Home Blog

జగన్‌ చుట్టూ కోటరీ ఎవరు?

0

జగన్‌ చుట్టూ కోటరీ ఎవరు?

విజయసాయిరెడ్డి వ్యాఖ్యల దుమారం
అప్రూవుల్‌గా మారితే డేంజరే
మద్యం కుంభకోణంలో కసిరెడ్డే!
వైఎస్‌ఆర్‌సీపీలో కాకరేపుతున్న కేసులు
పార్టీ ఆవిర్భావం రోజున చిచ్చురేపిన సాయిరెడ్డి

న్యూస్‌ తెలుగు/అమరావతి: వైసీపీలో నంబర్‌2గా చెలాయించిన నేత, మాజీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో దుమారం రేపుతున్నాయి. వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చుట్టూ పెద్ద కోటరీ ఉందని, దాని వల్లే జగన్‌కు నష్టం వాటిల్లిందని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా ఆ కోటరీ వల్ల జగన్‌కు, తనకు మధ్య గ్యాప్‌ పెంచారని, ఒక నాయకుడు చెప్పుడు మాటలు వినకూడదని, మంచి, చెడు అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. కాకినాడ సీ పోర్టు అక్రమాలపై ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయసాయిరెడ్డి విజయవాడ సీఐడీ కోర్టుకు హాజరయ్యారు. ఆ కేసు విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్‌పైన, ఆయన చుట్టూ ఉన్న కోటరీపైన, వైఎస్‌ఆర్‌సీపీపైన సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఆ పార్టీలో ఆందోళన మొదలైంది. మళ్లీ వైసీపీతో దోస్తీ చేసేది లేదు..నా మనస్సు విరిగింది..అది అతుక్కోదు..కోటరీనే జగన్‌ కొంప ముంచింది.. వాళ్ల మాట వినడం జగన్‌ తప్పే అంటూ చెప్పారు. తాను వైఎస్‌ఆర్‌సీపీలోకి తిరిగి రాబోనని తెగేసి చెప్పారు. అంతటితో ఆగకుండా ఏ పార్టీలోనూ చేరబోనని పునరుద్ఘాటించారు. దీని ఆధారంగా విజయసాయిరెడ్డి అప్రూవుల్‌గా మారతారా? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. అదే జరిగితే జగన్‌కు, ఆ పార్టీకి రాబోయే రోజుల్లో మరింత గడ్డు పరిస్థితులు ఎదురుకానున్నాయి. సరిగ్గా వైఎస్‌ఆర్‌సీపీ ఆవిర్భావం దినోత్సవంనాడు, ఒక వైపు యువత పోరు చేపడుతున్న సమయంలో సీఐడీ విచారణకు పిలవడం, విజయసాయిరెడ్డి రావడం చకచకా జరిగిపోయాయి. విచారణకు వచ్చిన సాయిరెడ్డి తన పని తాను చూసుకుని వెళ్లకుండా..మీడియా ముందుకు వచ్చి ఇలా మాట్లాడ‌టం వెనుక…వైఎస్‌ఆర్‌సీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిని కూటమి పార్టీ వాళ్లే కావాలని విజయసాయిరెడ్డితో మాట్లాడించారంటూ మండిపడుతున్నారు.

విజయసాయిరెడ్డి వ్యాఖ్యలతో వైఎస్‌ఆర్‌సీపీకి టెన్షన్‌

కాకినాడ సీపోర్ట్‌ విషయంలో విజ‌య‌సాయిరెడ్డి వైసీపీని పూర్తిగా ఇరకాటంలో పడేసేలా స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. కాకినాడ పోర్టు ఇష్యూలో కర్త, కర్మ, క్రియ విక్రాంత్‌ రెడ్డేనని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. అటుపై ఆ పోర్టు అధిఏత కేవీరావుకు, జగన్‌ బాబాయ్‌ వైవీ సుబ్బారెడ్డికి దగ్గర సంబంధాలు ఉన్నాయని చెప్పి వైఎస్‌ఆర్‌సీపీకి దడ పుట్టించారు. విక్రాంత్‌రెడ్డి పోర్ట్‌ వాటాల డీల్‌కు సెట్‌ చేశారని ఆరోపించారు. ఫోన్‌ కాల్‌ రికార్డ్స్‌ తీస్తే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయంటూ వ్యాఖ్యానించారు. మీడియా ముందే విజయసాయిరెడ్డి ఈ రకంగా వ్యాఖ్యానిస్తే..ఇక సీఐడీ వారికి ఇంకేం సమాచారం చెప్పారనేదీ వైఎస్‌ఆర్‌సీపీ వారికి అంతుచిక్కడంలేదు. ప్రశాంతంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో ఇలా..వైఎస్‌ఆర్‌సీపీపై ఘాటు వ్యాఖ్యలు చేయడం, అదీ కేసుల గురించి వ్యాఖ్యానించడం రాజకీయంగా చర్చానీయాంశమైంది. ఇవి కూటమి పార్టీలకు మరింత అవకాశంగా మారింది. మొత్తంగా కాకినాడ సీ పోర్టు కేసులో విజయసాయిరెడ్డి అప్రూవల్‌గా మారితే, ఆయనపై ఉన్న ఏ2 కేసు తొలగిపోతుంది. ఇక..పూర్తిగా ఎలాంటి టెన్షన్‌ లేకుండా ఆయన ప్రశాంతంగా ఉండవచ్చు. జగన్‌ చుట్టూ ఉన్న కోటరీని.. ఆయన ద్వితీయ శ్రేణి నాయకులు అంటూ..సజ్జల గురించే పరోక్షంగా చెప్పినట్లయింది.

