పెనుగొండ లక్ష్మీనారాయణకు వినుకొండలో అపూర్వ స్వాగతం
న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షులు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పెనుగొండ లక్ష్మీనారాయణ దంపతులకు స్థానిక జాషువా కళా ప్రాంగణం ఆవరణలో సోమవారం రాత్రి గొప్ప సన్మాన కార్యక్రమం నిర్వహించారు. తొలుతగా పెనుగొండ ను కారులో ఊరేగింపుగా నరసరావుపేట రోడ్డు నుండి శివయ్య స్తూపం సెంటర్ సిపిఐ కార్యాలయం వద్దకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా పెనుగొండ పులుపుల శివయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే గంగినేని వెంకటేశ్వరరావు, పఠాన్ కాసింఖాన్, గుర్రం జాషువా, వీరిశెట్టి సీతయ్య, బిక్కి రాములు, విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అలాగే పెనుగొండ పాత జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ ఊరేగింపులో పలువురుని పలకరిస్తూ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. (Story:పెనుగొండ లక్ష్మీనారాయణకు వినుకొండలో అపూర్వ స్వాగతం)