Home Blog

వైఎస్ జ‌గ‌న్ ప్రెస్‌మీట్ (LIVE) (22-05-2025)

0

వైఎస్ జ‌గ‌న్ ప్రెస్‌మీట్ (లైవ్) (22-05-2025)

#YSJaganMohanReddy #YSJagan #YSJaganPressmeet #YSRCP #TDP #JanasenaParty #BJP #APPolitics #AndhraPolitics

Follow the Stories:

యూనియన్‌ బ్యాంకులో ఉద్యోగాల జాతర

మెగా డీఎస్సీ పోస్టులు ఇవీ..!

ఇల్లు కట్టిచూడు..రాజధాని నిర్మించి చూడు!

టాప్‌ ప్రైవేట్‌ వర్సిటీల్లో ఇంజినీరింగ్‌ సీట్లు ఉచితం!

ఏపీ ఈఏపీసెట్‌-2025 Full Details

పర్యవేక్షణ నిల్‌..ఫలహారం పుల్‌!

జగన్‌ చుట్టూ కోటరీ ఎవరు?

Friday Fear: మ‌రో వైసీపీ నేత అరెస్టుకు రంగం సిద్ధం!

రూ.520తో 10 లక్షలు, రూ. 755తో 15 లక్షలు

కొత్త రేషన్‌ కార్డులొస్తున్నాయి!

సిటీ కిల్ల‌ర్ వ‌చ్చేస్తోంది! ముంబ‌యికి ముప్పు?

స‌డెన్ డెత్: ఈ ఐఫోన్ మోడళ్లను నిలిపేసిన ఆపిల్‌!

నిరుద్యోగులకు మోదీ బంప‌ర్‌ ఆఫర్‌!

మారిన జ‌గ‌న్ వ్యూహ‌ర‌చ‌న: జగన్‌ 2.0 అంటే ఇదేనేమో!

మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?

మున్సిపల్‌ పీఠాలపై కూటమి గురి

బట్టలూడదీసి నిలబెడతా!: జగన్‌

జగన్ సెల్ఫీ కోసం ఏడ్చిన చిన్నారి! (Lovely Photos)

వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
వణికిస్తున్న కొత్త వైర‌స్‌!
శుక్రవారం గండం! వైఎస్ఆర్సీపీలో అలజడి

దుర్గ‌గుడి ల‌డ్డూ ప్ర‌సాదంలో వెంట్రుక‌లు!

క‌రెంట్ క‌ట్ః విద్యుత్ ఏడీఈని నిర్బంధించిన జ‌నం

0

క‌రెంట్ క‌ట్ః విద్యుత్ ఏడీఈని నిర్బంధించిన జ‌నం

సాలూరు ప‌ట్ట‌ణంలో మ‌హిళ‌ల నిర‌స‌న‌
శ్యామ‌లాంబ జాత‌ర‌కు క‌రెంటు దెబ్బ‌
మూడు రోజులుగా చీక‌ట్లోనే సాలూరు ప‌ట్ట‌ణ ప్ర‌జ‌లు

న్యూస్ తెలుగు/సాలూరుః శ్యామ‌లాంబ తిరునాళ్లు చీక‌ట్లో జ‌రుపుకునే ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. గ‌త మూడు రోజులుగా సాలూరు ప‌ట్ట‌ణంలో విద్యుత్ స‌ర‌ఫ‌రా లేక ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే జ‌నం తీవ్ర ఆగ్ర‌హావేశాల‌కు లోనై, ఏకంగా విద్యుత్ శాఖ‌ అధికారిని నిర్బంధించి, త‌మ నిర‌స‌న‌ను తెలియ‌జేశారు. గత మూడు రోజులుగా సాలూరు పట్టణంలో విద్యుత్ లేకపోవడంతో నిర‌స‌న తెలియ‌జేసిన సాలూరు ప్ర‌జ‌లు బుధ‌వారంనాడు ఎలక్ట్రికల్ ఏడీఇ రంగారావును నిర్బంధించారు. దీంతో సాలూరు ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. అంతేగాకుండా, రోడ్డు ఎక్కి ధర్నా చేశారు. మహిళలు, ప్రజలు కొవ్వొత్తులతో నిరసన తెలియ చేశారు. సాలూరు శ్యామలాంబ ఉత్స‌వాల‌ సందర్భంగా గత మూడు రోజులుగా పట్టణంలో ఉన్న ప్రధాని వీధులు అక్కిన వీధి, అల్లు వీధి, మజ్జుల, జన్ని వీధి, కరెంటు, గొల్లవీధి లేకపోవడంతో ప్రజలు ఆగ్రహించి, రోడ్డుపై వచ్చి ధర్నాలు, రాస్తారోకో చేశారు. స్థానిక మంత్రి ఇంటిని కూడా నిర్బంధిస్తామ‌ని హెచ్చ‌రించారు. క‌రెంటు వ‌చ్చేదాకా విద్యుత్ శాఖాధికారిని విడిచిపెట్టేది లేద‌ని మ‌హిళ‌లు ప్ర‌క‌టించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు.(Story:క‌రెంట్ క‌ట్ః విద్యుత్ ఏడీఈని నిర్బంధించిన జ‌నం)

బ‌న‌క‌చెర్ల ప‌థ‌కం ప్ర‌మాద‌క‌ర‌మే!

