UA-35385725-1 UA-35385725-1

రాగిపిండి పంపిణీని ప్రారంభించిన జెసి కార్తీక్‌

రాగిపిండి పంపిణీని ప్రారంభించిన జెసి కార్తీక్‌

విజయనగరం (న్యూస్ తెలుగు) : విజయనగరంలో ఎండియు వాహ‌నాల ద్వారా రాగిపిండి పంపిణీని జాయింట్ క‌లెక్ట‌ర్ కె.కార్తీక్ ప్రారంభించారు. స్థానిక కెఎల్‌పురం రామ‌మందిరం వ‌ద్ద శ‌నివారం జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో ల‌బ్దిదారుల‌కు రాగిపిండి ప్యాకెట్ల‌ను అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ప్ర‌జ‌ల ఆరోగ్యం కోసం బ‌ల‌వ‌ర్ధ‌క పోషకాహార‌మైన రాగిపిండిని ప్ర‌భుత్వం స‌ర‌ఫ‌రా చేస్తోంద‌ని చెప్పారు. కిలో రాగిపిండి ప్యాకెట్‌కు కార్డుదారులు రూ.11 చెల్లించాల‌ని చెప్పారు. ఈ అవ‌కాశాన్ని ప్ర‌తీఒక్క‌రూ వినియోగించుకోవాల‌ని కోరారు. రాగిపిండి కావాల్సిన వారికి ఒక కిలో బియ్యం త‌గ్గించి ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌ని చెప్పారు. రేష‌న్ స‌రుకుల స‌ర‌ఫ‌రాను త‌నిఖీ చేశారు. బ‌యోమెట్రిక్ ప‌నిచేయ‌నివారికి ఐరిష్ ద్వారా రేష‌న్ స‌రుకుల‌ను పంపిణీ చేయాల‌ని ఆదేశించారు. ప్ర‌తీఒక్క‌రూ ప్ర‌భుత్వం స‌ర‌ఫ‌రా చేస్తున్న బియ్యాన్ని వినియోగించాల‌ని జెసి కోరారు.
ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా పౌర‌స‌ర‌ఫ‌రా అధికారి కె.మ‌ధుసూద‌న‌రావు, త‌హ‌శీల్దార్ ఎవి ర‌త్నం, సిఎస్‌డిటి రామారావు తదిత‌రులు పాల్గొన్నారు. (Story: రాగిపిండి పంపిణీని ప్రారంభించిన జెసి కార్తీక్‌)

See Also

మ‌రో ముగ్గురు ఎంపీల జంప్‌!

తెలంగాణ మీడియా అకాడ‌మీ ఛైర్మ‌న్‌గా కే.శ్రీ‌నివాస్‌రెడ్డి

బీజేపీ దారెటు?

‘పుత్రులకు’ ఓటమి ఫీవర్‌!

టీడీపీ, జ‌న‌సేన ఫ‌స్ట్ లిస్ట్ వ‌చ్చేసింది!

సంకోచంలో ‘షర్మిలక్క’

స‌ర్వే సంచ‌ల‌నం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!

కంటతడి పెట్టిన ముద్దరబోయిన!

వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?

వైసిపికి ప్ర‌ముఖ నేత‌లు గుడ్‌బై!

నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్

కెనడాలో ‘తెలుగు తల్లి’

ర‌వితేజ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ అదిరిపోయింది!

రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవ‌ల్‌!

స‌రైనోడు మూవీని మించిపోయేలా!

‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2

యూనిక్ కంటెంట్ ‘బబుల్‌గమ్’

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1