Home వార్తలు తెలంగాణ రాజప్రసాదం మరమ్మత్తులు ఎప్పుడు? ప్రభుత్వానికి సూటి ప్రశ్న…

రాజప్రసాదం మరమ్మత్తులు ఎప్పుడు? ప్రభుత్వానికి సూటి ప్రశ్న…

0

రాజప్రసాదం మరమ్మత్తులు ఎప్పుడు? ప్రభుత్వానికి సూటి ప్రశ్న…

గత ప్రభుత్వంలో వచ్చిన 22 కోట్లు ఎప్పుడు ఖర్చు చేస్తారు

న్యూస్ తెలుగు/వనపర్తి : 2021 సంవత్సరం నుండి రాజప్రసాదం పాలిటెక్నిక్ భవనం కాపాడాలని అఖిలపక్ష ఐక్యవేదిక పోరాటం చేసి సాధించిన విజయంలో భాగంగా గత ప్రభుత్వంలో ఇరవై రెండు కోట్లు వచ్చాయి. కానీ 8 కోట్ల 90 లక్షలకు టెండర్ అయి ఉన్న సమయంలో ఎలక్షన్లు జరిగి కొత్త ప్రభుత్వం వచ్చి అవి వెనక్కి పోయాయని మళ్లీ జీవో నెంబర్ మార్చి తెస్తానని చెప్పిన ఎమ్మెల్యే . కానీ రెండున్నర సంవత్సరాలు అయిపోయిన ఇంకా రాజప్రసాదం పనులు ప్రారంభం కాకపోవడాన్ని నిరసిస్తూ జిల్లా కలెక్టర్ కి ఎమ్మెల్యే కి అఖిలపక్ష ఐక్యవేదిక విజ్ఞాపన చేస్తూ వెంటనే పనులు మొదలుపెట్టించాలని కోరారు. అదనంగా మరొక 20 కోట్లు తెప్పించాలని కోరుతున్నాము. దీంట్లో అఖిలపక్ష ఐక్యవేదిక చేసిన పోరాటాన్ని తక్కువ చేసి చూపడం సరికాదని, మేము చేసిన పోరాటం వల్లనే 22 కోట్లు వచ్చాయనింది ఈ ఫోటోల ద్వారా ప్రజలకు నాయకులకు గుర్తు చేస్తున్నాము..త్వరగా పనులు ప్రారంభం కాకపోతే అఖిలపక్ష ఎక్కువేదిక తరపున ధర్నాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. డాక్టర్ సతీష్ యాదవ్ వెంకటేశ్వర్లు, కొత్తగొల్ల శంకర్, శ్రీనివాసులు, రామస్వామి, మైబూస్ తదితరులు పాల్గొన్నారు.(Story : రాజప్రసాదం మరమ్మత్తులు ఎప్పుడు? ప్రభుత్వానికి సూటి ప్రశ్న… )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version