గ్రాన్యూల్స్ ఆదాయంలో వృద్ధి
న్యూస్తెలుగు/హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ 30, 2024 ముగిసిన తొలి త్రైమాసికానికి పటిష్ట ఫలితాలు సాధించామని గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ ప్రసాద్ చిగురుపాటి తెలిపారు. త్రైమాసిక మొదటి ఆర్థిక సంవత్సరం 25 నాటికి ఆపరేషన్ నుంచి రెవెన్యూ మొత్తం 20 శాతం వృద్ధి రేటుతో 11,799 మిలియన్లుగా ఉందన్నారు. నార్త్ అమెరికా నుంచి రెవిన్యూ వాటా 74 శాతం పెరిగిందన్నారు. 20 24 ఆర్థిక సంవత్సరంలో త్రైమాసిక వాటా 61 శాతం ఉండగా 2025 ఆర్థిక సంవత్సరంలో త్రైమాసిక వాటా 74 శాతం ఉందన్నారు. పేరా ఏపీఐ,పిఎఫ్ఐ అమ్మకాల ధరల స్థిరీకరణలో క్షీణత ఉందని పేర్కొన్నారు. పారా ఏపీఐ, పీఎఫ్ఐ అమ్మకాల పరిమాణం, ధర క్షీణతలో క్షీణత ఉందన్నారు. (Story : గ్రాన్యూల్స్ ఆదాయంలో వృద్ధి)

