పట్టుదలే పెట్టుబడిగా అధ్యయనం కొనసాగించాలి..
న్యూస్ తెలుగు / వినుకొండ :డీఎస్సీలో విజయం సాధించాలంటే సడలని పట్టుదలే పెట్టుబడిగా ప్రిపరేషన్ కొనసాగించాలని కృష్ణవేణి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఆర్. యోగి అన్నారు. సఫల కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో సోమవారం మెగా డీఎస్సీ పై ఉచిత అవగాహన సదస్సు స్థానిక కొత్తపేటలోని కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో జరిగింది. ఈ సదస్సులో వారు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ. అభ్యర్థులు నిరంతరం శ్రమిస్తూ తమ కలని సాకారం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ పి సీతారాం బాబు, అధ్యాపకులు జి.గోవిందు, కె.ప్రసాద్ బాబు, ఎం. కోటేశ్వరరావు, ఏ.కె.వి ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు. (Story:పట్టుదలే పెట్టుబడిగా అధ్యయనం కొనసాగించాలి..)

