ప్రజా దర్బార్ లో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ
న్యూస్ తెలుగు /వినుకొండ : వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ లో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని పలు మండలాల నుండి ప్రజలు తరలివచ్చి తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ప్రజల విజ్ఞప్తులను సావధానంగా ఆలకించిన జీవీ, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని, ప్రతి ఒక్కరి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజా దర్బార్ ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం లభిస్తుందని, వారి సమస్యలను నేరుగా తెలుసుకోవడం వల్ల సత్వర పరిష్కారం సాధ్యమవుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిడీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు. (Story:ప్రజా దర్బార్ లో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ)

