Homeవార్తలుతెలంగాణసత్వరమే రైతుల ఖాతాల్లోకి నగదు

సత్వరమే రైతుల ఖాతాల్లోకి నగదు

సత్వరమే రైతుల ఖాతాల్లోకి నగదు

న్యూస్ తెలుగు/వనపర్తి : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి ధాన్యం సేకరించిన తర్వాత వారికి వేగంగా ఖాతాల్లోకి నగదు పడేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ జి. వెంకటేశ్వర్లు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. ఆదివారం పెబ్బేరు, శ్రీరంగాపురం, పుల్గర్ చర్ల గ్రామాల్లో ఐ.కే.పి, సహకార సంఘాల ద్వారా నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ సందర్శించారు. ధాన్యం సేకరణ నిబంధనల ప్రకారం జరగాలని, తేమ, తాలు, చెత్త లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులను సూచించారు.సేకరించిన ధాన్యాన్ని నిర్దేశించిన మిల్లులకు ఎప్పటికప్పుడు తరలించాలని అదేవిధంగా ఆన్లైన్ లో నమోదు చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. అకస్మాత్తుగా వచ్చే వర్షాల నుండి ధాన్యానికి రక్షణ కల్పించే విధంగా టార్పాలిన్ లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Jacqueline Fernandez Latest Pics