Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌పట్టణంలో ముమ్మరంగా శానిటేషన్ పనులు

పట్టణంలో ముమ్మరంగా శానిటేషన్ పనులు

పట్టణంలో ముమ్మరంగా శానిటేషన్ పనులు

న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ సూచనలతో రాబోయే వర్షాభావ పరిస్థితులను దృష్టి లో ఉంచుకొని పురపాలక సంఘ పరిధిలో ఎటువంటి వరదలు సంభవించిన చర్యలు తీసుకుంటాం. రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా నివారించేందుకు దుర్గం దాన్ని తొలగించుటకు, దోమల పెరుగుదలను అరికట్టేందుకు పట్టణ పరిధిలో ఉన్న అన్ని మేజర్ డ్రైనేజీలు డీసిల్టేషన్ చేయించాలని నిర్ణంచారు. దీనిలో భాగంగా బిపిఎస్ 2019 మరియు ఎల్ఆర్ఎస్ 2020 నియమాలకు లోబడి రాష్ట్ర ప్రభుత్వం పట్టణానికి కేటాయించిన 44.59 లక్షల నిధులతో పలు విడతలుగా కాలువ పూడిక తీసివేత ప్రారంభించారు. ఇందులో భాగంగా పట్టణంలోని వివిధ వార్డులలో, మార్కాపురం రోడ్, తిమ్మాయి పాలెం రోడ్ ఇసుక వాగు మెయిన్, పల్నాడు రోడ్డు మెయిన్ డ్రైనేజీ మొదలగు ప్రాంతాల్లో డీసిల్టేషన్ పనులు చేపట్టారు. ఈ పనులను మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ , మున్సిపల్ ఇంజనీర్ ఆదినారాయణ, శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ తదితరులు పర్యవేక్షిస్తూ పట్టణ ప్రజలు మరియు వ్యాపారస్తులు డీసిల్టేషన్ చేసే సమయంలో డీసిల్టేషన్ సిబ్బందికి సహకరించాలని ఎటువంటి అడ్డంకులు ఉన్న తొలగించాలని తగు సూచనలు ఇచ్చారు. (Story:పట్టణంలో ముమ్మరంగా శానిటేషన్ పనులు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!