ఉషోదయం సోలార్ & అగ్రి నూతన కార్యాలయం ప్రారంభం
న్యూస్ తెలుగు /వినుకొండ : స్థానిక లాయర్ స్టేట్ లో ఉషోదయం సోలార్, అగ్రి నూతన సోలార్, అగ్రి కార్యాలయం ప్రారంభోత్సవంలో నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ నూతన కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్న అతిథులు, సోలార్ మరియు వ్యవసాయ రంగాలలో ఉషోదయం సోలార్, అగ్రి అందించే సేవలను ప్రశంసించారు. ఎంపీ లావుమాట్లాడుతూ. సోలార్ శక్తి వినియోగం మరియు వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం ప్రాముఖ్యతను వివరించారు. చీఫ్ విప్ జీవి కూడా ఈ నూతన ప్రయత్నాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జున రావు, పి. బాలాజీ, కూటమి నాయకులు యార్లగడ్డ లెనిన్ కుమార్, కె. నాగశ్రీను, పి. సురేష్ బాబు, పి. అయూబ్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు. (Story:ఉషోదయం సోలార్ & అగ్రి నూతన కార్యాలయం ప్రారంభం)