Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌పేదలకు కంటి వెలుగును ప్రసాదించడమే రోటరీ క్లబ్ లక్ష్యం

పేదలకు కంటి వెలుగును ప్రసాదించడమే రోటరీ క్లబ్ లక్ష్యం

పేదలకు కంటి వెలుగును ప్రసాదించడమే రోటరీ క్లబ్ లక్ష్యం

అధ్యక్షులు జయసింహ, కార్యదర్శి నాగభూషణ, కోశాధికారి సుదర్శన్ గుప్తా.

న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్యసాయి జిల్లా) : పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే రోటరీ క్లబ్ యొక్క లక్ష్యము అని క్లబ్బు అధ్యక్షులు జయసింహ, కార్యదర్శి నాగభూషణ,కోశాధికారి సుదర్శన్ గుప్తా తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని సాంస్కృతిక మండలి లో ఈ నెల 20వ తేదీన కంటి వైద్య శిబిరమునకు సంబంధించిన కరపత్రాలను వారు విడుదల చేశారు. ఈ శిబిరము పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) లో ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించబడునని తెలిపారు. ఈ ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరం రోటరీ క్లబ్, శంకరా కంటి ఆసుపత్రి-బెంగళూరు, జిల్లా అందత్వ నివారణ సంస్థ వారి సహకారంతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉచిత వైద్య చికిత్సలతో పాటు, శిబిరంలో కంటి ఆపరేషన్లకు ఎంపికైన వారికి ఉచిత ఆపరేషన్లు, ఉచిత రవాణా ఖర్చు, ఉచితంగా అద్దాలను కూడా పంపిణీ చేస్తామని తెలిపారు. అంతేకాకుండా కంటి నిపుణుల సలహాలతో కళ్ళల్లో ఉచిత లెన్స్ కూడా అమర్చబడునని తెలిపారు. శిబిరమునకు వచ్చువారు ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేదా గుర్తింపు ఓటర్ కార్డులతో ఏదేని రెండు జిరాక్స్ కాపీలు, మూడు ఫోటోలు, ఫోన్ నెంబర్, తగిన చిరునామాతో రావాలని తెలిపారు. అదేవిధంగా కంటి పరీక్షలకు వచ్చువారు ఈ హెచ్.ఎస్ కార్డు గాని ఆరోగ్యశ్రీ కార్డు గాని అవసరం లేదని తెలిపారు. తదుపరి బీపీ, షుగర్ ఎక్కువగా ఉన్నవారు, పరీక్షలు నిర్వహించుకొని, తగ్గించుకున్న తర్వాత రావాలని తెలిపారు. అంతేకాకుండా మా క్లబ్బు ఆధ్వర్యంలో కూడా నేత్రదానం చేయండి, అంధత్వాన్ని నివారించి, రెండు జీవితాలలో వెలుగు నింపాలని వారు పిలుపునిచ్చారు. ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు పివి. రమణారెడ్డి (రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్), కీర్తిశేషులు అనసూయమ్మ ల జాపకార్థం కుమారుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి, సుష్మాలు వ్యవహరించడం జరుగుతుందని తెలిపారు. కావున ఈ ఉచిత కంటి వైద్య శిబిరమును పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో గల పేద ప్రజలు సద్వినియోగం చేసుకొని, కంటి వెలుగును తెప్పించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శివయ్య, ప్రసన్నకుమార్, రత్నశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. (Story : పేదలకు కంటి వెలుగును ప్రసాదించడమే రోటరీ క్లబ్ లక్ష్యం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!