగురవేసిన వైసీపీ నేతలు….

న్యూస్ తెలుగు/వనపర్తి : వైయస్సార్సీపి 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించుకున్నారు. వైసిపి కార్యాలయ ఆవరణలో వైసీపీ నేతలు పార్టీ జెండాను ఆవిష్కరించి. కార్యాలయంలో దివంగత వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అలాగే పట్టణంలో ఉన్న వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి. పలు ప్రాంతాలలో ఆహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఏ. అంజిరెడ్డి, సీనియర్ న్యాయవాది, జిల్లా అధికార ప్రతినిధి ఎంఎన్. ప్రసాద్, రాష్ట్ర పంచాయతీరాజ్ కార్యదర్శి పగడాల వెంకటరామిరెడ్డి, బొల్లాపల్లి ఎంపీపీ బి గురవయ్య, నూజెండ్ల ఎంపీపీ జయరామిరెడ్డి, ఈపూరు జడ్పిటిసి చౌడయ్య, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ గంధం బాలిరెడ్డి, గిరిజన తెగ నాయకులు గోవింద నాయక్ మాట్లాడుతూ. వైసిపి కష్టాల నుండి పుట్టిన పార్టీ అని, అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉండేందుకు ఆనాడు కేంద్ర కాంగ్రెస్ నాయకత్వాన్ని ఎదిరించి పెట్టిన పార్టీ వైసీపీ అని అన్నారు. వైయస్సార్ సంక్షేమ పథకాలన్నీ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో అమలు చేస్తూ ముందుకు సాగారన్నారు. మరల ఎన్నికల్లో 40% ఓట్లు సాధించుకున్న వైసిపి అన్ని వర్గాల ప్రజల్లో నిలిచిపోయిందన్నారు. కాగా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తున్నప్పటికీ, వైసిపి నాయకులు కార్యకర్తలు ఎటువంటి ఆందోళన పడకుండా మంచి రోజులు కోసం వేచి చూస్తున్నారని అన్నారు. కాగా ఆనాడు వైయస్సార్ పాలనను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అనుసరిస్తూ వైయస్సార్ వైపు చూశాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలను చైతన్య పరచి, ఆర్థికంగా బలపడేందుకు వైయస్సార్ ఎంతో కృషి చేశారన్నారు. ఇక 15 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి పై కేసులు పెడుతూనే ఉన్నారని, ఏమన్నా ఆధారాలు చూపారా అని వారు ప్రశ్నించారు. ఇక ముస్లిం మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీ, క్రైస్తవ, గిరిజన తెగలన్నీ వైయస్సార్ ను ఆరాధిస్తూ, మరోపక్క జగన్మోహన్ రెడ్డికి అండగా నిలుస్తున్నారని అన్నారు. వైసిపి హయాంలో ప్రభుత్వ పాలన ప్రజల వద్దకే వచ్చిందని, సచివాలయాల వ్యవస్థ, వార్డు వాలంటీర్ల వ్యవస్థ వల్ల లక్ష 20 వేల ఉద్యోగాల కల్పన జరిగి ప్రజలు ఇళ్ల వద్దనే ఉండి సంక్షేమ పథకాలు అందుకున్నారన్నారు. మాయ మహమ్మారి కరోనా కాలంలో వార్డు వాలంటీర్లు చేసిన వైద్య సమాచారం మరువలేనిది అన్నారు. అలాగే ఇంగ్లీషు బోధన విద్యారంగంలో పలు మార్పులు తెచ్చిన ఘనత వైసీపీ దే అన్నారు. ఇక రాజకీయ పదవులు ప్రభుత్వ రిజర్వేషన్లే కాకుండా, ప్రైవేట్ రిజర్వేషన్లు కూడా కల్పించడం వల్ల అందరికీ సమాన రాజకీయ పదవులు లభించాయన్నారు. ఇక కూటమి ప్రభుత్వంలో సూపర్ సిక్స్ పథకంలో కొన్ని అలాగే మిగిలిపోయాయి అన్నారు. నిరుద్యోగ భృతి లేదు, కూటమి హామీలన్నీ అమలు కావటం లేదన్నారు. బొల్లా బ్రహ్మనాయుడు ఒక్క సారి పాలనలో ఎన్ని అభివృద్ధి మార్కులు ఉన్నాయో ప్రజలే చెబుతున్నారని వారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కే శివ, ఆర్ శీను, జయరాజ్, బాలిరెడ్డి, వెంకటరెడ్డి, దండు చెన్నయ్య, బి గురవయ్య, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.(Story : వైయస్సార్ ను ఆరాధిస్తూ, జగన్మోహన్ రెడ్డికి అండగా నిలుస్తున్న ముస్లిం, క్రైస్తవ, గిరిజన కుటుంబాలు )

