సేవాలాల్ మహరాజ్ తండా ముందంజలో నిలుపుతా..
న్యూస్ తెలుగు ప్రతినిధి సిద్దిపేట/ అక్కన్నపేట:నేను పుట్టిన గ్రామానికి మంచి చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చాననీ, మంత్రి పొన్నం సహకారంతో పంచాయతీని అభివృద్ధిలో నడిపిస్తా ‘ అని కాంగ్రెస్ పార్టీ బలప చ్చిన సర్పంచ్ అభ్యర్థి జరుపుల సునీత రాజు నాయక్ అన్నారు. బుధవారం సేవాలాల్ తండాలో ఇంటింటి ప్రచారంలో ‘ఉంగరం’ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ మూడేళ్లు అధికారంలో ఉం టుందని.. పార్టీ దుద్దతుతో ప్రతి సంక్షేమ, అభివృ ద్ధి కార్యక్రమాన్ని మీ ముంగిటికి తెస్తానని హామీ ఇచ్చారు. తమని గెలిపిస్తే విద్య, వైద్యం, త్రాగు నీటి సమస్య పరిష్కారం, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తామని, నిర్వాసిత కుటుంబాలకు పరిహార విషయమై పరిష్కరిస్తానని ,సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై సాగు చర్యలు చేపడుతామని హామీలు ఇచ్చారు.(Story:సేవాలాల్ మహరాజ్ తండా ముందంజలో నిలుపుతా..)

