వైసిపి కార్యకర్తలు అరెస్ట్
న్యూస్ తెలుగు/సాలూరు సెప్టెంబర్ 9 : వైసీపీ చేపడుతున్న రైతు పోరుబాట కార్యక్రమానికి బయలుదేరుతున్న వైసీపీ శ్రేణులను పోలీసులు ఆరెస్ట్ చేశారు. రాష్ట్రంలో రైతులకు సకాలంలో యూరియా అందకపోవడంపై మంగళవారం వైయస్సార్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న రైతు పోరుబాట కార్యక్రమానికి బయలుదేరుతున్న పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం మక్కువ జడ్పిటిసి సభ్యులు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి (పార్వతిపురం కురపాం) ఇంచార్జ్ మామిడి శ్రీనివాస నాయుడు వైయస్సార్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి దండి శ్రీనివాసరావును తోణం లో వారి స్వగృహాల వద్ద గృహనిర్బంధం చేశారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇలాంటి అరెస్టులు చేస్తే భయపడే ప్రసక్తి లేదనే ఇంకా ఆత్మవిశ్వాసంతో ఈ ప్రభుత్వంతో ఈ పోరాడి ప్రజలకు రైతులకు యూరియా, ఎరువులు వచ్చేవరకు పోరాడుతామని తెలిపారు.(Story :వైసిపి కార్యకర్తలు అరెస్ట్ )

