రోడ్డు కు నిధులు కేటాయింపు
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ నియోజకవర్గం, బొల్లాపల్లి మండలం, రేమిడిచర్ల నుండి గండి గనుముల, బొల్లాపల్లి మండలం శివారు వరకు ఆర్ అండ్ బి రోడ్డు కోసం బడ్జెట్ కేటాయించినట్లు డిఇ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ టెండర్లు ఆహ్వానించినట్లు, ఈనెల 15వ తేదీన టెండర్లు ఫైనల్ అవుతాయన్నారు. గత కొంతకాలం నుండి ఈ రోడ్డు నిర్మాణం చేయాలని కలెక్టర్ కి, జిల్లా ఈఈ కి గ్రామ ప్రజలు, ప్రజాసంఘాలు అనేక సందర్భాల్లో అర్జీలు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో ప్రజల అవసరార్థం ప్రభుత్వం స్పందించి ఈ రోడ్డుకి నిధులు కేటాయించింది. గురువారం డిఇ ని కలిసిన వారిలో ఏపీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, టిడిపి ఎస్టి సెల్లు జిల్లా అధ్యక్షులు వి. కోట నాయక్, పిడియం రాష్ట్ర నాయకులు వై. వెంకటేశ్వరరావు, ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జ్ రెడ్డి బోయిన ప్రసన్నకుమార్, వి. దేశ కోట నాయక్, బీసీ నాయకులు సురభి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.(Story : రోడ్డు కు నిధులు కేటాయింపు )

