చేపలు పడుతూ ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి..
న్యూస్ తెలుగు/ వినుకొండ : నూజెండ్ల మండలంలోని వి అప్పాపురం గ్రామంలో చేపలు పడుతూ ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం చెరగాని వారి పాలెం కు చెందిన సిహెచ్ ఏడుకొండలు చేపలు పట్టే కూలీగా జీవన సాగిస్తున్నారు. ఈ క్రమంలో అప్పాపురం గ్రామ పరిసర ప్రాంతంలో చెరువులో చేపలు పడుతూ అదుపుతప్పి చెరువులో పడి మునిగి చనిపోయాడు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం వినుకొండలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (Story:చేపలు పడుతూ ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి..)