మద్యం కుంభకోణంలోనూ ఘాటు వ్యాఖ్యలు

గత జగన్‌ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం ఆరోపణలపైనా విజయసాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. చేసిందంతా అప్పటి బేవరేజెసెస్‌ మేనేజింగ్‌డైరెక్టర్‌ కసిరెడ్డి కనుసన్నల్లోనే అవినీతి దందా జరిగిందని వ్యాఖ్యానించారు. దీంతో ఆ విషయాన్ని సీఐడీ అధికారులకు విజయసాయిరెడ్డి చెప్పారా?, లేదా? అనేదీ వైఎస్‌ఆర్‌సీపీ కలవరం చెందుతోంది. పనిలో పనిగా సీఐడీ అధికారులు ఆ విషయాలను తనతో చెప్పించారంటూ వ్యాఖ్యానించారు. ఇలా కాకినాడ సీ పోర్టు అవినీతి గురించి, మద్యం కుంభ‌కోణం గురించి విజయసాయిరెడ్డి మీడియా ఎదుట వ్యాఖ్యలు చేయడంతో వైఎస్‌ఆర్‌సీపీ నేతల వెన్నులో వణుకు పుడుతోంది. చుట్టూ ఉన్న కోటరీ వల్లే తనను జగన్‌కు దూరం చేశారంటూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు ప్రారంభించి..ఆ తర్వాత జగన్‌తోపాటు గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంపై అవినీతి విమర్శలు చేయడం వెనుక ఆయన వ్యూహం ఏమిటనేదీ ఎవరికీ అంతుచిక్కడంలేదు. విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలతో జగన్‌ పూర్తిగా ఇరుక్కుపోయే ప్రమాదముంది. ఇప్పటికే సీబీఐ కేసుల్లో జగన్‌, విజయసాయిరెడ్డి 16 నెలలుపాటు జైలుకు వెళ్లి వచ్చారు. మళ్లీ కాకినాడ సీ పోర్టు, మద్యం కుంభకోణం లాంటి కేసులను కూటమి ప్రభుత్వ హయాంలో ఎదుర్కొవాల్సి వస్తోంది. అందులో ప్రధానంగా కాకినాడ సీ పోర్టులో విజయసాయిరెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న తరుణంలో దాన్ని నుంచి తప్పించుకునేందుకుగాను విజయసాయిరెడ్డి అప్రూవుల్‌గా మారతారా?, లేక ఆయన చెప్పినట్లుగా ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటారా? అనేదీ చూడాల్సి ఉంది. (Story: జగన్‌ చుట్టూ కోటరీ ఎవరు?)

Follow the Stories:

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ప‌రీక్ష‌!

Friday Fear: మ‌రో వైసీపీ నేత అరెస్టుకు రంగం సిద్ధం!

రూ.520తో 10 లక్షలు, రూ. 755తో 15 లక్షలు

కొత్త రేషన్‌ కార్డులొస్తున్నాయి!

సిటీ కిల్ల‌ర్ వ‌చ్చేస్తోంది! ముంబ‌యికి ముప్పు?

స‌డెన్ డెత్: ఈ ఐఫోన్ మోడళ్లను నిలిపేసిన ఆపిల్‌!

నిరుద్యోగులకు మోదీ బంప‌ర్‌ ఆఫర్‌!

మారిన జ‌గ‌న్ వ్యూహ‌ర‌చ‌న: జగన్‌ 2.0 అంటే ఇదేనేమో!

మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?

మున్సిపల్‌ పీఠాలపై కూటమి గురి

బట్టలూడదీసి నిలబెడతా!: జగన్‌

జగన్ సెల్ఫీ కోసం ఏడ్చిన చిన్నారి! (Lovely Photos)

వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
వణికిస్తున్న కొత్త వైర‌స్‌!
శుక్రవారం గండం! వైఎస్ఆర్సీపీలో అలజడి

దుర్గ‌గుడి ల‌డ్డూ ప్ర‌సాదంలో వెంట్రుక‌లు!

జైల్లో నా భర్తను.. టార్చర్‌ చేస్తున్నారు..!

లైసెన్సుల్లో గోల్‌మాల్‌!

రోజాకు జగన్‌ చెక్‌?

రిజిస్ట్రేషన్‌ శాఖలో డిజిట‌ల్ విప్ల‌వం: లాభ‌మా? న‌ష్ట‌మా?

వైసీపీకి ఇంటా, బయటా పోరు

హెల్మెట్ కొత్త రూల్స్‌!

వామ్మో…ఇంట‌ర్‌లో ఇన్ని మార్పులా?

0

వామ్మో…ఇంట‌ర్‌లో ఇన్ని మార్పులా?

ఇంటర్మీడియట్ విద్యలో కీలక సంస్కరణలకు శ్రీకారం!
ఇంటర్మీయట్ మ్యాథ్య్ ఎ-బి ఒకే సబ్జెక్ట్, బాటనీ-జువాలజీ ఒకే సబ్జెక్టు!
ఫిబ్రవరి చివరి వారం నుంచే ఇంటర్మీడియట్ పరీక్షలు
జూనియర్ కాలేజిల్లో ఎం.బైపిసి కోర్సుకు అనుమతి
మంత్రి లోకేష్ అధ్యక్షతన ఇంటర్మీడియట్ బోర్డు సమావేశం

ఇక‌పై ఆ స‌బ్జెక్టులే ఉండ‌వు! ఫిబ్ర‌వ‌రిలోనే ప‌రీక్ష‌లు!

న్యూస్‌తెలుగు/అమరావతి: విస్తృత ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం ఇంటర్మీడియట్ బోర్డులో సంస్కరణలకు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పచ్చజెండా ఊపారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ 77వ సమావేశం అమరావతి అసెంబ్లీలోని పేషిలో మంత్రి లోకేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఇంటర్మీడియట్ లో విద్యలో నాణ్యత ప్రమాణాలను పెంపొందించి విద్యార్థులను ప్రభుత్వ జూనియర్ కాలేజిలవైపు ఆకర్షించేలా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రైవేటు కళాశాలలకు దీటుగా ప్రభుత్వ జూనియర్ కాలేజిల విద్యార్థులను తయారుచేసేందుకు 2025-26 విద్యాసంవత్సరం నుంచి క్యాలెండర్ లో మార్పులు చేపట్టారు. ఈ విద్యా సంవత్సరం నుంచి జూన్ 1వతేదీకి బదులుగా ఏప్రిల్ 1 నుంచే ప్రభుత్వ కళాశాలలు ప్రారంభమవుతాయి.
జూన్ 1 వ తేదీకి బదులుగా ఏప్రిల్ 7 నుండి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు అడ్మిషన్లు ప్రారంభిస్తారు.

