Homeవార్తలుతెలంగాణగవర్నర్ పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి

గవర్నర్ పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి

గవర్నర్ పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి

న్యూస్ తెలుగు /ములుగు : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ పర్యటనకు ఏర్పాట్లు త్వరితగతిన, పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ జిల్లా పర్యటనలో భాగంగా ,లక్నవరం సరస్సు, ఐర్ల్యాండ్ సందర్శించనున్న నేపథ్యంలో, సుందరికరణ ఏర్పాట్ల పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఐర్ల్యాండ్ లో గదులను శుభ్రంచేయాలని, శానిటేషన్ చేయాలని, ఐర్ల్యాండ్
సుందరీకరణ చేయాలని సంబంధిత అధికారులను సూచించారు. గవర్నర్ పర్యటన ఏర్పాట్లను కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య ఎటువంటి లోటు పాట్లు లేకుండా పకడ్బందీగా
చేయాలని అధికారులను సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు పి. శ్రీజ, సి. హెచ్. మహేందర్ రెడ్డి,
ఈ ఈ పంచాయత్ రాజ్ అజయ్ కుమార్, డిఈ ఎలక్ట్రిసిటీ నాగేశ్వరరావు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. (Story : గవర్నర్ పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!