రాజకీయాలకు అతీతంగా సేవలందిస్తా..
న్యూస్ తెలుగు ప్రతినిధి సిద్దిపేట/ అక్కన్నపేట : తనను గెలిపిస్తే ప్రజల భాగస్వామ్యంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ బలపరిచిన నందారం సర్పంచ్ అభ్యర్థి సుగుర్తి శ్రీలత బాలరాజు అన్నారు.ఈ సందర్భంగా ఓటర్లను కలుస్తూ సర్పంచ్ గెలిపిస్తే రాజకీయాలకు అతీతంగా నందారం గ్రామపంచాయతీకి వన్నె తెచ్చేలా పాలన అందించేందుకు పాటు పడతానన్నారు. బ్యాట్ గుర్తుపై ఓటు వేస్తే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తానని ఇంటింటి ప్రచారం నిర్వహించారు.తమను గెలిపిస్తే మంత్రి పొన్నం సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పరుస్తామని, తాగునీటి, పారిశుద్ధ్యం, వీధిలైట్ల సమస్య లేకుండా చూస్తామని ఓటర్లకు హామీ ఇస్తున్నారు.(Story : రాజకీయాలకు అతీతంగా సేవలందిస్తా.. )