0

బ‌న‌క‌చెర్ల ప‌థ‌కం ప్ర‌మాద‌క‌ర‌మే!
రైతు నాయ‌కుల ఆవేద‌న‌

పోల‌వ‌రం-బ‌న‌క‌చెర్ల ప‌థ‌కాన్ని త‌క్ష‌ణ‌మే ఉప‌సంహ‌రించుకోవాలి
నదుల అనుసంధాన ఆవ‌శ్య‌క‌త స‌ద‌స్సులో రైతు సంఘాల నేత‌లు

న్యూస్‌తెలుగు/విజ‌య‌వాడ: పోలవరం – బనకచెర్ల పథకంపై చర్చించి, గోదావరి నది వరద జలాలను సద్వినియోగం చేసుకోవడానికి, బచావత్ ట్రిబ్యునల్ ద్వారా సంక్రమించిన కృష్ణా నది జలాల హక్కులను పరిరక్షించుకోవడానికి, నిత్యకరవు పీడిత రాయలసీమ ప్రాంతానికి కృష్ణా నదీ జలాల తరలింపు ద్వారా శాశ్వత పరిష్కారం చేయడానికి వీలుగా సహేతుకమైన నిర్ణయాన్ని, విజ్ఞతతో తీసుకోవడానికి రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, జలవనరులు, నీటి పారుదల ప్రాజెక్టుల సమస్యలపై అధ్యయనం, ఉద్యమాలు చేస్తున్న సామాజిక ఉద్యమకారులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సత్వరం సమావేశాన్ని నిర్వహించాలని, సీపీఐ ప్రముఖ నేత, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి అమరజీవి కామ్రేడ్ కొల్లి నాగేశ్వరరావు 5వ వర్థంతి సభలో ప్రసంగించిన వక్తలు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు.

“నదుల అనుసంధానం అవశ్యకత – ప్రతిపాదనలు – సానుకూల, ప్రతికూలాంశాలు” అన్న అంశంపై ఈ రోజు విజయవాడలో కొల్లి నాగేశ్వరరావు అధ్యయన కేంద్రం, సమన్వయకర్త టి. లక్ష్మీనారాయణ అధ్యక్షతన సభ జరిగింది. సభలో విశ్రాంత చీఫ్ ఇంజనీర్ ఇందుకూరి సత్యనారాయణ రాజు(ఐఎస్ఎన్ రాజు), విశ్రాంత ఇ.ఇ. కంభంపాటి పాపారావు, ఉమ్మడి రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మాత్యులు, మాజీ లోక్ సభ సభ్యులు, రైతు సంఘాల సమన్వయ కమిటీ కన్వీనర్ వడ్డే శోభనాధ్రీశ్వరరావు, విశ్రాంత ఐపీఎస్ అధికారి ఎ.బి. వెంకటేశ్వరరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, రైతు సేవా సంస్థ అధ్యక్షులు అక్కినేని భవానీ ప్రసాద్, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షురాలు పశ్య పద్మ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సీనియర్ నేత వై.కేశవరావు, తదితరులు ప్రసంగించారు. నవ్యాంధ్రప్రదేశ్ విశ్రాంత ఇంజనీర్స్ అసోసియేషన్ రాష్ట్ర ముఖ్యమంత్రికి వ్రాసిన ఉత్తరాన్ని అసోసియేషన్ అధ్యక్షులు తమ అభిప్రాయంగా పంపారు. విశ్రాంత ఇంజనీర్ కె.బి. గంగాధర్‌రావు వ్రాత పూర్వకంగా పంపిన అభిప్రాయాలను సభకు హాజరైన వారికి అందజేయడం జరిగింది.

బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు రెండు తెలుగు రాష్ట్రాల నీటి సమస్యపై ఒకవైపు విచారణ, ఇదే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మిగులు జలాలను కూడా పంపిణీ చేస్తూ మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పంపిణీ చేస్తూ 2013లో ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో పోలవరం – బనకచెర్ల పథకాన్ని ప్రభుత్వం ప్రతిపాదించడం ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నదని వక్తలు తీవ్రంగా విమర్శించారు. పోలవరం బనకచెర్ల పథకాన్ని ఉపసంహరించుకుని, గోదావరి – కృష్ణా – పెన్నా అనుసంధానం పథకాన్ని, పోలవరం – సోమశిల అనుసంధాన పథకంగా నిర్మించాలి. గోదావరి జలాలను పోలవరం కుడి కాలువ ద్వారా కాకుండా ప్రత్యేక వరద కాలువ ద్వారా గరిష్ట స్థాయిలో తరలించి, కృష్ణా డెల్టా, నాగార్జున సాగర్ కుడి మరియు ఎడమ కాలువల ఆయకట్టు, వెలిగొండ, సోమశిల ఆయకట్టుకు గరిష్ఠంగా వినియోగించుకోవాలి. తద్వారా ఆదా అయ్యే కృష్ణా జలాలను శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా గ్రావిటీ మీద బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ కు చేర్చి, తెలుగు గంగ, గాలేరు – నగరి ప్రాజెక్టులకు అందించాలి. శ్రీశైలం కుడి బ్రాంచి కాలువకు 19 టీఎంసీ కృష్ణా నికరజాలాల కేటాయింపు ఉన్నది. తెలుగు గంగకు 25 టీఎంసీలను బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయించింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం – 2014 ప్రకారం తెలుగు గంగ, గాలేరు – నగరి మరియు వెలిగొండ, హంద్రీ – నీవా, కల్వకుర్తి, నెట్టంపాడుకు చట్టబద్ధత వచ్చింది. వాటికి కృష్ణా జలాలను కేటాయించాల్సిన బాధ్యత విచారణ జరుపుతున్న ట్రిబ్యునల్ పై ఉన్నది. రెండు రాష్ట్రాల మధ్య నీటి సమస్యపై విచారణ జరుపుతున్న ట్రిబ్యునల్ వ్యతిరేక తీర్పు ఇస్తే, దాన్ని అవకాశంగా మలచుకొని ఎగువనున్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు కృష్ణా నికర జలాలలో ఎక్కువ వాటాను డిమాండ్ చేసే ప్రమాదం ముంచుకొస్తుంది ఆందోళన వ్యక్తం చేశారు.

పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు గరిష్ట ఎత్తు 45.72 మీటర్లపై రాష్ట్ర ముఖ్యమంత్రి విస్పష్టమైన ప్రకటన చేయాలని, పోలవరం జలాశయం గర్భం 32 – 35 మీటర్ల మధ్య నీటిని తరలించే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపాదించిన ఎత్తిపోతల పథకాన్ని తక్షణం రద్దు చేయాలని, రాష్ట్రంలో, ప్రత్యేకించి రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చి, నిధులను మంజూరు చేసి యుద్ధప్రాతిపదికపై పూర్తి చేయాలని, వినియోగంలో ఉన్న ప్రాజెక్టులకు రానున్న వర్ష కాలం దృష్ట్యా వెంటనే మరమ్మత్తులు చేయాలని వక్తలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

“నదుల అనుసంధానం అవశ్యకత – ప్రతిపాదనలు – సానుకూల, ప్రతికూలాంశాలు” అన్న అంశంపై బుధ‌వారం విజయవాడలో కొల్లి నాగేశ్వరరావు అధ్యయన కేంద్రం, సమన్వయకర్త టి.లక్ష్మీనారాయణ అధ్యక్షతన సభ జరిగింది. సభలో విశ్రాంత చీఫ్ ఇంజనీర్ ఇందుకూరి సత్యనారాయణ రాజు(ఐఎస్ఎన్ రాజు), విశ్రాంత ఇ.ఇ. కంభంపాటి పాపారావు, ఉమ్మడి రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మాత్యులు, మాజీ లోక్ సభ సభ్యులు మరియు రైతు సంఘాల సమన్వయ కమిటీ కన్వీనర్ వడ్డే శోభనాధ్రీశ్వరరావు, విశ్రాంత ఐపీఎస్ అధికారి ఎ.బి. వెంకటేశ్వరరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, రైతు సేవా సంస్థ అధ్యక్షులు అక్కినేని భవానీ ప్రసాద్, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షురాలు పశ్య పద్మ , ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సీనియర్ నేత వై. కేశవరావు, తదితరులు ప్రసంగించారు. ఐఏఎస్ విశ్రాంత అధికారి బి. శ్రీనివాస్, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు, సీపీఐ నాయకురాలు అక్కినేని వనజ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్షుడు జి. ఈశ్వరయ్య, ప్రధాన కార్యదర్శి కె.వి.వి. ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, అధ్యక్షుడు వి. కృష్ణయ్య, కాంగ్రెస్ పార్టీ నేత కొలనుకొండ శివాజీ, నీటి సంఘాల అధ్యక్షులు ఆళ్ళ వెంకటగోపాల కృష్ణ, సీపీఐ (ఎంఎల్) నాయకుడు హరినాథ్, కిషోర్, వీరబాబు, తోట ఆంజనేయులు, ప్రొ. సి. నరసింహారావు, విశ్రాంత ప్రిన్సిపాల్ ఎన్. లక్ష్మణరావు, వరదయ్య, దివికుమార్, చిగురుపాటి భాస్కర్ రావు, తదితర వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో సభలో పాల్గొన్నారు. (Story: బ‌న‌క‌చెర్ల ప‌థ‌కం ప్ర‌మాద‌క‌ర‌మే!)

Follow the Stories:

యూనియన్‌ బ్యాంకులో ఉద్యోగాల జాతర

మెగా డీఎస్సీ పోస్టులు ఇవీ..!

ఇల్లు కట్టిచూడు..రాజధాని నిర్మించి చూడు!

టాప్‌ ప్రైవేట్‌ వర్సిటీల్లో ఇంజినీరింగ్‌ సీట్లు ఉచితం!

ఏపీ ఈఏపీసెట్‌-2025 Full Details

పర్యవేక్షణ నిల్‌..ఫలహారం పుల్‌!

జగన్‌ చుట్టూ కోటరీ ఎవరు?

Friday Fear: మ‌రో వైసీపీ నేత అరెస్టుకు రంగం సిద్ధం!

రూ.520తో 10 లక్షలు, రూ. 755తో 15 లక్షలు

కొత్త రేషన్‌ కార్డులొస్తున్నాయి!

సిటీ కిల్ల‌ర్ వ‌చ్చేస్తోంది! ముంబ‌యికి ముప్పు?

స‌డెన్ డెత్: ఈ ఐఫోన్ మోడళ్లను నిలిపేసిన ఆపిల్‌!

నిరుద్యోగులకు మోదీ బంప‌ర్‌ ఆఫర్‌!

మారిన జ‌గ‌న్ వ్యూహ‌ర‌చ‌న: జగన్‌ 2.0 అంటే ఇదేనేమో!

మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?

