కాంగ్రెస్ తోనే అభివృద్ధి, సంక్షేమం
సర్పంచ్ అభ్యర్థి గుగులోతు రాజు నాయక్
న్యూస్ తెలుగు ప్రతినిధి సిద్దిపేట/అక్కన్నపేట: అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్తోనే సాధ్యమని చౌటకుంట తండా సర్పంచ్ అభ్యర్థి గు రాజు నాయక్ సూచించారు. బుధవారం కాంగ్రెస్ బలపరిచిన గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి రాజు నాయక్ ఈ సందర్భంగా మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం పేదల అభ్యున్నతికి అనేక సం క్షేమాభివృద్ధి పథకాలు అమలు చేస్తోందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే రాష్ట వ్యాప్తంగా ఇళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇస్తోందన్నారు. రేషన్ కార్డుల మం జూరుతో పాటు సన్నబియ్యం పంపిణీ చేస్తోంద న్నారు. గృహావసరాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తోందని తెలిపారు. అదే విధంగా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తుందని వివరించారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన తమతో పాటు వార్డు సభ్యులను ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. (Story:కాంగ్రెస్ తోనే అభివృద్ధి, సంక్షేమం)