2025-26 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదివే విద్యార్థులకు వార్షిక పరీక్షలను మార్చి 2026కి బదులుగా ఫిబ్రవరి చివరి వారం నుంచే నిర్వహిస్తారు. ట్యాబులేషన్ రిజిస్టర్లను పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేయాలని నిర్ణయించారు. డిజిలాకర్, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సజావుగా ఆన్‌లైన్ యాక్సెస్ ఉండేలా 1973 నుండి 2003 వరకు ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాల డేటాను డిజిటలైజ్ చేస్తారు.

విద్యార్థులకు సబ్జెక్టుల ఎంపికలో సౌలభ్యాన్ని పెంచి, బహుళవిభాగ అభ్యాసాలను ప్రోత్సహించడానికి ఈ విద్యాసంవత్సరం నుంచే మొదటి సంవత్సరం విద్యార్థులకు ఎలక్టివ్ సబ్జెక్టులను 2వ సబ్జెక్టుగా ప్రవేశపెట్టనున్నారు. లాంగ్వేజెస్, సైన్స్, హ్యూమానిటీస్ విభాగాల్లోని 24 ఆప్షన్స్ లో ఒక సబ్జెక్టును 2వ సబ్జెక్టుగా ఎంపిక చేసుకోవచ్చు. జూనియర్ కళాశాలల్లో ఎంబైపిసి ప్రవేశపెట్టాలనే ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా ఈ విద్యాసంవత్సరం నుంచి మ్యాథ్స్, బయాలజీ సబ్జెక్టులు అంతర్భాగాలుగా 6 సబ్జెక్టులతో ఎం.బైపిసి కోర్సును ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు 14 సబ్జెక్టులకు (సైన్స్, హ్యుమానిటీస్, లాంగ్వేజెస్ సహా) సవరించిన సిలబస్‌తో కొత్త పాఠ్యపుస్తకాలు ఈ విద్యా సంవత్సరం నుంచే అమలులోకి వస్తాయి. ఇంటర్మీడియట్ లో ఇప్పటివరకు రెండు సబ్జెక్టులుగా పరిగణిస్తున్న మ్యాథ్స్ ఎ, బిలను ఇకపై ఒకే సబ్జెక్టుగా విలీనం చేశారు.

అలాగే బైపిసి విద్యార్థులకు బాటనీ, జువాలజీలు కలిపి ఒకే సబ్జెక్టు ఉండేలా విలీనం చేశారు. ఈ విలీనం వల్ల ఆయా సబ్జెక్టులకు సమాన వెయిటేజీ లభిస్తుంది. ఈఏపిసెట్, జెఇఇ,
నీట్ వంటి పరీక్షలకు ప్రభుత్వ కళాశాలల విద్యార్థులను సన్నద్ధం చేయడానికి సమగ్ర పోటీ పరీక్షల కోచింగ్ మెటీరియల్‌ను ఇంటర్మీడియట్ బోర్డు తయారు చేస్తుంది. ఈ మెటీరియల్ బోర్డు పోర్టల్‌లో అందుబాటులో ఉంచుతారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు మెటీరియల్ ను ఉచితంగా అందజేస్తారు.

కాంపిటీటివ్ బేస్డ్ ఎసెస్ మెంట్ కోసం ఇంటర్మీడిటయట్, సైన్స్, హ్యూమనిటీస్ విభాగాలప్రశ్నల్లో 10% తప్పనిసరిగా బహుళ-ఎంపిక ప్రశ్నలు (MCQలు), ఖాళీలను పూరించే రూపంలో ఒక మార్కు ప్రశ్నలు ఉండేలా కొశ్చన్ పేపర్ రూపొందించాలని నిర్ణయించారు. NSQF స్థాయి ప్రకారం సిలబస్ సవరణ, వృత్తి విద్యార్థుల కోసం డ్యుయల్ సర్టిఫికేషన్ ను ప్రవేశపెట్టనున్నారు. నైపుణ్య పర్యావరణ వ్యవస్థను మెరుగుపరచడానికి వీలుగా ప్రమాణాలను నిర్ణయించారు. సమగ్ర నిబంధనలను అభివృద్ధి చేయడం, NSQF స్థాయి ప్రకారం వృత్తిపరమైన సిలబస్‌ను మెరుగుపరచడం కోసం భారత ప్రభుత్వ జాతీయ మండలితో సహకరించేలా ప్రణాళిక రూపొందించారు. వృత్తిపరమైన కోర్సుల పాఠ్యాంశాలను ఎప్పటికప్పుడు పరిశ్రమలకు అవసరాలకు తగ్గట్టుగా సవరించడానికి వీలుగా ఆయా ప్రాంతాల్లో ఏర్పాటయ్యే పరిశ్రమలతో ఒప్పందాలు చేసుకోవాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, కాలేజియేట్ ఎడ్యుకేషన్ డైరక్టర్ నారాయణ భరత్ గుప్త, ఇంటర్మీడియట్ విద్య డైరక్టర్ కృతికాశుక్లా, పాఠశాల విద్య డైరక్టర్ విజయరామరాజు, సమగ్ర శిక్ష స్పెషల్ ప్రాజెక్ట్ డైరక్టర్ బి.శ్రీనివాస్ రావు, ఎంప్లాయ్ మెంట్ అండ్ ట్రైనింగ్ డైరక్టర్ జి.గణేష్ కుమార్, ఉన్నత విద్యామండలి చైర్మన్ మధుమూర్తి, సెకండరీ ఎడ్యుకేషన్ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, ఓపెన్ స్కూల్స్ సెక్రటరీ నరసింహరావు, ఆంధ్రా వర్సిటీ వైస్ చాన్స్ లర్ జివి రాజశేఖర్, పద్మావతి వర్సిటీ విసి వి.ఉమ, ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విసి శారద రాజ్యలక్ష్మిదేవి, ఎన్ టిఆర్ హెల్త్ యూనివర్సిటీ విసి డిఎస్ విఎల్ నరసింహం, విశాఖపట్నం విఎస్ కె డిగ్రీ కాలేజి ప్రిన్సిపాల్ ఐ. విజయబాబు, మొవ్వ క్షేత్రయ్య గవర్నమెంట్ జూనియర్ కాలేజి ప్రిన్సిపాల్ ప్రసాద్ శాస్త్రి, కర్నూలు ఎపి రెసిడెన్షియల్ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ జయం శ్రీనివాస గుప్త, క్రోసూరు ఎపిఎంఎస్ ప్రిన్సిపాల్ శ్రీమతి మేరీ సుశాన్, నాదండ్ల కెజిబివి ప్రిన్సిపాల్ మాధవీ లత, నారాయణ జూనియర్ కాలేజి ప్రిన్సిపాల్ ఆనంద్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. (Story: వామ్మో…ఇంట‌ర్‌లో ఇన్ని మార్పులా?)

