బిగ్ అప్డేట్: పర్చూరులో భారీ పేలుడు డంప్
•మార్టూరు హైవే సమీపంలో టన్నులకొద్ది పేలుడు సామాగ్రి
•మండల వైసీపీ నేత ఫ్యాక్టరీ, నివాసం,గోడౌన్ లో కీలక సమాచారం
•టన్నుల కొద్దీ పేలుడు సామాగ్రి లభ్యం
•మాఫియాకు అడ్డాగా మార్టూరు ఫ్యాక్టరీ
•మాజీమంత్రి కాకాని గోవర్ధన్ మార్టూరు నేతకు సంబంధాలు…?
•మూడు నెలల క్రితం గంజాయి లభ్యం….
•బాపట్ల జిల్లా ఎస్పీకి నిఘా విభాగం సమాచారం
•ఎస్పీ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు
•గ్రానైట్ ముసుగులో జిలేటిన్ స్టిక్స్ అక్రమ రవాణా
•వైసీపీ రాజకీయ కుట్ర దిశగా పోలీసుల దర్యాప్తు
•అనుమతులు లేకుండా టన్నులకొద్ది జిలేటిన్ స్టిక్స్
•శాంతి భద్రతలకు ముప్పుపై పోలీసుల అనుమానం
•పరారీలో పలువురు వైసిపి నేతలు
•గోప్యంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు
•ఉన్నతాధికారులకు సమగ్ర సమాచారం
న్యూస్తెలుగు/బాపట్ల: బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని మార్టూరు హైవే సమీపంలో వైసీపీ నేత ఫ్యాక్టరీలో టన్నుల కొద్ది భారీ పేలుడు సామాగ్రి లభ్యమైంది. గ్రానైట్ వ్యాపారం ముసుగులో పేలుడు పదార్థాలు అక్రమ రవాణా బట్టబయలు కావడంతో పర్చూరు నియోజకవర్గ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వైసీపీ నేతలు నియోజకవర్గంలో భారీ కుట్రకు తెర లేపారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. నిఘ విభాగం సమాచారంతో అప్రమత్తమైన బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి, జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగారు. మార్టూరు మండల సీనియర్ వైసీపీ నేత ఫ్యాక్టరీ నివాసం గోడౌన్ లో తనిఖీలు నిర్వహించారు. దీంతో టన్నులకొద్దీ పేలుడు సామాగ్రి లభ్యమైనట్లు తెలుస్తుంది. టన్నులకొద్దీ జిలేటెన్ స్టిక్స్ డంపును పోలీసులు గుర్తించినట్లు సమాచారం. పోలీసులు తనిఖీలు కీలక సమాచారం లభ్యమైనట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. గ్రానైట్ అక్రమ రవాణా ముసుగులో వైసీపీ నేతలు భారీ కుట్రలకు తరలిపారని అనుమానాలపై పోలిసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే…
మార్టూరు మండలానికి చెందిన సీనియర్ నేత ఫ్యాక్టరీ మాఫియాకు అండగా మారిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత మూడు నెలల క్రితం టన్నులకొద్దీ గంజాయి సైతం విక్రయిస్తూ పట్టుబడినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కొద్దికాలంగా నిఘా విభాగం నిగా పెట్టడంతో అక్రమ పేలుడు సామాగ్రి విషయం తేట తేల్లమైంది. నిఘా విభాగం బాపట్ల జిల్లా ఎస్పీకి సమాచారం అందించడంతో ఎస్పీ పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఒక్కసారిగా పోలీసులు ఫ్యాక్టరీ గోడౌను నివాసంపై తనిఖీలు ప్రారంభించడంతో టన్నులకొద్దీ పేలుడు సామాగ్రి లభించింది. గ్రానైట్ వ్యాపారం ముసుగులో మార్టూరు మండలానికి చెందిన వైసిపి నేత పేలుడు పదార్థాల రవాణా కొనసాగిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతల కనుసనల్లో జరుగుతున్న అక్రమ వ్యాపారాలు దందాలో కీలకంగా మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డితో ఉన్నారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మాజీ మంత్రితో సంబంధాలు….!
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మైనింగ్ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న నెల్లూరు జిల్లాకు చెందిన వైసిపి మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో మార్టూరు కు చెందిన వైసిపి సీనియర్ నేత హనుమంతరావుకు సంబంధాలు ఉన్నాయని అనుమానం వ్యక్తం అవుతుంది. వైసీపీలో కీలకంగా ఉన్న ఈ నేత ఆది నుంచి వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటూ అనేక అక్రమాలకు పాల్పడ్డారు. దీంతో మాజీ మంత్రితో ఇతనికి ఉన్న సంబంధాలపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు.నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్న ఆయనపలు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. 307 హత్యాయత్నం కేసులు సైతం ముద్దాయిగా ఉన్నాడు. పలు హత్య కేసుల్లో తన ప్రమేయం ఉన్నట్లు గతంలో ఆరోపణలు ఉన్నాయి. అక్రమంగా ఫాం 7 కేసుల్లో ముద్దాయిగా ఉన్నారు. రాష్ట్రంవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాకాణి గోవర్ధన్ రెడ్డి తో సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
పరారీలో వైసీపీ నేతలు….
