Homeవార్తలుతెలంగాణగ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ కేంద్రాలను ఆకస్మిక తనిఖీ 

గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ కేంద్రాలను ఆకస్మిక తనిఖీ 

గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ కేంద్రాలను ఆకస్మిక తనిఖీ 

జిల్లా ఎస్పీ సునిత రెడ్డి

న్యూస్‌తెలుగు/ వనపర్తి : గురువారం గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల మొదటి విడత నామినేషన్ల దృష్ట్యా గోపాల్ పేట్, మండలంలోని గోపాల్ పేట్, తాడిపత్రి, గ్రామపంచాయతీలు మరియు ఎదుల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎదుల గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన నామినేషన్ మరియు పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ శ్రీమతి సునిత రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు. నామినేషన్ కేంద్రాల్లో విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందితో ఎస్పీ గారు ప్రత్యేకంగా మాట్లాడి, ఎన్నికల నియమావళి ప్రకారం నామినేషన్ ప్రక్రియ పూర్తిగా నిష్పక్షపాతంగా, శాంతియుతంగా జరుగేలా పనిచేయాలని పలు సూచనలు చేశారు. ఎలాంటి అవాంఛిత పరిస్థితులు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు పారదర్శకమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రతి సిబ్బందిపైన ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికలలో శాంతిభద్రతలను కాపాడటంలో ఎలాంటి రాజీ ఉండదు. ఎన్నికల ప్రక్రియను భంగపరచాలని చూస్తే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవు.” అని స్పష్టం చేశారు. జిల్లాలోని సెన్సిటివ్ గ్రామాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, ప్రతి పోలింగ్ కేంద్రంలో పకడ్బందీ బందోబస్తు, పేట్రోలింగ్, క్విక్ రెస్పాన్స్ టీంలను సిద్ధంగా ఉంచినట్లు ఎస్పీ గారు తెలిపారు. అక్రమ డబ్బు, మద్యం పంపిణీ, బెదిరింపులు, అనైతిక ప్రలోభాలు వంటి తప్పిదాలు ఎక్కడైనా గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వనపర్తి డిఎస్పి, వెంకటేశ్వర్ రావు, కొనపర్తి సిఐ కృష్ణయ్య గోపాల్పేట్ ఎస్సై, నరేష్, రేవల్లి ఎస్సై, రజిత, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు. (Story :గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ కేంద్రాలను ఆకస్మిక తనిఖీ )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!