Follow the Stories:

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ప‌రీక్ష‌!

Friday Fear: మ‌రో వైసీపీ నేత అరెస్టుకు రంగం సిద్ధం!

రూ.520తో 10 లక్షలు, రూ. 755తో 15 లక్షలు

కొత్త రేషన్‌ కార్డులొస్తున్నాయి!

సిటీ కిల్ల‌ర్ వ‌చ్చేస్తోంది! ముంబ‌యికి ముప్పు?

స‌డెన్ డెత్: ఈ ఐఫోన్ మోడళ్లను నిలిపేసిన ఆపిల్‌!

నిరుద్యోగులకు మోదీ బంప‌ర్‌ ఆఫర్‌!

మారిన జ‌గ‌న్ వ్యూహ‌ర‌చ‌న: జగన్‌ 2.0 అంటే ఇదేనేమో!

మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?

మున్సిపల్‌ పీఠాలపై కూటమి గురి

బట్టలూడదీసి నిలబెడతా!: జగన్‌

జగన్ సెల్ఫీ కోసం ఏడ్చిన చిన్నారి! (Lovely Photos)

వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
వణికిస్తున్న కొత్త వైర‌స్‌!
శుక్రవారం గండం! వైఎస్ఆర్సీపీలో అలజడి

దుర్గ‌గుడి ల‌డ్డూ ప్ర‌సాదంలో వెంట్రుక‌లు!

జైల్లో నా భర్తను.. టార్చర్‌ చేస్తున్నారు..!

లైసెన్సుల్లో గోల్‌మాల్‌!

రోజాకు జగన్‌ చెక్‌?

రిజిస్ట్రేషన్‌ శాఖలో డిజిట‌ల్ విప్ల‌వం: లాభ‌మా? న‌ష్ట‌మా?

వైసీపీకి ఇంటా, బయటా పోరు

హెల్మెట్ కొత్త రూల్స్‌!

నూతన ప్రెస్ క్లబ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే

0

నూతన ప్రెస్ క్లబ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే

హర్షం వ్యక్తం చేసిన పెబ్బేరు ప్రెస్ క్లబ్

న్యూస్‌తెలుగు/వ‌న‌ప‌ర్తి :  ప్రభుత్వానికి ప్రజలకు వారది గా పని చేస్తున్న పెబ్బేరు ప్రెస్ క్లబ్ కు నూతనంగా స్థలం కేటాయించడంతో పాటు శాశ్వత భవన నిర్మాణానికి నిధులు మంజూరు కోసం వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డికి గత కొన్ని రోజుల క్రితం పెబ్బేరు ప్రెస్ క్లబ్ తరఫున వినతిపత్రం అందజేయగా ఎమ్మెల్యే అందుకు సానుకూలంగా స్పందించి ప్రెస్ క్లబ్ నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్టు ప్రొసీడింగ్ కాపీని గురువారం విడుదల చేశారు. పెబ్బేర్ ప్రెస్ క్లబ్ పై సానుకూలంగా స్పందించి నిధులు కేటాయించిన ఎమ్మెల్యేకు ప్రెస్ క్లబ్ తరఫున అధ్యక్షులు గొడుగు బాలవర్ధన్,మరియు ప్రెస్ క్లబ్ సభ్యులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. (Story :నూతన ప్రెస్ క్లబ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే)