మున్సిపల్‌ పీఠాలపై కూటమి గురి

బట్టలూడదీసి నిలబెడతా!: జగన్‌

జగన్ సెల్ఫీ కోసం ఏడ్చిన చిన్నారి! (Lovely Photos)

వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
వణికిస్తున్న కొత్త వైర‌స్‌!
శుక్రవారం గండం! వైఎస్ఆర్సీపీలో అలజడి

దుర్గ‌గుడి ల‌డ్డూ ప్ర‌సాదంలో వెంట్రుక‌లు!

ఘనంగా ప్రారంభమైన అంతర్జాతీయ యోగా మాసోత్సవ కార్యక్రమం

0

ఘనంగా ప్రారంభమైన అంతర్జాతీయ యోగా మాసోత్సవ కార్యక్రమం

న్యూస్ తెలుగు / వినుకొండ : కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వినుకొండ పురపాలక సంఘం నందు అంతర్జాతీయ యోగా మాసోత్సవ కార్యక్రమం మే 21 నుండి జూన్ 21 వరకు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా లయోలా హై స్కూల్ మరియు ఎన్ ఎస్ పి సాయిబాబా గుడి ప్రాంగణం నందు మొదటిరోజు జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ. యోగా యొక్క ప్రయోజనాలు అపారమైనవి మరియు విస్తృతమైనవి. క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల శారీరక బలం మరియు సమతుల్యత మెరుగుపడతాయని ఆయన అన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ షకీలా దస్తగిరి మాట్లాడుతూ. యోగా వల్ల ఆరోగ్యం, మరియు శ్రేయస్సు, మానసిక స్పష్టత మెరుగుపడతాయని ఒత్తిడిని తగ్గించి జీవిత సవాళ్లు సులభంగా ఎదుర్కోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్, కౌన్సిలర్లు పాపసాని బ్రహ్మయ్య , పివి సురేష్ , రెడ్డి నగేష్ , యోగా గురువులు, మున్సిపల్ సిబ్బంది మరియు యోగా సాధకులు పాల్గొన్నారు. (Story:ఘనంగా ప్రారంభమైన అంతర్జాతీయ యోగా మాసోత్సవ కార్యక్రమం)

రెండొవ రోజు ఆకట్టుకున్న నాటిక ప్రదర్శనలు

0

రెండొవ రోజు ఆకట్టుకున్న నాటిక ప్రదర్శనలు

న్యూస్ తెలుగు /వినుకొండ : నందమూరి తారక రామారావు కళాపరిషత్ నాటకోత్సవాలు రెండవ రోజు మంగళవారం రాత్రి సందడిగా నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన గోనుగుంట్ల సత్యనారాయణ, మక్కెన చినరామయ్య కళాపరాంగణంలో జనసేన వీర మహిళలు జ్యోతి వెలిగించగా, జనసేన పార్టీ నియోజకవర్గ బాధ్యుడు కొంజేటి నాగ శ్రీను, జిల్లా కార్యదర్శి ఎన్. శ్రీనివాసరావు నటరాజ పూజ చేసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అనంతరం కళాకారులు నాటికలు ప్రదర్శించారు. పొట్ల రాధాకృష్ణమూర్తి, పారా లక్ష్మయ్య, మాదినేని ఆంజనేయులు నాటక ప్రదర్శనలను నగదు ప్రోత్సాహం అందజేశారు. కళాపరిషత్తు అధ్యక్షులు న్యాయవాది రామకోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ముత్తినేనిగిరి బాబు, కార్యక్రమ నిర్వాహకుడు మాజీ ఎంపీపీ బొల్లా వెంకట కోటయ్య వారికి సహకరించారు. సామాజిక మాధ్యమాలకు బానిస కావద్దు వాట్సాప్, ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాలను అవసరం మేరకే వినియోగిస్తే నష్టం లేదు అలా కాకుండా 24 గంటలు వాటిలో మునిగి సంసారాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎదురయ్యే పరిణామాలను కంటికి కంటినట్లు యువభేరి థియేటర్స్ హైదరాబాదు వారి “నా శత్రువు” నాటిక చక్కటి సందేశాన్ని ఇచ్చింది అక్కల తామేశ్వరయ్య రచించగా వద్దాది సత్యనారాయణ దర్శకత్వం వహించారు. మరో నాటిక “మా ఇంట్లో మహాభారతం” లో పాతిక ఎకరాల పొలం ఉండి వ్యవసాయం చేస్తున్న యువకులకు పెళ్లిళ్లు కావడం కష్టంగా ఉందని పదివేల జీతంతో పట్నంలో ఉద్యోగం చేస్తున్న వారిని వివాహం చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు అన్నది ఈ నాటిక వితివృత్తం, ఇలాగే కొనసాగితే పొలం పండించేవారు ఉండరని చివరికి బస్తా డబ్బులు ఇచ్చిన గింజలు కొనలేని పరిస్థితి దాపురిస్తుందన్న సందేశాన్ని ఇచ్చింది మద్దుకూరి ఆర్ట్స్ చిలకలూరిపేట కళాకారులు ప్రదర్శించిన హాస్య భరితమైన ఈ నాటికను మద్దుకూరి రవీంద్ర రచించగా నడింపల్లి వెంకటేశ్వర్లు దర్శకత్వం వహించారు. హైదరాబాద్ సిరిమువ్వ కల్చరర్ వారు “హక్కు” నాటికను కళాకారులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ప్రభుత్వ చిఫ్ విప్ జీవీ ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు పాల్గొని నాటక కళాకారులకు పారితోషకం అందజేశారు. కార్యనిర్వకులు ముత్తినేని గిరిబాబు, బొల్ల వెంకట కోటయ్య, లాయర్ రామకోటేశ్వరరావు, లగడపాటి వెంకట్రావు, మంద మరియబాబు, గాలి రేవతి శ్రీనివాసరావు, పెనుగొండ శ్రీనివాసరావు, లాయర్ సైదారావు, వార్డు కౌన్సిలర్ దస్తగిరి షకీలా, పీవీ సురేష్ బాబు, 32 వ వార్డు కౌన్సిలర్ వాసిరెడ్డి లింగమూర్తి, తదితరులు పాల్గొన్నారు. (Story:రెండొవ రోజు ఆకట్టుకున్న నాటిక ప్రదర్శనలు)

