విజయరాజు దంపతులకు సత్కరించిన ఎంఈఓలు, ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులు
న్యూస్ తెలుగు /సాలూరు : ఘణంగా ప్రధానోపాధ్యాయుడి పదవి విరమణ సభ సాలూరు పట్టణ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ లో ఎడ్ల విజయరాజు ( పీఎస్ హెచ్ ఎం) పదవి విరమణ సభ వేడుకగా నిర్వహించారు. ఆదివారం ఉదయం కిలపర్తి దాలినాయుడు మాస్టారు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుడిగా విజయరాజు సేవలను ఎంఈఓ జోగారావు అలాగే తోటి ఉపాధ్యాయులు ఇంకా ఆయన శ్రేయోభిలాషులు కొనియాడారు. అనంతరం విజయరాజు మాస్టారు దంపతులను దుశ్శాలవతో ఘణంగా సత్కరించారు. అలాగే సన్మాన పత్రాన్ని అందించి వారి అభిమానాన్ని చాటుకున్నారు. అంతేకాకుండా టొంపల నాగరాజు కుటుంబ సభ్యులు పదవీ విరమణ అభినందనలు తెలియజేసి వీడ్కోలు పలికారు. ఎంఈఓ 2 సతీష్, అప్పలకొండ, నీడ్ వేణు ఇంకా ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.(Story : విజయరాజు దంపతులకు సత్కరించిన ఎంఈఓలు, ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులు )

