Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఎస్టీ కాలనీలు, తండాల్లో సమస్యలపై మంత్రితో ఎమ్మెల్యే జీవీ భేటీ

ఎస్టీ కాలనీలు, తండాల్లో సమస్యలపై మంత్రితో ఎమ్మెల్యే జీవీ భేటీ

ఎస్టీ కాలనీలు, తండాల్లో సమస్యలపై మంత్రితో ఎమ్మెల్యే జీవీ భేటీ

న్యూస్‌తెలుగు/ వినుకొండ : వినుకొండ నియోజకవర్గంలోని ఎస్టీ కాలనీలు, తండాల్లో సమస్యల పరిష్కారాలు, అభివృద్ధి పనుల నిమిత్తం మంగళవారం రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణితో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సమావేశం అయ్యారు. ఎస్టీ కాలనీలు, తండాల్లో సమస్యలు పరిష్కరించడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు సహకరించాలని కోరారు. మంగళవారం అమరావతిలో ముఖ్యమంత్రి అధ్యక్షతన అసెంబ్లీ హాల్‌లో జరిగిన ఎన్డీయే శాసనసభా పక్షం ప్రజాప్రతినిధుల భేటీ అనంతరం మంత్రితో సమావేశమై పలు అంశాలపై ఆయన చర్చించారు. ముందుగా మంత్రివర్గంలో కీలక బాధ్యతలు దక్కించుకున్నందుకు అభినందనలు తెలియచేస్తూ వినుకొండ నియోజకవర్గం పరిధిలోని ఎస్టీ కాలనీలు, తండాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించాలని కోరారు. కేంద్రం ప్రభుత్వ ప్రాయోజిత పథకాల ద్వారా కూడా తమ నియోజవర్గం పరిధిలోని వారికి ప్రయోజనం చేకూర్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రహదార్లు, మంచినీరు, గృహ నిర్మాణం, విద్యుత్‌, మహిళా సాధికారిత, స్వయం ఉపాధి తదితరాంశాల్లో చొరవ చూపాలని కోరారు. గ్రామ పంచాయతీలకు సాధారణంగా కేటాయిస్తున్న నిధులకు తోడు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాల్సిన అవసరముందని మంత్రి సుధారాణికి ఎమ్మెల్యే జీవీ విజ్ఞప్తి చేశారు. (Story : ఎస్టీ కాలనీలు, తండాల్లో సమస్యలపై మంత్రితో ఎమ్మెల్యే జీవీ భేటీ)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!