దోచుకుంటున్న మిల్లర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలి: సిపిఐ

0

దోచుకుంటున్న మిల్లర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలి: సిపిఐ

న్యూస్‌తెలుగు/ వ‌న‌ప‌ర్తి :తాలుతరుగు పేరుతో ప్రతి క్వింటలకు మూడు నుంచి ఐదు కిలోలు దోచుకుంటున్న మిల్లర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలని సిపిఐ పట్టణ కార్యదర్శి రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యుడు గోపాలకృష్ణ డిమాండ్ చేశారు. వర్షాలు పడిన నేపథ్యంలో వనపర్తి మార్కెట్ యార్డును సిపిఐ నేతలు సందర్శించి చిట్యాలకు చెందిన రాము మరికొందరు రైతులతో మాట్లాడారు. మార్కెట్ యార్డులోప్రతి బస్తాకు 40 కిలోలు తూకం వేయాల్సి ఉండగా 41 కిలోలు తూకం వేసి రైతులకు నష్టం చేస్తున్నారన్నారు. వీటిని లారీలలో మిల్లులకు పంపితే అక్కడ ప్రతి క్వింటాలుకు మూడు నుంచి ఐదు కిలోలు షార్టేజ్ పేరుతో మిల్లర్లు దోచుకుంటున్నారన్నారు. శ్రీరంగాపురానికి చెందిన కొందరు మిల్లర్లు బరితెగించి ఐదు కిలోల తరుగుకు ఒప్పుకుంటేనే లారీల నుంచి ధాన్యం దించుకుంటామని, లేదంటే తీసుకెళ్లిపొమ్మని చెప్పేస్తున్నారన్నారు. చిట్యాల కు చెందిన కొందరు రైతులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోలేదు అన్నారు. దోచుకుంటున్న మిల్లర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. ధాన్యం నిలువ చేసేందుకు మిల్లర్లపై ఆధారపడకుండా ప్రత్యేక గోదాముల వసతి అధికారులు కల్పించాలన్నారు. (Story:దోచుకుంటున్న మిల్లర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలి: సిపిఐ)

టాలెంట్ ఉన్న వారి కోసం సిద్ధమైన “దిల్ రాజు డ్రీమ్స్”

0

టాలెంట్ ఉన్న వారి కోసం సిద్ధమైన “దిల్ రాజు డ్రీమ్స్”

న్యూస్‌తెలుగు/ హైద‌రాబాద్ సినిమా: దిల్ రాజు అనే పేరుకు తెలుగు సినీ పరిశ్రమలోనే కాక, యావత్ భారతీయ సినీ పరిశ్రమలో కూడా పరిచయం అవసరం లేదు. తన మొదటి సినిమా పేరును ఇంటిపేరుగా మార్చుకున్న దిల్ రాజు టాలెంట్ కు కేరాఫ్ అడ్రస్. టాలెంట్ ఎక్కడ ఉన్నా ఆదరించే వ్యక్తిగా ఎంతోమంది హీరోలను, నటీనటులను, దర్శకులను, టెక్నీషియన్లను తెలుగు సినీ పరిశ్రమకు అందించారు. ఇప్పుడు ఆయన మరో ముందడుగు వేసి, తెలుగు సినీ పరిశ్రమకు మరింత టాలెంట్ ను పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నారు.
కొత్త టాలెంట్ ను తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేసేందుకు దిల్ రాజు తాజాగా “దిల్ రాజు డ్రీమ్స్” అనే ప్లాట్‌ఫామ్‌ను సిద్ధం చేశారు. తన కెరీర్ ప్రారంభం నుంచి ఫ్రెష్ కంటెంట్‌ను, టాలెంట్ ను ప్రోత్సహించే దిల్ రాజు ఇప్పుడు “దిల్ రాజు డ్రీమ్స్” ప్లాట్‌ఫామ్ ద్వారా యంగ్ టాలెంట్ ను పరిచయం చేసేందుకు సిద్ధమవుతున్నారు.
జూన్ నెల నుంచి ఆయన సిద్ధం చేసిన ఆన్ లైన్ ప్లాట్‌ఫామ్ యాక్టివ్ కానుంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో భాగం కావాలనుకునే వారు https://dilrajudreams.com/ లింక్‌పై క్లిక్ చేసి తమ వివరాలను నమోదు చేస్తే, దిల్ రాజు డ్రీమ్స్ బృందం స్వయంగా వారిని సంప్రదిస్తుంది. జూన్‌లో ఈ పోర్టల్ సిద్ధమైన తర్వాత, “దిల్ రాజు డ్రీమ్స్” ద్వారా యువ ప్రతిభావంతులు తమ ఆలోచనలను ఈ బృందం దృష్టికి తీసుకెళ్లవచ్చు.
తమ టాలెంట్ నిరూపించుకోవాలనుకునేవారు ఎంతోమంది సరైన ప్లాట్ఫామ్ లేక ఇబ్బంది పడుతున్నారు. టాలెంట్ ఉన్నా సినీ పరిశ్రమలో కాంటాక్ట్స్ లేక, ఎవరిని ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియక ముందుకు వెళ్లలేకపోతున్నారు. అలాంటి వారందరికీ ఇది ఒక గోల్డెన్ ఛాన్స్. టాలెంట్ ఉన్నవారు దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి దిల్ రాజు స్థాపించిందే ఈ దిల్ రాజు డ్రీమ్స్..
మరి ఇంకెందుకు ఆలస్యం? టాలెంట్ ఉండి, సినిమాలు చేయాలనే ఆలోచన ఉన్నవారు, సినీ పరిశ్రమలో అడుగు పెట్టాలనుకునేవారు, సినీ పరిశ్రమంలో భాగము కావాలనుకునేవారు దిల్ రాజు డ్రీమ్స్ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకుని తమ కలను సాకారం చేసుకోవచ్చు. (Story:టాలెంట్ ఉన్న వారి కోసం సిద్ధమైన “దిల్ రాజు డ్రీమ్స్”)