చింతూరు ఏజెన్సీలో ప్రపంచ కిడ్నీ దినోత్సవం

0

చింతూరు ఏజెన్సీలో ప్రపంచ కిడ్నీ దినోత్సవం

అపోలో డయాలసిస్ క్లినిక్స్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు

న్యూస్ తెలుగు /చింతూరు : ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని పురస్కరించుకుని, అపోలో డయాలసిస్ క్లినిక్స్ ఆధ్వర్యంలో మూత్రపిండాల ఆరోగ్యం మరియు ముందస్తు గుర్తింపు ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని చింతూరు మండలం కుమ్మూరు గ్రామం లో నిర్వహించారు.
మీ మూత్రపిండాలు బాగున్నాయా? ముందుగానే పరీక్షించుకోండి – ఆరోగ్యాన్ని కాపాడుకోండి అనే థిమ్ తో హెల్త్ క్యాంపులు, ఆరోగ్య చర్చలు కార్యక్రమాలను నిర్వహించారు.
సమస్యలను గుర్తించి, తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యం అని
“క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సి కె డి ) బాధితుల సంఖ్య పెరుగుతోందని ముందుగా పరీక్షలు చేయించుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం ద్వారా దీన్ని నిరోధించవచ్చని ప్రజలకు మూత్రపిండల ఆరోగ్యం గురించి అవగాహన కల్పించడం మా బాధ్యతగా భావిస్తున్నాం అందుకే, ఉచిత పరీక్షలు, ఆరోగ్య శిబిరాలు నిర్వహించి వేలాది మందికి మద్దతుగా నిలుస్తున్నాం.” అని “మూత్రపిండ వ్యాధుల నుండి ప్రజలను రక్షించడానికి ముందస్తు పరీక్షలు చాలా అవసరం. కిడ్నీ ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు మేము ఎల్లప్పుడూ కృషి చేస్తాము. ఈ అవగాహన కార్యక్రమాల ద్వారా, వేలాది మందికి ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు, స్క్రీనింగ్‌లు అందించగలిగామని గర్వంగా భావిస్తున్నాం.” అపోలో డయాలసిస్ క్లినిక్స్ దేశవ్యాప్తంగా నాణ్యమైన డయాలసిస్ సేవలను అందించడంతో పాటు, మూత్రపిండాల ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తోందని
మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి… వెంటనే పరీక్ష చేయించుకోండి! అని పిలుపునిచ్చారు
అపోలో డయాలసిస్ క్లినిక్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీ సుధాకరరావు ,రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలు, కార్యకలాపాలు, వ్యాపార అభివృద్ధి మేనేజర్ శ్రీ మధు కిరణ్ వంటిపల్లి, డయాలసిస్ క్లినిక్ మేనేజర్ అభిరామ్ , డిప్యూటీ డి అండ్ యం హెచ్ ఓ . పి.పుల్లయ్య ,మెడికల్ సూపరింటెండెంట్ డా కోటిరెడ్డి
ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచు ముచ్చిక నాగార్జున , ఆశా వర్కర్లు వందకు పైగా గ్రామస్తులు పాల్గొన్నారు. (Story : చింతూరు ఏజెన్సీలో ప్రపంచ కిడ్నీ దినోత్సవం)

ముకునూరు గ్రామాన్ని మొత్తం జాబితాలో చేర్చాలి

0

ముకునూరు గ్రామాన్ని మొత్తం జాబితాలో చేర్చాలి

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు

న్యూస్ తెలుగు /చింతూరు : పోలవరం ప్రాజెక్టు ప్రభావంతో ముంపుకు గురవుతున్న ముకునూరు గ్రామంలో 121 గృహాలు ముంపులో ఉన్నట్లు జాబితాలో ప్రకటించి 49 గృహాలను ముంపు లేనట్లుగా పోలవరం అధికారులు ప్రకటించడం దుర్మార్గమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. ముకునూరు గ్రామస్తులు కార్యదర్శి దరఖాస్తు చేస్తూ గత వరదల్లో గ్రామం మొత్తం ముంపుకు గురైందని పడవలు కూడా నడిచాయని బాధను వెళ్లబుచ్చారు. నిర్వాసిత బాధితులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రాజెక్టు పట్ల శ్రద్ధచూపినంతగా నిర్వాసిత ప్రజానీకానికి పునరావాసం ప్యాకేజీ కల్పించడంలో అశ్రద్ధ వహిస్తుందన్నారు. గతంలో కేవలం ఎకరాకు లక్ష 15 వేలు మాత్రమే చెల్లించిందని ఆపై ఎటువంటి పరిహారం అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఇంటి నిర్మాణ స్ట్రక్చర్ వేల్యూ మూడు వంతులు పరిహారం చెల్లించాలని అలాకాకుండా కేవలం ఇంటి స్ట్రక్చర్ వేల్యూ మాత్రమే ప్రకటించడం అన్యాయమన్నారు. దీనిపై నిర్వాసిత బాధితులతో కలిసి ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు. నిర్వాసితుల పట్ల తమ పార్టీ ఎల్లవేళలా సహకారం అందిస్తుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బీరబోయిన సత్యకుమారి, జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్, మండల కార్యదర్శి పల్లపు వెంకట్, సీసం సురేష్, నాయకులు లక్ష్మణ్, పెద్ద రాములు, నాగేష్ తదితరులు పాల్గొన్నారు. (Story : ముకునూరు గ్రామాన్ని మొత్తం జాబితాలో చేర్చాలి )

వందేళ్ల ప్రజా పోరాటాల చరిత్ర సిపిఐ సొంతం

0

వందేళ్ల ప్రజా పోరాటాల చరిత్ర సిపిఐ సొంతం

విజయ రాములు

న్యూస్‌తెలుగు/వ‌న‌ప‌ర్తి:  భారతదేశంలో వందేళ్ళ ప్రజా పోరాటాల చరిత్ర గల ఏకైక పార్టీ సిపిఐ అని సిపిఐ జిల్లా కార్యదర్శి కె విజయరాములు అన్నారు. మార్చి 23న జిల్లా కేంద్రంలో సిపిఐ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ముఖ్య సమావేశంలో మాట్లాడారు. ముందుగా శతజయంతి ఉత్సవాల కరపత్రాలను విడుదల చేశారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభలో సిపిఐ పక్ష నేత కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ముఖ్య అతిథులుగాపాల్గొంటారన్నారు. 1925 డిసెంబర్ 26న కాన్పూర్లో సిపిఐ ఆవిర్భవించిందన్నారు. సంపూర్ణ స్వాతంత్రం కావాలని పిలుపునిచ్చిన తొలి పార్టీ సిపిఐ అన్నారు. బిజెపి పూర్వరూపం జనసంఘ్ అన్నారు. అనేక రూపాలు మార్చుకొనినేడు బిజెపిగా మారిందన్నారు. 1885లో జాతీయ కాంగ్రెస్ గా అవతరించిన కాంగ్రెస్ అనేక రూపాలు మార్చుకొని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అయిందన్నారు. సిపిఐ ఆవిర్భావం నుంచి నేటి వరకు అదే పేరుతో కొనసాగుతోందన్నారు. స్వాతంత్ర పోరాటంలోకమ్యూనిస్టు యోధులు ప్రాణత్యాలు చేశారన్నారు. నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ కోసం పోరాడింది అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో 4500 మంది కమ్యూనిస్టు యోధులు అమరులయ్యారన్నారు. 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన చరిత్ర దేశంలో ఏ పార్టీకి లేదన్నారు. 1952 లో జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్టు యోధుడు రావి నారాయణరెడ్డి నెహ్రూ కంటే అధిక మెజార్టీతో ఎంపీగా గెల్పొందారున్నారు. ఆనాటి పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించింది కూడా రావి నారాయణరెడ్డి అని గుర్తు చేశారు. నాటి నుంచి నేటి వరకు అధికారంతో సంబంధం లేకుండా తాడిత పీడిత బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సిపిఐ పోరాటాలు కొనసాగిస్తూనే ఉందన్నారు. ఘన చరిత్ర గల సిపిఐ శతజయంతి ఉత్సవాలు వనపర్తి జిల్లా కేంద్రంలో మార్చి 23న భగత్ సింగ్ జయంతి రోజు జరుపుకోవటం గర్వకారణం అన్నారు. పట్టణంలో భారీ ర్యాలీ, దాచే లక్ష్మయ్య ఫంక్షన్ హాల్ లో గొప్ప సభ జరుగుతుందని జిల్లా నలుమూలల నుంచి పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. సిపిఐ పోరాట ఉద్యమ స్ఫూర్తిని చాటాలన్నారు.సిపిఐ పట్టణ కార్యదర్శి రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు కళావతమ్మ, గోపాలకృష్ణ, ఎత్తం మహేష్ , విష్ణు, ఏఐఎస్ఎఫ్ నాయకులు నరేష్, వంశీ తదితరులు పాల్గొన్నారు. (Story : వందేళ్ల ప్రజా పోరాటాల చరిత్ర సిపిఐ సొంతం

‘కోర్ట్’ సినిమాని  ఆదరించిన ఆడియన్స్ కి థాంక్ యూ

0

‘కోర్ట్’ సినిమాని  ఆదరించిన ఆడియన్స్ కి థాంక్ యూ

ప్రొడ్యూసర్స్ ప్రశాంతి తిపిర్నేని& దీప్తి గంటా

న్యూస్‌తెలుగు/హైద‌రాబాద్ సినిమా : నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా ప్రెజెంట్ చేస్తున్న మూవీ ‘కోర్ట్’ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ అలానే ప్రేమలో పాట కూడా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ప్రశంసలు అందుకున్నాయి. ప్రిమియర్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం మార్చి 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్మాతలు ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

దీప్తి గారు కోర్టు జర్నీ ఎలా స్టార్ట్ అయింది ?
-నాని, ప్రశాంతి గారు స్క్రిప్ట్ విని ఓకే చేశారు. నేను ఆన్సెట్ ప్రొడ్యూసర్ గా జాయిన్ అయ్యాను. నేను రోజు సెట్స్ లో వుండేదాన్ని. నాని, ప్రశాంతి నాకు చాలా ప్రీడమ్ ఇచ్చారు.

కథ విన్నాక మీకు ఎలా అనిపించింది?
-నేను స్క్రిప్ట్ మొత్తం చదివాను. డైరెక్టర్ జగదీష్ చాలా బాగా రాసుకున్నాడు. చాలా లేయర్స్ వున్నాయి. అన్నీ బాగా కనెక్ట్ చేసుకున్నాడు. స్క్రీన్ ప్లే చాలా టైట్ గా ఉంటుంది. కథ నాకు చాలా నచ్చింది.

ప్రశాంతి గారు వాల్ పోస్టర్ సినిమాలో కథ ఓకే అవ్వడం ఎలా వుంటుంది  ?
-నాని, నేను ఇద్దరం కథ వింటాం. అయితే మా నమ్మకం అంతా నాని గారి జడ్జిమెంట్ మీరే వుంటుంది. ఆన పెద్దగా లెక్కలేమీ వేయరు. ఒక కథ థియేటర్లో చూడాలనిపించేలా వుంటే ఓకే చేస్తారు.

ప్రశాంతి గారు ప్రియర్స్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది ?
-ప్రిమియర్స్ కి యునానిమస్ గా ఎక్స్ లెంట్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ అఫ్ చూసి ‘వావ్’ అన్నారు. సెకండ్ హాఫ్ కోసం ఈగర్ గా వెయిట్ చేశారు. సెకండ్ హాఫ్ లోని హైలెట్స్ కూడా ఆడియన్స్ కి చాలా నచ్చాయి. రెస్పాన్స్ చాలా బావుంది. మేము అనుకున్నదాని కంటే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇలాంటి జోనర్ సినిమాని ఆడియన్స్ ఆదరించి బిగ్ సక్సెస్ చేయడం చాలా ఆనందంగా అనిపిస్తోంది. ఈ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాం.

-ప్రిమియర్స్ కి కొందరు లాయర్స్ కూడా వచ్చారు. వారికి చాలా నచ్చింది. ఒక కోర్ట్ రూమ్ డ్రామాని ఇంత  నేచురల్ ప్రజెంట్ చేయడం ఇంతముందు చూడలేదని చెప్పారు. ఇది మాకు మంచి కాంప్లీమెంట్.

 దీప్తి గారు..మీకు ఇందులో నచ్చిన పాయింట్స్ ఏమిటి ?
-చాలా పాయింట్స్ వున్నాయి. రోహిణి గారి క్యారెక్టర్ తో వచ్చే ఓ సీన్ చాలా నచ్చింది. అలాగే మంగపతి క్యారెక్టర్ లో శివాజీ గారు అద్భుతంగా చేశారు. ప్రతి ఇంట్లో అలాంటి ఓ క్యారెక్టర్ వుంటుంది.

డైరెక్టర్ జగదీశ్ గురించి?
డైరెక్టర్ జగదీశ్ ఈ సినిమాని చాలా రీసెర్చ్ చేసి రాశాడు. అందుకే సినిమా చాలా నేచురల్ గా వచ్చింది. పోక్సో చట్టం గురించి ఆయన చాలా డీటెయిల్ ప్రజెంట్ చేశాడు.