సిపిఐ జాతీయ కార్యదర్శిని కలిసిన వనపర్తి జిల్లా నేతలు.. పార్టీ పరిస్థితిపై ఆరా

0

సిపిఐ జాతీయ కార్యదర్శిని కలిసిన వనపర్తి జిల్లా నేతలు.. పార్టీ పరిస్థితిపై ఆరా

న్యూస్ తెలుగు/వనపర్తి : సిపిఐ జాతీయ కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే రామకృష్ణను వనపర్తి సిపిఐ జిల్లా నేతలు కలిశారు. గోపాల్పేట మండల కేంద్రంలో ఈనాడు విలేఖరి జయచంద్రుని తల్లి అనసూయమ్మ ఇటీవల ఆకస్మికంగా గుండెపోటుతో మరణించగా, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా నేతలు గోపాల్పేటలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వనపర్తి జిల్లాలో పార్టీ పరిస్థితి, సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో సిపిఐ పోటీ ఫలితాలు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం ద్వారా పార్టీని విస్తరించి పటిష్టం చేయాలని సూచించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి విజయరాములు, నియోజకవర్గ కార్యదర్శి రమేష్, జిల్లా ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యూ గౌరవ అధ్యక్షురాలు, మాజీ సర్పంచ్ కళావతమ్మ, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు శ్రీహరి, సిపిఐ వనపర్తి పట్టణ సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు నరేష్, డి హెచ్ పి ఎస్ జిల్లా సహాయ కార్యదర్శి శేఖర్, ఏఐఎస్ఎఫ్ డివిజన్ కార్యదర్శి వంశీ తదితరులు పాల్గొన్నారు.(Story : సిపిఐ జాతీయ కార్యదర్శిని కలిసిన వనపర్తి జిల్లా నేతలు.. పార్టీ పరిస్థితిపై ఆరా )

భూసేకరణ, ఇతర పెండింగ్ అంశాలను త్వరితగతిన పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలి

0

భూసేకరణ, ఇతర పెండింగ్ అంశాలను త్వరితగతిన పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలి

న్యూస్ తెలుగు/వనపర్తి : జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్లో ఉన్న భూసేకరణ, ఇతర పెండింగ్ అంశాలను త్వరితగతిన పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆర్ అండ్ ఆర్ కమిషనర్ కే శివకుమార్ నాయుడు ఆదేశించారు. తెలంగాణ ఆర్ అండ్ ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడు గురువారం నాడు వనపర్తి జిల్లాలో ఆకస్మికంగా పర్యటించారు . ఈ పర్యటనలో భాగంగా ఆయన ఐడిఓసి కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ఇరిగేషన్ మరియు రెవెన్యూ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లాలో కొనసాగుతున్న పలు నీటిపారుదల ప్రాజెక్టుల భూ సేకరణకు సంబంధించిన పెండింగ్ అంశాలు, పునరావాస పనుల పురోగతి అంశాలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. జిల్లాలో గణపసముద్రం ప్రాజెక్టులో భాగంగా పెండింగ్లో ఉన్న 197 ఎకరాల భూసేకరణకు వెంటనే ఎంజాయ్మెంట్ సర్వే పూర్తిచేసి ప్రిలిమినరీ నోటిఫికేషన్ దారి చేయాలని ఆదేశించారు. అదేవిధంగా కర్నె తాండ లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించి పెండింగ్ 26 ఎకరాల భూసేకరణకు పెగ్ మార్కింగ్ ఈనెల 14వ తేదీలోపు పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ అధికారులకు ఆదేశించారు. మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద డి 1, డి 5, డి 8, ప్యాకేజ్ 29 కు సంబంధించి 92 ఎకరాల భూసేకరణకు పెగ్ మార్కింగ్ త్వరగా వారంలోపు కంప్లీట్ చేయాలి అన్నారు. ఘనపూర్ బ్రాంచ్ కెనాల్ కు సంబంధించి మార్కింగ్ పూర్తయిన 31 ఎకరాల భూమికి సంబంధించి సర్వే శాఖ అధికారులు వెంటనే ఎంజాయ్మెంట్ సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. అంతకుముందు కొత్తకోట మండల పరిధిలోని కానాయిపల్లి ఆర్ అండ్ ఆర్ సెంటర్ తో పాటు, శంకర సముద్రాన్ని సందర్శించిన కమిషనర్ అరెండర్ సెంటర్లో పెండింగ్ అంశాలను త్వరలోనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ నాగేందర్, ఎస్ ఈ చంద్రశేఖర్, ఈ ఈ కేశవరావు, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, సర్వే ఏడి శ్రీనివాసులు, ఇతర రెవెన్యూ అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.(Story : భూసేకరణ, ఇతర పెండింగ్ అంశాలను త్వరితగతిన పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలి )

కాంగ్రెస్ జెండా నీడలోనే కడవరకు ఉందాం

0

కాంగ్రెస్ జెండా నీడలోనే కడవరకు ఉందాం

న్యూస్ తెలుగు/వనపర్తి : కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ జెండా కిందనే పార్టీ లైన్లోనే కడవరకు పని పనిచేయాలని పార్టీలైన్ తప్పకూడదని పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని RG గార్డెన్స్ లో నిర్వహించిన వనపర్తి మండల మరియు పట్టణ కమిటీ ఏర్పాటు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సమావేశంలో ఆయన DCC అధ్యక్షులు శివసేనరెడ్డి , ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి గార్లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేటి నుంచి మరో 15 సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉంటుందని ప్రతిపక్షాలకు ఎలాంటి తావులేదు అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో BRS పార్టీ భూస్థాపితం అయిపోయిందని Bjp పార్టీ ఆంధ్రాలోని చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ గార్లు ఇచ్చిన సపోర్టుతో చివరి దశలో అధికారంలోకి వచ్చిందని నేడు బిజెపి పార్టీ వెంటిలేటర్ పై ఉందని అలాంటి పార్టీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రతి ఒక్కరం భావి భారత ప్రధానిగా రాహుల్ గాంధీ గారిని చేసేంతవరకు ఉశ్రమంచకుండా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పనిచేయాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణం కోసం గ్రామస్థాయి నుంచి పార్టీని పట్టిష్టపరిచేందుకు అధిష్టానం నేడు ప్రత్యేక చర్యలు చేపట్టిందని అందులో భాగంగానే నేడు గ్రామ కమిటీలు మండల కమిటీలు అనుబంధ సంఘాల కమిటీలను ఏర్పాటు చేస్తుందని, దీంతో కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి సమచిత స్థానం లభిస్తోందని ఎమ్మెల్యే చెప్పారు. మున్సిపల్ చైర్మన్లుగా , వైస్ చైర్మన్గా, కౌన్సిలర్లుగా, వార్డు సభ్యులుగా, సర్పంచులుగా, ఉపసర్పంచులుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, జడ్పిటిసిలుగా ,జడ్పీ చైర్పర్సన్లుగా, సింగిల్ విండో అధ్యక్షులుగా
మార్కెట్ యార్డ్ అధ్యక్షులుగా, ఉపాధ్యక్షులుగా, డైరెక్టర్లుగా , బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులుగా, ఎస్సీ, ఎస్టీ , బీసీ, మైనారిటీ అనుబంధ సంఘాల అధ్యక్షులుగా ,మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ,వ్యవసాయ అనుబంధ సంఘాల్లో బాధ్యులుగా, కాంగ్రెస్ పార్టీ పరమైన కమిటీలలో గ్రామ అధ్యక్షులుగా, మండల అధ్యక్షులుగా, బూత్ అధ్యక్షులుగా, కమిటీలోని ఇతరత్రా బాధ్యత లాంటి అనేక విభాగాల్లో పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుందని ఎవరు నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే చెప్పారు. వీటితోపాటు వనపర్తి నియోజకవర్గానికి రెండు మార్కెట్ యార్డ్ లు, 7 సింగిల్ విండోలు మంజూరు చేయించి నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ బలోపే దానికి శుద్ధి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో వనపర్తి మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, tpcc జర్మన్ సెక్రెటరీ నందిమల్ల యాదయ్య, OBC జిల్లా అధ్యక్షులు కోట్ల రవి, వనపర్తి జిల్లా యూత్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీలత రెడ్డి, ప్రధాన కార్యదర్శి తిరుపతియ్య, మైనార్టీ నాయకులు రహీం, మాజీ ఎంపీపీలు కిచ్చారెడ్డి, శంకర్ నాయక్, మండల అధ్యక్షులు రవి కిరణ్, వనపర్తి పట్టణ కౌన్సిలర్లు, వనపర్తి మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.(Story : కాంగ్రెస్ జెండా నీడలోనే కడవరకు ఉందాం )