మే 22 “వీరరాజు 1991”  

0

మే 22 “వీరరాజు 1991”  

న్యూస్‌తెలుగు/ హైద‌రాబాద్ సినిమా : రాయల్ స్టార్ ప్రొడక్షన్స్ సమర్పణలో కిరణ్ చెరుకూరి నిర్మాతగా, రుద్ర వీరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వీరరాజు 1991. రా అండ్ రస్టిక్ గా తెరకెక్కిన ఈ చిత్రం మే 22 న గ్రాండ్ రిలీజ్ కాబోతున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది.
సహనిర్మాత శివాన్వితరావు మాట్లాడుతూ.. చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రం వాళ్ల అమ్మగారు అయిన నిర్మాత కిరణ్ చెరుకూరి కి ఎంతో స్పెషల్ అని చెప్పారు. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం చాలా సంతోషంగా ఉందన్నారు.
రాంబాబు గోసాల మాట్లాడుతూ.. వీరరాజ్ సినిమాలో రెండు పాటలు రాశాను. గగన్ అందించిన మ్యూజిక్ చాలా బాగుంది. వీరరాజ్ చాలా కష్టపడ్డారు. నిర్మాత చాలా బాగా చూసుకున్నారు అని చెప్పారు. అజయ్ గోష్, బెనర్జీ గారి నటన చాలా బాగుందన్నారు. సినిమా పెద్ద హిట్ అవుతుందన్నారు.
అజయ్ గోష్ మాట్లాడుతూ.. పరిశ్రమకు కొత్తవాళ్లు రావాలని, విజయం సాధించి పదిమందికి ఉపాది కల్పించాలన్నారు. చిన్న సినిమాలను ఆదరించాలని, ఇలాంటి సినిమాలు ఆడితే భవిష్యత్తులో మంచి ఆర్టిస్ట్ లు, టెక్నిషన్స్ పరిచయం అవుతారు. ముఖ్యంగా నిర్మాత కిరణ్ గారు ఎంతో శ్రద్ధతో, ప్రేమతో టీం చూసుకున్నారు. అలాగే బెనర్జీ గారితో పని చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇక కథ విషయానికి వస్తే మత్స్యకారులు జీవితంలో జరిగే మంచి కథను చూపించారు. మత్స్యకారులు జీవితాలను చాలా అద్భుతంగా చూపించారు. ముఖ్యంగా హీరోగా, దర్శకత్వం రెండు పనులను చాలా సమర్థవంతంగా నిర్వహించిన వీరరాజ్ శ్రమను ప్రేక్షకులు ఆదరిస్తారు అని నమ్మకం వ్యక్తం చేశారు. నిర్మాతగా కిరణ్ చెరుకూరి గారు మంచి అభిరుచి ఉన్న వ్యక్తి అన్నారు.
బెనర్జీ మాట్లాడుతూ.. అజయ్ గోష్ తో చాలా తక్కువ సినిమాలే చేశాము కానీ మంచి పరిచయం ఉందన్నారు. అలాగే గొప్ప యాక్టర్ అన్నారు. ప్రొడ్యూసర్ కిరణ్మయ్ గారు లేడి ప్రొడ్యూసర్ గా మంచి భవిష్యత్తు ఉండాలన్నారు. ఆమె మంచితనమే సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తున్నారు. ఫస్ట్ టైం సినిమా తీసినట్లు కాకుండా చాలా బాధ్యతగా, చాలా ప్రేమగా చూసుకున్నారు అని చెప్పారు. నిర్మాత, సహా నిర్మాత ఇద్దరు తల్లీ కూతుర్లకు మంచి పేరు వస్తుందన్నారు. ఇక మరో హార్డ్ వర్కర్ హీరో, డైరెక్టర్ గా పని చేసిన వీరరాజ్ చాలా కష్టపడ్డారు అన్నారు. సినిమా తీయడం కాదు సినిమా రిలీజ్ చేయడం పెద్ద సాహసం అన్నారు. వీరరాజ్ 1991 సినిమాలో పనిచేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్ చెప్పారు.
నిర్మాత కిరణ్మయ్ చెరుకూరి మాట్లాడుతూ.. సినిమా అందరికి నచ్చుతుందని, సినిమాను ఆదరించాలని కోరారు.
హీరో రుద్రవీరాజ్ మాట్లాడుతూ.. సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్ చెప్పారు. ఈ సినిమాను సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేయడానికి ముఖ్య కారణం హరిచరణ్ అన్నారు. చాలా సపోర్ట్ గా నిలబడి పని చేశారు అన్నారు. కృష్ణ కాంత్ ఒక పాట రాశారు, రాంబాబు గోసాల రెండు పాటలు రాశారు. ప్రతీ టెక్నిషన్స్ కు థాంక్స్ చెప్పారు. ముఖ్యంగా నిర్మాత కిరణ్మయ్ చెరుకూరి గారికి ధన్యవాదాలు చెప్పారు. వారు లేకపోతే ఈ సినిమా లేదన్నారు. బెనర్జీ గారి సపోర్ట్ చాలా ఉందన్నారు. అలాగే అజయ్ గోష్ చాలా స్పెషల్ అన్నారు. ఆయనతో కథ చెప్పిన నాటి నుంచి నేటి వరకు చాలా సపోర్ట్ చేశారు అన్నారు. ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చాలామంది ప్రోత్సాహం ఉంది అందులో నెల్లూరు అవుట్ డోర్ షూటింగ్లో పోలీస్ పర్మిషన్లు తీసుకున్న నిర్మాత కిరణ్మయి గారి ఫ్రెండ్ గిరి బొల్లినేని గారికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే రాక్ లయన్ వెంకటేష్, సునీల్ నరెన్, మ్యాంగో మ్యూజిక్ థాంక్స్ చెప్పారు. ఇక వైజాగ్లో తన యాక్టింగ్ నేర్చుకున్న సత్య ఇన్స్టిట్యూట్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మే 22 వీరరాజ్ 1991 సినిమా విడుదల అవుతుందని అందరూ కచ్చితంగా సపోర్ట్ చేయాలన్నారు. ముఖ్యంగా మీడియా సపోర్ట్ ఉండాలని కోరారు.
నటీనటులు: రుద్రవీరాజ్, అజయ్ ఘోష్, బెనర్జీ, అర్చన, రాహుల్, గోపారాజ్, కిషోర్ తదితరులు
బ్యానర్: రాయల్ స్టార్ ప్రొడక్షన్స్
నిర్మాత: కిరణ్ చెరుకూరి
స్టోరీ-స్క్రీన్ ప్లే-డైరెక్షన్: రుద్రవీరాజ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: శివాన్వితరావు, సౌమ్య నటరాజ్
డిఓపి: హరిచరణ్ కె
ఎడిటర్: కెఎం ప్రకాష్
మ్యూజిక్ డైరెక్టర్: గగన్ బడేరియా
ఆర్ట్ డైరెక్టర్: అమర్
పిఆర్ఓ: హరీష్, దినేష్ (Story:మే 22 “వీరరాజు 1991”  )

