ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో ప్రజా దర్బార్
న్యూస్ తెలుగు / వినుకొండ : స్థానిక ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ జివి ఆంజనేయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ జివి ఆంజనేయులు ప్రజల నుండి వినతులు స్వీకరించి, వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా చీఫ్ విప్ కి తెలియజేయడంతో, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ప్రజా దర్బార్కు ప్రజల నుండి విశేష స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమం లో నాయకులు పాల్గొన్నారు. (Story:ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో ప్రజా దర్బార్)

