గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పురస్కారాలు పొందిన సి ఐ ఎస్ ఐ
న్యూస్ తెలుగు /చింతూరు : 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కొత్తగా ఏర్పడిన పోలవరం జిల్లా కేంద్రం ( రంపచోడవరం)లో సోమవారం జాయింట్ కలెక్టర్,ఐటీడీఏ పీవో అయిన బచ్చు స్మరణ్ రాజ్ చేతుల మీదుగా ఉత్తమ సేవలందించినందుకు గాను చింతూరు సిఐ గోపాలకృష్ణ, ఎస్సై రమేష్ పురస్కారాలు, ప్రశంసా పత్రాలు జాయింట్ కలెక్టర్ అందించారు. పురస్కారాలు పొందిన సిఐఎస్ఐలను ఎ ఎస్పి బొడ్డు హేమంత్ కుమార్, పోలీస్ సిబ్బంది ప్రశంసించారు.(Story : గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పురస్కారాలు పొందిన సి ఐ ఎస్ ఐ )