‘కన్నప్ప’ నుంచి స్పెషల్ గ్లింప్స్

0

‘కన్నప్ప’ నుంచి స్పెషల్ గ్లింప్స్

న్యూస్‌తెలుగు/ హైద‌రాబాద్ సినిమా:
మలయాళంలో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లను అందుకుంటున్నారు సూపర్ స్టార్ మోహన్ లాల్. ఆయన నటిస్తున్న చిత్రాలన్నీ కూడా వరుసగా 200 కోట్ల వసూళ్లతో అదరగొడుతున్నాయి. ఆయన త్వరలోనే డైనమిక్ స్టార్ విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్, పాన్-ఇండియన్ క్రేజీ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’తో ఆడియెన్స్ ముందుకు రానున్నారు. మోహన్ లాల్ పుట్టిన రోజు (మే 21) సందర్భంగా కన్నప్ప నుంచి గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ చిత్రం నుంచి అందరినీ ఆకట్టుకునే అప్డేట్‌ను వదిలారు.
కన్నప్ప మేకర్లు మోహన్ లాల్ బర్త్ డే సందర్భంగా ఒక అద్భుతమైన గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో మోహన్ లాల్ స్క్రీన్ ప్రెజెన్స్, కనిపించిన తీరు అన్నీ అద్భుతంగా ఉన్నాయి. మోహన్ లాల్ ఈ చిత్రంతో మళ్లీ ఆడియెన్స్‌పై తన ముద్రను వేసేలా కనిపిస్తున్నారు. గూస్ బంప్స్ తెప్పించేలా ఈ గ్లింప్స్‌ను కట్ చేశారు. మోహన్‌లాల్ ఫ్యాన్స్‌ను మెప్పించేలా గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు.
దైవిక శక్తితో ముడిపడి ఉన్న కిరాత అనే పాత్రను మోహన్‌లాల్ పోషించారు. కిరాత పాత్రలో మోహన్‌లాల్ ప్రెజెన్స్, యాక్టింగ్ అందరినీ ఆకట్టుకుంటుందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం విష్ణు మంచు, కన్నప్ప టీం ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే యూఎస్ టూర్‌ను పూర్తి చేశారు. కన్నప్ప నుంచి వస్తున్న ప్రతి అప్డేట్‌ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. క్యారెక్టర్ పోస్టర్‌లు, టీజర్, పాటలు ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. (Story:‘కన్నప్ప’ నుంచి స్పెషల్ గ్లింప్స్)

