అల్లూరి పోరాట స్ఫూర్తితో మరో స్వాతంత్ర పోరాటానికి సిద్ధమవుదాం
బ్రిటిష్ వారి చట్టాల కన్నా ప్రమాదకరమైనది కాగర్ చట్టం
సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు
న్యూస్ తెలుగు/చింతూరు : స్వాతంత్ర సమరయోధుడు మన్యంపులి బ్రిటిష్ వారి గుండెల్లో గడ గడ లాడించిన తెలుగు విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తితో మోడీ వ్యతిరేక విధానాలపై మరో స్వతంత్ర పోరాటం చేయవలసిన సమయం ఆసన్నమైందని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పిలుపునిచ్చారు.
బుధవారం ఉదయం స్థానిక గణేష్ చౌక్ వద్ద అల్లూరి సీతారామరాజు 100వ వర్ధంతి సందర్భంగా ఆయనకు తాటిపాక మధు, జట్లు లేబర్ యూనియన్ అధ్యక్షులు కొండ్రపు రాంబాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమం ఉద్దేశించి తాటిపాక మధు మాట్లాడుతూ చిరుప్రాయంలోనే ఈ దేశ స్వతంత్రం కోసం సాయుధ పోరాటం చేసి అమరులైన గొప్ప విప్లవ వీరుడు అల్లూరి అని ఆయన కొనియాడారు బ్రిటిష్ తెల్ల దొరలు ఈ దేశం నుండి తరలిపోవాలని మా పాలన మేము చేసుకుంటామని చెప్పిన సీతారామరాజు మాటలు ఇప్పటికీ నెరవేరలేదని ఆయన అన్నారు.మన పాలకులు తెల్ల దొరలు పోయి నల్ల దొరలు అధికారంలోకి వచ్చారని అంతేతప్ప పాలన ఏమీ మారలేదని ఆయన విమర్శించారు.
బ్రిటిష్ కాలంలో లేని ప్రమాదకరమైన చట్టాలు నేడు మోడీ ప్రభుత్వం లో ఉన్నాయని ఆదివాసులను అడవిలో నుండి బయటకు పంపించడం కోసమే ఆపరేషన్ కాగర్ ప్రవేశపెట్టారని ఆయన అన్నారు.
అడవిలో ఉన్న సహజ వనరులను ఆదాని అంబానీలకు దోచి పెట్టేందుకే చట్టాలను తయారు చేస్తున్నారని ఆయన విమర్శించారు. బ్రిటిష్ కాలంలోనే కార్మికులకు చట్టాలు ఉన్నాయని నేడు మోడీ కాలంలో ఆనాటి చట్టాలు ఎత్తివేసి నాలుగు లేబర్ కోడ్ గా ప్రవేశపెట్టారని దీంతో కార్మికులకు సంఘం పెట్టుకునే హక్కు పోతుందని ఆయన పేర్కొన్నారు అల్లూరి పోరాట స్ఫూర్తితో మోడీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమిద్దమని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కన్వీనర్ కొండ్రపు రాంబాబు మహిళా సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి పి.లావణ్య సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు నల్ల రామారావు సేపీని రమణమ్మ టీ.నాగేశ్వరరావు ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు కే.శ్రీనివాస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.త్రిమూర్తులు మహిళా సమైక్య నాయకురాలు శెట్టి నాగమణి జట్ల సంఘం అధికార బాడి పి దేవుడు బాబు ఆర్.బాలకృష్ణ ఆర్.వెంకట్రావు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. (Story:అల్లూరి పోరాట స్ఫూర్తితో మరో స్వాతంత్ర పోరాటానికి సిద్ధమవుదాం)