గుమ్మడి కళాపీఠం ఆధ్వర్యంలో ఆదివారం రాష్ట్రవ్యాప్త కళాకారుల కార్తీక వనభోజనాలు కార్యక్రమం
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ గుమ్మడి కళాపీఠం ఆధ్వర్యంలో ఆదివారం రాష్ట్రవ్యాప్త కళాకారుల కార్తీక వనభోజనాలు కార్యక్రమం స్థానిక వెల్లటూరు రోడ్డులోని గుమ్మడి వృద్ధాశ్రమంలో దాదాపు 200 మంది కళాకారులు పాల్గొన్నారు. కళాకారుల సభలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, జి డి సి సి చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ. కళాకారులకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని మరియు గుమ్మడి వృద్ధాశ్రమం గుమ్మడి కళా పీఠం ద్వారా గుమ్మడి దంపతులు సేవా దృక్పథం నో ఈ సందర్భంగా కొనియాడటం జరిగింది. మంచి పనులు చేస్తున్న గుమ్మడి కి మేము అండగా ఉంటామని ఆయన గత 25 ఏళ్లగా వినుకొండ నియోజకవర్గం మొత్తం సేవా కార్యక్రమాలతో తాను నిలిచిపోయేలాగా సేవ చేస్తున్నారని కొనియాడారు. ఆటల పోటీలు నందు పాల్గొన్న మహిళలకు చీరలు నాయకులు చేతుల మీదుగా అందజేశారు.(Story : గుమ్మడి కళాపీఠం ఆధ్వర్యంలో ఆదివారం రాష్ట్రవ్యాప్త కళాకారుల కార్తీక వనభోజనాలు కార్యక్రమం)

