Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ స్పీకర్ పదవికి రఘురామ అనర్హుడు: మాల మహానాడు..

డిప్యూటీ స్పీకర్ పదవికి రఘురామ అనర్హుడు: మాల మహానాడు..

0

డిప్యూటీ స్పీకర్ పదవికి రఘురామ అనర్హుడు: మాల మహానాడు..

న్యూస్ తెలుగు/వినుకొండ  : దళితులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్న డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు ఆ పదవికి అనర్హుడని మాల మహానాడు వినుకొండ నియోజకవర్గ అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్లు విమర్శించారు. ఆకివీడులో దళితులపై దాడులు చేయించి, బాధితులైన 57 మందిపైనే అక్రమ కేసులు పెట్టించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.రఘురామపై విద్వేష ప్రసంగాల కింద కేసు నమోదు చేసి, దళితులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దళితులపై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలని, కూటమి పెద్దలు రఘురామను కట్టడి చేయకపోతే ప్రభుత్వానికి పతనం తప్పదని హెచ్చరించారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా దళిత శక్తిని ఏకం చేసి పోరాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు బేతం దేవానంద్, ఇజ్రాయిల్, కృపయ్య, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.(Story : డిప్యూటీ స్పీకర్ పదవికి రఘురామ అనర్హుడు: మాల మహానాడు..)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version