బాల్ బ్యాట్మెంటన్ పోటీలకు
వినుకొండ బాలిక ఎంపిక
న్యూస్ తెలుగు /వినుకొండ : 44వ సౌత్ జోన్ బాల్ బ్యాడ్మింటన్ మహిళల ఛాంపియన్షిప్ పోటీలకు వినుకొండలోని రాధా డిగ్రీ కాలేజ్ నందు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుచున్న ఆకుమళ్ళ సమీర ఎంపికైందని కాలేజ్ డైరెక్టర్ కె.వి. రాధా కృష్ణ మూర్తి తెలిపారు. ఈనెల 28 నుండి 30 వరకు తమిళనాడు రాష్ట్రంలోని టెంకాసి లో జరిగే ఏడు రాష్ట్రాల సౌత్ జోన్ ఛాంపియన్షిప్ కు ఆంధ్ర ప్రదేశ్ జట్టు తరఫున ఎంపికైందని కాలేజ్ ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ విద్యార్థిని ఈనెల 24 నుండి 27 వరకు తిరుపతిలో జరిగే కోచింగ్ క్యాంప్ లో పాల్గొని తర్వాత సౌత్ జోన్ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొనడానికి ఎంపికైంది. ఈ సందర్భంగా ఆర్.రాధాకృష్ణమూర్తి పి.డి మరియు ఉమ్మడి గుంటూరు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సెక్రటరీ వై శ్రీనివాసరావు, ప్రెసిడెంట్ ఈ. శివశంకర్, జాయింట్ సెక్రెటరీ జోనా నాయక్ అభినందనలు తెలిపారు. (Story:బాల్ బ్యాట్మెంటన్ పోటీలకు వినుకొండ బాలిక ఎంపిక)