పేలుడు డంపు స్వాధీనం కావడంతో ప్రధాన సూత్రధారి పాత్రధారి వైసిపి నేతలతో పాటు పలువురు మండల నేతలు పరారయ్యారు. పోలీసులు తనిఖీలు సమాచారంతో మండలానికి చెందిన మరికొంతమంది నేతలు గ్రామం విడిచి పరారైనట్లు తెలుస్తుంది. ఇప్పటికే పనులుకొద్ది జిలటన్ స్టిక్స్ పేలుడు సామాగ్రి లభించడం, కీలక సమాచారం లభించడంతో వారు పరారైనట్లు తెలుస్తుంది. హనుమంతరావు పై గతంలో పలు కేసుల్లో ప్రధాన ముద్దాయిగా ఉన్నాడు. 2023లో వినుకొండ వద్ద పేలుడు సామాగ్రి బ్లాస్ట్ అయింది. ఆ సంఘటనలో హనుమంతరావు సోదరుడు కుమారుడు దాసం ఆంజనేయులు ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. అలాగే గత పంచాయతీ ఎన్నికల సమయంలో బల్లికురవలో బ్లాస్టింగ్ మెటీరియల్ ఓ వ్యక్తి మరణించాడు. ఆ కేసులో సైతం హనుమంతరావు ప్రధాన నిందితుడు. వైసిపి అధికారం అడ్డం పెట్టుకొని పలుకేసుల్లో నిందితుడిగా ఉన్న హనుమంతరావు బయటపడుతున్నాడు.
కుట్ర కోణంపై పోలీసుల దర్యాప్తు….
మార్టూరు మండల వైసిపి సీనియర్ నేత ఫ్యాక్టరీ గోడౌన్ నివాసంలో పోలీసుల తనిఖీల్లో జిలెటిన్ స్టిక్స్ తో పాటు కీలక సమాచారం లభించింది. ఎన్నికల ముందు మార్టూరు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు ఫ్యాక్టరీలపై అధికారుల పేరుతో వైసిపి గుండాలు తనిఖీలు నిర్వహించారు. ఆ తనిఖీలలో మారణ ఆయుధాలు , కత్తులు కర్రలు కారం పొట్లాలు లభ్యమయ్యాయి. తాజాగా వైసీపీ నేత ఫ్యాక్టరీలో భారీ పేలుడు పదార్థాలు లభ్యం కావడం వెనుక పోలీసులు రాజకీయ కుట్ర పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పేరుతో మార్టూరు గ్రానైట్ ఫ్యాక్టరీలలో వైసిపి గుండాలు తనిఖీలు నిర్వహించే సమయంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పై దాడి చేసేందుకు యత్నించారు. దీంతో తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రానైట్ వ్యాపారులు వారిని అడ్డుకొని పోలీసులకు అప్పగించారు. తాజాగా వైసీపీ నేత ఫ్యాక్టరీలో భారీ పేలుడు డంపు స్వాధీనం కావడంపై శాంతి భద్రతలకు ముప్పు కలుగుతుందనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
గోప్యంగా పూర్తి సమాచారం …
పోలీసుల తనిఖీలలో కీలక సమాచారాలు వెలుగులకు వచ్చినట్టు తెలుస్తుంది. అయితే పోలీస్ అధికారులు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం అందజేస్తున్నారు. అయితే ఎలాంటి వివరాలు బయటకు రానివ్వకుండా ఉదయం నుంచి రాత్రి వరకు తనిఖీలు చేస్తూనే ఉన్నారు. అయితే పర్చూరు నియోజకవర్గ మార్టూరు మండలంలో పేలుడు సామాగ్రి లభ్యం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. (Story: బిగ్ అప్డేట్: పర్చూరులో భారీ పేలుడు డంప్)
Follow the Stories:
ఇల్లు కట్టిచూడు..రాజధాని నిర్మించి చూడు!
టాప్ ప్రైవేట్ వర్సిటీల్లో ఇంజినీరింగ్ సీట్లు ఉచితం!
ఏపీ ఈఏపీసెట్-2025 Full Details
పర్యవేక్షణ నిల్..ఫలహారం పుల్!
జగన్ చుట్టూ కోటరీ ఎవరు?
Friday Fear: మరో వైసీపీ నేత అరెస్టుకు రంగం సిద్ధం!
రూ.520తో 10 లక్షలు, రూ. 755తో 15 లక్షలు
కొత్త రేషన్ కార్డులొస్తున్నాయి!
సిటీ కిల్లర్ వచ్చేస్తోంది! ముంబయికి ముప్పు?
సడెన్ డెత్: ఈ ఐఫోన్ మోడళ్లను నిలిపేసిన ఆపిల్!
నిరుద్యోగులకు మోదీ బంపర్ ఆఫర్!
మారిన జగన్ వ్యూహరచన: జగన్ 2.0 అంటే ఇదేనేమో!
మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?
జగన్ సెల్ఫీ కోసం ఏడ్చిన చిన్నారి! (Lovely Photos)