హిట్ 3 స్టేక్స్ చాలా పెద్దవి.. కానీ నాని గారు కోర్టు నచ్చకపొతే హిట్ 3 చూడొద్దని చెప్పడం ఎలా అనిపించింది ?
-మాకు షాకే. నేను ప్రశాంతి డైరెక్టర్ శైలేష్ వంక చూశాం.(నవ్వుతూ) తనకి నమ్మకం వుంది కాబట్టే ఆ మాటని కాన్ఫిడెంట్ గా చెప్పారు.

ఈ సినిమా కోసం ఎక్కడ ఎక్కువ స్పెండ్ చేశారు ?
సెట్స్ పరంగా ఎక్కువ స్పెండ్ చేయలేదు కానీ ఈ కథకు మంచి యాక్టర్స్ కావాలి. ఆ విషయంలో రాజీ పడలేదు. ప్రియదర్శి తో పాటు రోహిణీ గారు, సాయి కుమార్ గారు, శివాజీ గారు, హర్ష వర్ధన్ గారు .. ఇలా మంచి యాక్టర్స్ వున్నారు. రోషన్ శ్రీదేవి కూడా వారి పాత్రలకు పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యారు.

ప్రశాంతి గారు.. మీ కథల ఎంపిక ఎలా వుంటుంది ?
-జానర్ ఏదైనా కథలో నిజాయితీ వుండాలి. కథలో హానెస్టీ, డైరెక్టర్ లో క్లారిటీ వుంటే ముందుకు వెళ్తాం. నాని గారు ఇదే చూస్తారు.

దీప్తి గారు మీ దర్శకత్వంలో సినిమా ఎప్పుడు ?
నేను ‘మీట్ క్యుట్’ చేసిన తర్వాత యు ఎస్ వెళ్ళిపోయాను. ఈ సినిమా కోసం మళ్ళీ వచ్చాను. కొన్ని ఐడియాలు వున్నాయి. వాటిని స్క్రిప్ట్ గా డెవలప్ చేయాలి.

ఆల్ ది బెస్ట్
-థాంక్ యూ (Story : ‘కోర్ట్’ సినిమాని  ఆదరించిన ఆడియన్స్ కి థాంక్ యూ)

శిశు మరణాల పై సమగ్ర సమీక్ష

0

శిశు మరణాల పై సమగ్ర సమీక్ష

ప్రత్యేక వైద్య బృందం గ్రామాల సందర్శన

న్యూస్ తెలుగు /చింతూరు :  డిప్యూటీ డి యం అండ్ హెచ్ ఓ డాక్టర్ పుల్లయ్య మార్గదర్శకత్వంలో తులసిపాక ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కల్లేరు, చదలవాడ గ్రామాల్లో బృందం సందర్శించి, తల్లి దండ్రులను, ఫీల్డ్ సిబ్బందిని వివరంగా విచారించారు. శిశు మరణాల కారణాలను విశ్లేశించి, తగిన నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ పరిశీలన లో తగిన వైద్యం, పోషణ, మాత శిశు సంరక్షణ, అవగాహన కార్యక్రమాలు బలోపేతం చేయాలనీ, అలాగే సమర్ధవంతమైన ప్రణాళిక తో భవిష్యత్ లో ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచించారు. ఈ కార్యక్రమం లో చింతూరు ఐ టి డి ఎ పి ఓ అపూర్వ భరత్, ప్రత్యేక వైద్య నిపుణులు కాకినాడ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ లు జ్ఞాన సురేష్ కుమార్ ,సి హెచ్. గోపిచంద్, జి. సర్వేశ్వర్రావు,ఏ. శ్రావణి,యం. రాజేష్,కె. శ్రీకాంత్ రెడ్డి, తులసిపాక డాక్టర్ ఉదయ్ కుమార్ రెడ్డి,డాక్టర్ నిఖిల్, సూపర్ వైజర్ లు, ఎ యన్ యం లు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. (Story : శిశు మరణాల పై సమగ్ర సమీక్ష)

