Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు కల్పించాలి: బీఎస్పీ….

దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు కల్పించాలి: బీఎస్పీ….

0

దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు కల్పించాలి: బీఎస్పీ….

న్యూస్ తెలుగు/వినుకొండ  : దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు వర్తించవన్న సుప్రీంకోర్టు తీర్పుపై ప్రభుత్వాలు రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేరెళ్ల రాజు డిమాండ్ చేశారు. వినుకొండలోని ఆర్టీసీ బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద బీఎస్పీ నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆకివీడు దళితులపై అక్రమ కేసులు ఎత్తివేసి, ప్రభుత్వమే గొంతలమ్మ గుడి నిర్మించాలన్నారు. కుల, మత విద్వేషాలు రెచ్చగొడుతున్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును పదవి నుంచి బర్తరఫ్ చేసి, ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు కంభంపాటి నాగవంశీ, పూనూరి జాన్సన్, వరప్రసాద్, శివప్రసాద్, వెంకటయ్య, రమేష్ బాబు, విజయ్ తదితరులు పాల్గొన్నారు.(Story : దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు కల్పించాలి: బీఎస్పీ…. )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version