Homeవార్తలుతెలంగాణనేడు ఉచిత రక్త నాళాల వైద్య శిబిరం సత్య సాయి భజన మందిరం నిర్వాహకులు

నేడు ఉచిత రక్త నాళాల వైద్య శిబిరం సత్య సాయి భజన మందిరం నిర్వాహకులు

నేడు ఉచిత రక్త నాళాల వైద్య శిబిరం సత్య సాయి భజన మందిరం నిర్వాహకులు

న్యూ తెలుగు/ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని మాధవ నగర్ లోని సత్యసాయి భజన మందిరము నందు ఈనెల 21వ తేదీ ఆదివారం ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉచిత రక్తనాళాల వైద్య శిబిరమును నిర్వహిస్తున్నట్లు సత్య సాయి భజన మందిరం నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 5000 రూపాయలు విలువైన రక్తనాళాల సర్జన్ కన్సల్టేషన్ వైద్య పరీక్షలు పూర్తిగా ఉచితమని తెలిపారు. భారత దేశపు అతిపెద్ద వాస్కులర్ హాస్పిటల్-హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఈ శిబిరమును నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ శిబిరంలో ఉబ్బిన మెలి తిరిగిన నరాలు, స్పైడర్ సిరలు, కాళ్లు లో రక్తం సరఫరా లేకపోవడం, కాలు లేదా పాదాలవాపు, సారియాసిస్, మెదడుకు తగినంత రక్త సరఫరా లేకపోవడం లాంటి సమస్యలకు మెరుగైన వైద్య చికిత్సలను నిర్వహించబడునని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 9100560216 కు గాని 7337321806కు గాని 990876054కు గాని సంప్రదించాలని తెలిపారు.(Story:నేడు ఉచిత రక్త నాళాల వైద్య శిబిరం సత్య సాయి భజన మందిరం నిర్వాహకులు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!