Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ప్రాణం నిలిపిన ఎమ్మెల్యే జీవీ మానవత్వం

ప్రాణం నిలిపిన ఎమ్మెల్యే జీవీ మానవత్వం

ప్రాణం నిలిపిన ఎమ్మెల్యే జీవీ మానవత్వం

కాన్వాయ్ వాహనంలో క్షతగాత్రుడిని వైద్యశాలకు త‌ర‌లింపు

న్యూస్‌తెలుగు/వినుకొండ : ఆపద సమయంలో వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు చూపించిన మానవత్వం, సత్వర స్పందన ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడింది. రహదారి ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ప్రాణాలు నిలిపారు. వివరాల్లోకి వెళితే గురువారం వినుకొండ మండలం విఠంరాజుపల్లి వద్ద రహదారి దాటుతుండగా బాధితుడు గాదె మహానందరెడ్డిని లారీ బలంగా ఢీకొట్టింది. సరిగ్గా అదే సమయానికి అటుగా వినుకొండ వెళ్తున్న ఎమ్మెల్యే జీవీ ప్రమాదాన్ని గమనించి వెంటనే తన వాహనం ఆపారు. రహదారిపై గాయాలతో రక్తమోడుతూ పడిఉన్న క్షతగాత్రుడిని చూసి చలించారు. ప్రమాదం విషయం తెలుసుకుని తన కాన్వాయ్‌ వాహనంలో బాధితుడిని వినుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి దగ్గరుండి పంపించారు. అంతేకాక ఎమ్మెల్యే జీవీ తానే స్వయంగా ప్రమాద బాధితుడిని వాహనంలో ఎక్కించారు. ఆ వెంటనే ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడికి ఫోన్ ద్వారా సమాచారం అందించి క్షతగాత్రుడికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధితుడి తలకు గాయమైందని, సీటీ స్కాన్ తీయించి ప్రత్యేక చికిత్స అందించాలని కూడా సూచించారు. అతడి ఆరోగ్య పరిస్థితిపై తనకు తర్వాత కూడా వివరాలు తెలియజేయాలని ఆదేశించారు. (Story : ప్రాణం నిలిపిన ఎమ్మెల్యే జీవీ మానవత్వం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Jacqueline Fernandez Latest Pics