కావూరి రాజకీయ జీవితం… ప్రజాసేవకు అంకితం 

0

కావూరి రాజకీయ జీవితం… ప్రజాసేవకు అంకితం 

న్యూస్ తెలుగు/వినుకొండ  : “మాజీ కేంద్రమంత్రి, మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు మృతిపట్ల ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తూ, కావూరి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించారు. తెలుగు రాష్ట్రాల్లో కీలక రాజకీయ నాయకుడిగా కావూరి పేరు ప్రఖ్యాతులు పొందారని, రాజకీయ ప్రస్తానం ఆసాంతం ప్రజాసేవే లక్ష్యంగా సాగిందన్నారు. చివరి శ్వాశ కూడా ప్రజాసేవకే అంకితమైందని, ఐదుసార్లు ఎంపీగా గెలిచిన కావూరి, యూపీయే ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ కేబినెట్ లో కేంద్ర జౌళీశాఖ మంత్రిగా పనిచేశారని,ఆ సమయంలో కావూరి భారత జౌళి పరిశ్రమ అభివృద్ధి, కార్మికుల సంక్షేమానికి విశేష కృషి చేశారన్నారు. తన రాజకీయ జీవితంలో అభివృద్ధి, ప్రజా సంక్షేమానికే ఆయన అధిక ప్రాధాన్యత ఇచ్చారని, పారదర్శకమైన ప్రజాసేవతో తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిరంగా నిలిచారని,ఏలూరు పార్లమెంట్ స్థానం నుంచి రెండుసార్లు, మచిలీపట్నం పార్లమెంట్ నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచిన కావూరి, తనను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకునేందుకు నిత్యం శ్రమించారని చీఫ్ విప్ జీవి ఒక ప్రకటనలో కొనియాడారు.(Story : కావూరి రాజకీయ జీవితం… ప్రజాసేవకు అంకితం  )

పల్నాడు జిల్లా అభివృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్ష

0

పల్నాడు జిల్లా అభివృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్ష

జిల్లా ఇన్చార్జి మంత్రి సహా ఏడుగురు ఎమ్మెల్యేలు హాజరు

న్యూస్ తెలుగు/వినుకొండ  : పల్నాడు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల శాసనసభ్యులు, జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ తోపాటు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల, ఎస్పీ బి కృష్ణారావు లతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. పల్నాడు జిల్లాలో శాంతిభద్రతలు పరిరక్షణ, జిల్లా సమగ్ర అభివృద్ధి, నియోజకవర్గాల వారీగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై సీఎం సమీక్షించారు. ప్రధానంగా పల్నాడు జిల్లాను రాష్ట్రంలో ముందు వరుసలో ఉంచేందుకు ప్రజాప్రతినిధులు అధికారులు సంయుక్తంగా పనిచేసే ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సీఎం సూచించారు. అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని, ఎమ్మెల్యేలు పనితీరును మరింత మెరుగుపరుచుకుని ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. ఈ సందర్భంగా వినుకొండ నియోజకవర్గం లో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై సీఎం చంద్రబాబుకు జీవి ఆంజనేయులు వివరించారు. సీఎం సమీక్ష అనంతరం జీవి ఆంజనేయులు మాట్లాడుతూ పల్నాడు జిల్లా అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయని, జిల్లా అభివృద్ధికి సీఎం సహకారాలు అండ దండలు అందిస్తున్నారని జీవి ఆంజనేయులు తెలిపారు.(Story : పల్నాడు జిల్లా అభివృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్ష )

పదో తరగతి బాలికలకు ఉచిత వ్యక్తిత్వ వికాస శిక్షణ

0

పదో తరగతి బాలికలకు ఉచిత వ్యక్తిత్వ వికాస శిక్షణ

పోస్టర్లను ఆవిష్కరించిన విద్యావంతుల వేదిక

న్యూస్ తెలుగు/వినుకొండ  : 10వ తరగతి పరీక్షలు పూర్తి చేసుకున్న బాలికలకు అనంతరం విద్యా లక్ష్యాల సాధనపై దిశా నిర్దేశం చేసేందుకు ఏప్రిల్ 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకు గుంటూరులో ఉచిత వ్యక్తిత్వ వికాస శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నట్లు వినుకొండ విద్యావంతుల వేదిక సీనియర్ న్యాయవాదులు పి.జె. లూకా, సి.హెచ్. మూర్తి తెలిపారు. డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను వారు ఆవిష్కరించారు.
ఈ శిక్షణా శిబిరంలో యోగా, ధ్యానం, స్పోకెన్ ఇంగ్లీష్‌తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ (చక్కగా మాట్లాడటం, సరిగ్గా చూడటం, వినడం, ఆలోచించడం) తదితర అంశాలపై శిక్షణ ఇస్తామని వారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో వినుకొండ విద్యావంతుల వేదిక సభ్యులు లాయర్ విజయ్, కూచి రామాంజనేయులు, సుధాకర్ రెడ్డి, ఎం.ఏ. సాలార్, తదితరులు పాల్గొన్నారు.(Story : పదో తరగతి బాలికలకు ఉచిత వ్యక్తిత్వ వికాస శిక్షణ )

Photo Gallery

error: Content is protected !!