ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం
డ్రైవర్స్ డే సందర్భంగా ఆర్టీసీ డ్రైవర్లకు సంఘీభావం ప్రకటించిన ఎమ్మెల్యే మేఘా రెడ్డి
న్యూస్తెలుగు/వనపర్తి : ఆర్టీసీలో బస్సులో ప్రయాణం చేయడం అందరికీ సురక్షితమని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్లందరికీ డ్రైవర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సంస్థ తరఫున డిపో మేనేజర్ వేణుగోపాల్ ఇతర సిబ్బంది శుక్రవారం ఎమ్మెల్యే ని ప్రత్యేకంగా కలిశారు. డ్రైవింగ్ చేస్తూ సెల్ఫోన్ మాట్లాడనని, సురక్షితమైన డ్రైవింగ్ చేస్తానని, మద్యం సేవించి బస్సును నడపనని, రోడ్డు భద్రత లో తన వంతు పాత్ర పోషిస్తానని ప్రత్యేకంగా తయారు చేయించిన బ్యానర్ పై ఎమ్మెల్యే గారు సంతకం చేసి డ్రైవర్లకు సంఘీభావం ప్రకటించారు . (Story : ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం)