Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ప్రజా పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

ప్రజా పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

ప్రజా పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్

న్యూస్‌తెలుగు/ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) ; ఈనెల 14న తలపెట్టిన ప్రజా పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్ తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో సిపిఎం పార్టీ నాయకులతోపాటు పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యుత్ ట్రూ అప్ చార్జీలు రద్దు చేయాలని, కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. ఉచిత ఇసుక అమలు సరిగా లేదని, నిత్యావసర ధరలు తగ్గించాలని, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెనువెంటనే భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో ఉద్యోగుల తొలగింపును విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా పోలవరం నిర్వహిస్తులకు పరిహారము, ప్యాకేజీ ఇచ్చి, ప్రాజెక్టును విని వెంటనే పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి మారుతి తోపాటు పెద్దన్న ,సిహెచ్ భాషా, ఎస్ఎఫ్ఐ నాగార్జున పాల్గొన్నారు. (Story : ప్రజా పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!