జూన్ 6 నుంచి  జియో హాట్‌స్టార్‌లో వెబ్ సిరీస్ ‘దేవిక & డానీ’ ట్రైలర్ విడుదల

0

జూన్ 6 నుంచి  జియో హాట్‌స్టార్‌లో వెబ్ సిరీస్ ‘దేవిక & డానీ’ ట్రైలర్ విడుదల

న్యూస్‌తెలుగు/ హైద‌రాబాద్ సినిమా:
జియోహాట్‌స్టార్, డిస్నీ+ హాట్‌స్టార్  నుంచి జియో హాట్ స్టార్‌గా పున: నిర్మితమై ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు తిరుగులేని, బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోన్న సంగతి తెలిసిందే.తాజాగా  హాట్‌స్టార్ స్పెషల్స్‌లో భాగంగా, ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘దేవిక & డానీ’ అనే అందమైన కథను ప్రేక్షకులకు అందిస్తోంది. ఈ వెబ్‌సిరీస్‌లో రీతూ వర్మ, సూర్య వశిష్ట, శివ కందుకూరి, సుబ్బరాజు ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, కోవై సరళ, సోనియా సింగ్, గోకరాజు రమణ, శివన్నారాయణ, వివా హర్ష, షణ్ముఖ్, అభినయ శ్రీ, మౌనికా రెడ్డి, ఈశ్వర్య వుల్లింగల తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

‘దేవిక & డానీ’ వెబ్‌సిరీస్ లుక్ పోస్టర్‌లతో అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది.  ఈ ఆసక్తిని మరింత పెంచుతూ మేకర్స్ ఈ రోజు ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌ను గమనిస్తే సిరీస్‌లో టైటిల్ పాత్రధారి దేవికగా రీతూ వర్మ నటించారు. అప్పటికే ఆమెకు సుబ్బరాజుతో నిశ్చితార్థం జరిగి ఉంటుంది. వారి పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతుంటాయి. ఆ సమయంలో ఓ పూజారి రీతూవర్మ జీవితంలో ఆమె వివాహానికి మూడు నెలల ముందు ఓ కొత్త వ్యక్తి ప్రవేశిస్తాడు. అతని రాకతో ఆమె జీవితంలో మార్పులు చోటు చేసుకుంటాయంటూ హెచ్చరిక చేస్తాడు.

పూజారి చెప్పినట్లే డానీ దేవిక జీవితంలోకి ప్రవేశిస్తాడు. డానీ పాత్రను సూర్య వశిష్ట పోషించారు. తనది అంతీద్రియ పాత్ర. డానీ రాకతో దేవిక జీవితం మలుపు తిరుగుతుంది. ఆమె ఊహించినట్లు సంఘటనలు సాగవు. కొన్ని అనుహ్య సంఘటనలు జరుగుతాయి. దీంతో డానీ వైపు దేవిక ఆకర్షితురాలవుతుందని ట్రైలర్‌తో తెలుస్తుంది. ఇదొక రొమాంటిక్, ఎంటాంగిల్‌మెంట్, సస్పెన్స్, అనుకోని మలుపులతో సాగే కథాంశంతో దేవిక అండ్ డానీ తెరకెక్కింది. ట్రైలర్ ఎంటర్‌టైనింగ్‌గా ఆకట్టుకుంటోంది.

ట్రైలర్ చూస్తుంటే చాలా ప్రశ్నలు మనసులో రేకెత్తుతాయి..సిరీస్‌ చూడాలనే ఆసక్తి పెరుగుతుంది. ఈ ప్రశ్నలకు జూన్6న సమాధానం దొరుకుతుంది. శ్రీకారం ఫేమ్ బి.కిశోర్ దర్శకత్వంలో రూపొందిన దేవిక అండ్ డానీ జూన్6 నుంచి జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. కామెడీ, హారర్, ఫాంటసీ అంశాలతో సమకాలీన కథనం మేళవిపుంగా తెరకెక్కిన ఈ సిరీస్‌కు సంగీతం జయ్ కృష్ అందించారు.

JioHotstar’s Devika & Danny starring Ritu Varma trailer unveiled; Streaming from June 6th

JioHotstar, a revamped version of Disney+ Hotstar, brings the best entertainment for Telugu audiences from time to time. As part of hotstar specials, the OTT platform is now bringing a beautiful story of Devika & Danny. It stars Ritu Varma, Surya Vasistta, Siva Kandukuri, Subbaraju in lead roles along with ensemble of actors Kovai Sarala, Soniya Singh, Gokaraju Ramana, Sivannarayana, Viva Harsha, Shanmukh, Abhinaya Sri, Mounika Reddy, Ishwarya Vullingala and others in key roles.

This webseries raised curiosity with the look posters and now today makers dropped the trailer. The trailer begins with the build-up to a wedding between Devika played by Ritu Varma and her fiancé played by Subbaraju. Just before the ceremony, a priest issues a cryptic warning that someone new might enter her life 3 months before the marriage that will change everything.

The arrival of Danny played by Surya Vashistta, a supernatural character, marks the turning point, drawing Devika into an unpredictable series of events. Devika finds herself drawn to him. However, things don’t go as smoothly as she imagined. The trailer hints at a blend of romantic entanglement, suspense, and hidden dangers, building intrigue around the central mystery. With action, emoion and intriguing drama, the trailer promises a entertaining experience.

The trailer leaves you with lot questions and raising expectations and everything will be answered on June 6th. Devika & Danny, directed by B. Kishore of Sreekaram fame, is set to stream on Jio Hotstar from June 6. It is produced by Sudhakar Chaganti under the Joy Films banner and created by writer Deepak Raj. Devika & Danny is touted to blend elements of comedy, horror, and fantasy in a contemporary narrative. Music is composed by Jay Krish. (Story:v)

error: Content is protected !!