దేవినేని అవినాశ్ అరెస్ట్
న్యూస్తెలుగు/విజయవాడ : రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కలెక్టరును వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాశ్ ను పోలీసులు అడ్డుకున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఎటువంటి ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. తామేమి ధర్నాలకు వెళ్లడం లేదని వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్నామని అవినాశ్ పోలీసులకు తెలిపారు. పర్మిషన్ లేదని చెప్పడంతో రోడ్డుపై బైఠాయించారు. (Story : విజయవాడలో ఉద్రిక్తత.. దేవినేని అవినాశ్ అరెస్ట్)