ఈ.వి.యం గోదాము పరిరక్షణ జాగ్రత్తగా నిర్వహించాలి
న్యూస్తెలుగు/ వనపర్తి : ఈ.వి.యం గోదాము పరిరక్షణ జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. ఈ.వి.యం గోదాము నెలవారీ తనిఖీలో భాగంగా బుధవారం ఆర్డీవో కార్యాలయ సముదాయంలో ఉన్న ఈ.వి.యం గోదాము భద్రతను పరిశీలించారు. నిరంతర నిఘా కొరకు ఎంతమంది పోలీసుకు విధులు నిర్వహిస్తున్నారనే వివరాలు అడిగి రిజిస్టరు ను పరిశీలించారు. గోదాముకు నిరంతరం పోలీస్ భద్రత, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ కల్పించడం జరుగుతుందని పోలీస్ సిబ్బంది తెలియజేశారు. ఆర్డీఓ సుబ్రమణ్యం, తహసిల్దార్ రమేష్ రెడ్డి, ఎలక్షన్ సెక్షన్ సూపరింటెండెంట్ కిషన్ నాయక్, ఇతర సిబ్బంది ఉన్నారు . (Story:ఈ.వి.యం గోదాము పరిరక్షణ జాగ్రత్తగా నిర్వహించాలి)