గోవా నూతన గవర్నర్గా అశోక్ గజపతిరాజు ప్రమాణ స్వీకారం
న్యూస్ తెలుగు/సాలూరు : గోవా రాష్ట్ర నూతన గవర్నర్గా అశోక్ గజపతిరాజు గోవా రాజ్ భవన్లోని దర్బార్ హాల్లో ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి హాజరై, గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ అశోక్ గజపతిరాజు కీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు వారి అనుభవం, విజ్ఞానం గోవా అభివృద్ధికి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో శ్రీ నారా లోకేష్ , కేంద్రమంత్రి శ్రీ కింజరాపు రామ్ మోహన్ నాయుడు ఎంపీ శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు , స్పీకర్ శ్ర చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు
పల్లా శ్రీనివాసరావు , మంత్రి శ్రీ కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. (Story:గోవా నూతన గవర్నర్గా అశోక్ గజపతిరాజు ప్రమాణ స్వీకారం)