వైకాపా మద్యం కుంభకోణంపై ఈడీ విచారణకు ఆదేశించాలి

0

వైకాపా మద్యం కుంభకోణంపై ఈడీ విచారణకు ఆదేశించాలి

జగన్ అక్రమంగా దోచిన వేలకోట్లు రికవరీ చేసి ప్రజలకు ఖర్చుపెట్టాలి

న్యూస్ తెలుగు /వినుకొండ : రాష్ట్రంలో అయిదేళ్ల వైకాపా ప్రభుత్వంలో మద్యం అక్రమాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ – ఈడీ విచారణకు ఆదేశించాలని, జగన్ దోచుకున్న రూ.వేల కోట్లు రికవరీ చేసి ప్రజలకే ఖర్చు పెట్టాలని ప్రభుత్వ చీఫ్‌విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. చత్తీస్‌గఢ్‌, దిల్లీ కంటే 10 రెట్లు ఎక్కువ స్థాయిలో ఏపీలో మద్యం కుంభకోణం చోటుచేసుకుందన్న ఆయన, అందుకు కారణమైన ప్రతిఒక్కరిపై చర్యలు తీసుకోవాలని ప్రభు త్వాని కోరారు. గురువారం ఈ మేరకు అసెంబ్లీలో జరిగిన చర్చలో మాట్లాడిన చీఫ్‌ విప్ జీవీ మద్యపాలన నిషేధం చేస్తామనే హామీతో అధికారంలోకి వచ్చి అదే మద్యంలో వేలకో ట్లు దోచుకున్న ఘనుడు జగన్ అని ఎద్దేవా చేశారు. జేబ్రాండ్‌ల మద్యంతో వైకాపా నాయకులు ప్రజల ప్రాణాలు తీశారని, అవినీతి, దోపిడీకి బ్రాండ్ అంబాసిడర్లు అయ్యారన్నారు. ప్రజల ప్రాణాలు, ప్రజల ఆరోగ్యంపై అతి దుర్మార్గంగా వ్యాపారం చేశారని ధ్వజమెత్తారు. నాసిరకం మద్యం తాగి 40లక్షలమంది ఆస్పత్రి పాలయ్యారని, లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చిందన్నారు. కొందరు ఇళ్లు, ఆస్తులు అమ్ముకున్నారని వాపోయారు. 33వేలమంది ప్రాణాలు కోల్పోయారని, ఆ విధ్వంసానికి కారణమైన వారందరిపై బెల్టు తీయాల్సిందేనని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే సీఐడీ దర్యాప్తులో రూ. 3,500 కోట్లకు పైగా అవినీతికి ప్రాథమిక ఆధారాలు దొరికాయని,, ఆ దిశగా మరింతలోతుగా తవ్వాల్సి ఉందన్నారు. కూటమి ప్రభుత్వంలో క్వాలిటీ మద్యం క్వార్టర్ రూ.99 ఉంటే నాడు నాసిరకం మద్యం క్వార్టర్ రూ. 230 వరకు అమ్మారని, బెల్ట్‌షాపుల్లో మళ్లీ రూ.50 అదనంగా బాదారని గుర్తు చేశారు. డిజిటల్ లావాదేవీలు అనుమతించకుండా తాడేపల్లి ప్యాలెస్‌లోకి గుట్టలుగా బ్లాక్ మనీ పోగు చేసుకున్నారని, వాటిని లెక్కపెట్టడానికే రోజుకు 29 కౌంటింగ్ యంత్రాలు, 200మం ది సిబ్బంది పని చేసేవారన్నారు. అంతర్జాతీయ బ్రాండ్లు ఉంటే నాసిరకం మద్యం తాగరని, పెద్ద బ్రాండ్లను కూడా అడ్డుకున్నారన్నారు. జే-బ్రాండ్ల మద్యం ప్రాణాంతకం అని పక్క రాష్ట్రాలు ఏపీ బ్రాండ్లను నిషేధించిన దుస్థితి తెచ్చారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితి మార్చుతున్నామన్నారు. 90శాతం వరకు బెల్టు షాపులను కూడా కట్టడి చేసినట్లు తెలిపారు. అయితే నూతన మద్యం విధానంలో 20% కమిషన్ వస్తుందని టెండర్లు వేసిన వారంతా ప్రస్తుత ం ఇబ్బందులు పడుతున్నారని, ఆ విషయంలో ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు. గీత కార్మికులకు 10% కోటాతో 349 దుకాణాలు ఇచ్చినందుకు సీఎం చంద్రబాబుకు జివి ధన్యవాదాలు తెలిపారు. (Story : వైకాపా మద్యం కుంభకోణంపై ఈడీ విచారణకు ఆదేశించాలి)

కరాటే యువ క్రీడాకారుడికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంస

0

కరాటే యువ క్రీడాకారుడికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంస

చంద్రబాబుకు పరిచయం చేసిన చీఫ్‌ విప్ జీవీ ఆంజనేయులు

న్యూస్ తెలుగు / వినుకొండ : కరాటేలో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న వినుకొండ సమీపంలోని పెదకంచర్ల గ్రామానికి చెందిన యువక్రీడాకారుడు రామినేని రోహన్‌ను ఘనంగా సత్కరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవలే దక్షిణాఫ్రికా రాజధాని డర్బన్ వేదికగా జరిగిన కామన్‌వెల్త్ 11వ కరాటే ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న రోహన్‌కు ఏనుగు ప్రతిమ అందించి అభినందించారు. సీఎం చంద్రబాబు గురువారం ఈ మేరకు ప్రభుత్వ చీఫ్‌ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వారిని తీసుకుని వెళ్లి ముఖ్యమంత్రికి పరిచయం చేశారు. కొంతకాలంగా కరాటేలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వరస విజయాలతో సత్తా చాటుతున్నాడు. 15 ఏళ్ల యువ క్రీడాకారుడు రామినేని రోహన్ ఆ క్రమంలోనే 2024 నవంబర్ 28 నుండి డిసెంబర్ 1 వరకు డర్బన్‌ లో జరిగిన కామన్‌వెల్త్ ఛాంపియన్‌షిప్‌లో తొలి అంతర్జాతీయ పతకం సాధించాడు. 63 కిలోల విభాగంలో అతడు స్వర్ణం గెలిచి విశ్వవేదికపై త్రివర్ణ పతాకను రెపరెపలాడించాడు. ఎలైట్ విభాగంలో స్వర్ణంతో పాటు క్లబ్స్‌ విభాగంలో కాంస్యం అందుకున్నాడు. అంతకు ముందు జాతీయ, జోనల్ స్థాయిలో పలు పతకాలు గెలుచుకుని కరాటేలో ప్రతిభ చూపాడు. రోహన్ వెంట ఆయన తండ్రి రామినేని శివకృష్ణ, తాత రామినేని రామకోటయ్య, పెదనాన్నలు రామినేని పూర్ణచంద్రరావు, రామినేని సుబ్రమణ్యం ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన చీఫ్‌ విప్ జీవీ ఆంజనేయులు రోహన్ ఇలాంటి మరెన్నో విజయాలు సాధించి దేశానికి, రాష్ట్రానికి, పల్నాడు ప్రాంతానికి, వినుకొండకు మరింత మంచిపేరు తీసుకు రావాలని ఆకాంక్షించారు . ప్రతిభావంతులైన క్రీడాకారులకు రాష్ట్రంలో ఉజ్వల భవిష్యత్ ఉండబోతుందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఇటీవల తీసుకుని వచ్చిన నూతన క్రీడా విధానంతో ఇలాంటి వర్థమాన, గ్రామీణ క్రీడాకారులకు మరింత ప్రోత్సాహం అందిస్తామన్నారు. ఒకవైపు క్రీడా మౌలిక వసతుల పెంపు, మరోవైపు వివి ధ పోటీల్లో గెలిచిన విజేతలకు ప్రోత్సాహం ద్వారా క్రీడారంగానికి ఊతం ఇవ్వాలన్నదే సీఎం చంద్రబాబు ఆలోచనగా తెలిపారు. (Story : కరాటే యువ క్రీడాకారుడికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంస)

error: Content is protected !!