బ్రాహ్మణ సేవా సంఘం కార్తీక వనసమారాధన లో జీవి..
న్యూస్ తెలుగు /వినుకొండ : స్థానిక శ్రీనివాస్ నగర్ నందు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాస వనసమారాధన మహోత్సవం లో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జీవి స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు ఏర్పాటు చేసిన వనసమారాధనలో పాల్గొని, భక్తులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సంఘం సభ్యులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.(Story:బ్రాహ్మణ సేవా సంఘం కార్తీక వనసమారాధన లో జీవి..)

