మేము ఆంధ్రలోనే ఉంటాము ..
న్యూస్ తెలుగు/సాలూరు : ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న పనులను ఒరిస్సా ప్రభుత్వం అడ్డుకోవడంతో వివాదాస్పద గిరిజన గ్రామాల ప్రజలు సోమవారం మాజీ డిప్యూటీ సీఎం,వైసీపీ పొలిటికల్ అడ్వైజర్ సభ్యులు రాజన్నదొర ని కలిసిన వారి సమస్యను విన్నవించుకున్నారు.
ఆదివారం సాలూరు మండలం దూళిభద్రకి చెందిన ముగ్గురు గిరిజనులను ఒడిస్సా పోలీసులు తీసుకొని వెళ్లడం పై మీడియా ముందు వారు ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులకు.ఆంధ్రా చేపడుతున్న పనులు ఒడిస్సా ప్రభుత్వం అడ్డుకోవడంపై గిరిజనల ఆవేదన. చెందుతున్నారు.అన్యాయంగా మమ్మల్ని ఒడిస్సా ప్రభుత్వం వేధింపులు తట్టుకోలేక వారిచ్చిన సంక్షేమ పథకాలు మాకు అవసరం లేదంటున్న కొటియా ప్రజలు. కోరుతున్నారు.ఒడిస్సాకి చెందిన రేషన్ కార్డులు,ఆధార్ కార్డులు,పెన్షన్ పుస్తకాలు మన్యం కలెక్టర్ కి అప్పగిస్తామంటున్న ఆరు గ్రామాల గిరిజనులు. ప్రజలు అంటున్నారు.
మాకు ఒడిస్సా ప్రభుత్వ పధకాలు వద్దు. బ్రతికిన,చచ్చినా ఆంధ్రాలోనే ఉంటామని వెల్లడించి తన గోడును మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు&మాజీ గిరిజన సంక్షేమ శాఖా మంత్రి వర్యులు, వైసీపీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు పీడిక.రాజన్నదొర కి విన్నవించుకున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి దండి శ్రీనివాసరావు సర్పంచులు మువ్వల ఆదయ్య ,గెమ్మల.బీసు గారు,చోడిపల్లి బీసు , వైసీపీ నాయకులు నెమలిపిట్ట.కల్యాణ్ దొర ,ఒడిస్సా సరిహద్దు ప్రాంతంలో గల ఆరుగురు సర్పంచ్ లు మరియు తదితరులు పాల్గొన్నారు. (Story:మేము ఆంధ్రలోనే ఉంటాము ..) మేము ఆంధ్రలోనే ఉంటాము ..