సర్పంచు ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు
అభివృద్ధికి బి.ఆర్.ఎస్ పార్టీయే బ్రాండ్ అంబాసిడర్ అని నమ్మిన ప్రజలు
మూడవ విడత సర్పంచు విజేతలను సన్మానించిన మాజీ మంత్రివర్యులు
న్యూస్ తెలుగు/వనపర్తి : గౌరవ మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు మూడవ విడత సర్పంచ్ ఎన్నికలలో గెలుపొందిన విజేతలు 12మందికి మరియు మల్దకల్ మండలం నాగర్ దొడ్డి సర్పంచి నాగర్ దొడ్డి వెంకటేశ్వరమ్మ సత్తెన్న గార్లను ఘనంగా సన్మానించి అభినందించారు.ఈ సందర్భంగా ఎన్నికలలో వీరోచితంగా పోరాడి అధికార పార్టీకి ధీటుగా సమాధానం చెప్పిన నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమములో నందిమల్ల.అశోక్, ప్రేమ్ నాథ్ రెడ్డి, మంద రాము, ఇమ్రాన్,హేమంత్ ముదిరాజ్, జోహెబ్ హుస్సేన్, చిట్యాల.రాము, ముద్ద సార్,ముని అలీమ్, నావాజ్,పటేల్.జనార్ధన్ రెడ్డి,జార్జ్,కిరణ్, యేసుపూ,మోహన్ గౌడ్,హనుమంత్ తదితరులు పాల్గొన్నారు.(Story :సర్పంచు ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు )

